S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/20/2018 - 00:47

కొందుర్గు, నవంబర్ 19: ఎన్నికల నియమావళిలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా రూ.1.85లక్షల నగదు లభించినట్లు ఎస్‌ఎస్ టీం సభ్యులు విజయ్, అనిల్, రాములు తెలిపారు. సోమవారం సాయంత్రం కొందుర్గు మండలం రామచంద్రాపూర్ వద్ద షాద్‌నగర్-పరిగి రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా హైదరాబాద్‌కు చెందిన వాదర్ కలాం ఖాన్ అనే వ్యక్తి ఇన్నోవా వాహనంలో రూ.1.85లక్షల నగదు లభించినట్లు వివరించారు.

11/19/2018 - 23:46

శ్రీరాంపూర్ రూరల్ నవంబర్ 19: శ్రీరాంపూర్‌లోని సింగరేణి కోల్ హడ్లింగ్ ప్లాంట్ సిహెచ్‌పిలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సీ- 7 బెల్ట్ దగ్ధం కాగా కోట్ల రూపాయల నష్టాన్ని అధికారుల అప్రమత్తతో కాపాడారు. ఏరియా జీ ఎం సుభానీ కథనం ప్రకారం సీ- 7కన్వీల్ బెల్ట్ ద్వార వివిధ గనుల నుండి వచ్చిన బొగ్గును లోడింగ్ పాయింట్‌కు తరలిస్తు రేల్వే వ్యాగన్ల ద్వారా సప్లై చేస్తారు.

11/19/2018 - 23:26

కోడుమూరు, నవంబర్ 19:మండల పరిధిలోని క్రిష్ణాపురం గ్రామ సమీపంలో ఉన్న జీడీపీ కాల్వలో ప్రమాదవశాత్తూ పడి ఆదివారం సాయంత్రం హరిజన జాను(3) మృతిచెందాడు. ఈ విషయం తెలియక రాత్రి పొద్దుపోయే సమయంలో పిల్లవాడు కనిపించడం లేదని తల్లీదండ్రులు హరిజన దుబ్బన్న, సోని గ్రామంలో పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం కాల్వలో తేలిన జాను మృతదేహం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.

11/19/2018 - 23:17

సంబేపల్లె, నవంబర్ 19: మండల పరిధిలోని శెట్టిపల్లె సమీపంలో ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న వారిపై పోలీసులు దాడుల చేయగా 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి రూరల్ సీఐ నరసింహరాజు తెలిపారు. సోమవారం సంబేపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ సయ్యద్‌హషంతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

11/19/2018 - 23:14

పాలకొల్లు, నవంబర్ 19: క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకుడు కోట నాగ వెంకట వరప్రసాద్ (నాగబాబు) మృతికి పలువురు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కార్తీక సోమవారం ఉదయం ఆలయంలో పూజలు నిర్వహిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన నాగబాబును ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు ప్రకటించారు. చాలకాలంగా ఆలయంలో అర్చకులుగా నాగబాబు అందరికీ సుపరిచితులు కావడంతో ఆయన మృతి పట్ల భక్తులు విచారం వ్యక్తం చేశారు.

11/19/2018 - 23:13

ఏలూరు, నవంబర్ 19 : ఒక పాత నేరస్తుడు రెండు వేల రూపాయల నోట్లను జిరాక్స్‌లు తీసి చెలామణి చేసేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. హైదరాబాద్ పటాన్ చెరువు చెందిన ఉప్పరి రాజు ప్రసాద్ అలియాస్ రాజు, దొంగనోట్ల చెలామణిలో పాత నేరస్తుడు.

11/19/2018 - 23:06

గోకవరం, నవంబర్ 19: అత్తను అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపిన సంఘటన సోమవారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో తీవ్ర కలకలాన్ని రేకెత్తించింది. ఆ గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బొరి చంటమ్మ (65)ను ఆమె అల్లుడు ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన జాజిమొగ్గల దుర్గాప్రసాద్ కత్తితో కొత్తపల్లి గ్రామం చాకలిపేటలో విచక్షణా రహితంగా నరికి హతమార్చాడు.

11/19/2018 - 23:05

సామర్లకోట, నవంబర్ 19: సామర్లకోట-ద్వారపూడి కెనాల్ రోడ్డులో సోమవారం మోటార్ సైకిల్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో సామర్లకోట మండలం హుస్సేన్‌పురం గ్రామానికి చెందిన మార్ని లోవరాజు (15), అదే గ్రామానికి చెందిన మేడి వీరదుర్గప్రసాద్ (18)లు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

11/19/2018 - 23:00

నూజివీడు : నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. దస్తావేజు లేఖర్లు, కార్యాలయం సిబ్బంది వద్ద ఉన్న 47,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి.

11/19/2018 - 22:56

కోడూరు, నవంబర్ 19: మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో ఇంటింటికి ఫైబర్ నెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సోమవారం ఉదయానే్న విద్యుత్ స్థంభం ఎక్కి కేబుల్ లైన్‌కు సంబంధించిన ఫిట్టింగ్‌లు చేస్తుండగా పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి కోడూరుకు చెందిన పెద్ది ఏడుకొండలు (29) దుర్మరణం చెందాడు. అతనికి సహాయకునిగా వెళ్లిన కేబుల్ యజమాని కళ్ల ముందే కార్మికుడు చనిపోవటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

Pages