-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మధిర, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్లోని తిరువూరు నుండి మధిరకు వస్తున్న ఆర్టిసి బస్సులో మూడులక్షల నగదును ఆత్కూరు చెక్పోస్టు వద్ద ఎస్ఎస్టి టీం అధికారులు పట్టుకున్నారు. తిరువూరు డిపోకు చెందిన ఎపి 20జడ్ 0062 నెంబర్ గల బస్సు మధిరకు వస్తుండగా చెక్పోస్టు వద్ద ఎస్ఎస్టి టీం అధికారులు తనిఖీలు నిర్వహించారు. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామానికి చెందిన మందడపు అశోక్ వద్ద ఈ నగదు పట్టుబడింది.
చింతకాని, నవంబర్ 18: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని నాగిలిగొండ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చాట్ల మధు(22) కుటుంబ కలహాల నేపథ్యంలో తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పంచానామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రోలుగుంట, నవంబర్ 18: ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలడంతో మండలంలోని ఛటర్జీపురం గ్రామానికి చెందిన ఒక యువకుడు మృతి చెందాడు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మండలంలోని సింగరాజుపేట గ్రామానికి సమీపంలో జరిగింది. ఈప్రమాద సంఘటనకు సంబంధించి ఎస్సై హరికృష్ణ అందించిన వివరాలిలా ఉన్నాయి.
కోడుమూరు, నవంబర్ 18: ప్రైవేటు చీటీలు నిర్వహించే కోడుమూరు పట్టణానికి చెందిన ఒక వ్కక్తి రూ.కోటీ 50 లక్షలకు టోకరా పెట్టాడన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రెండు ప్రధాన దేవాలయాల నిర్వాహకులు ఆలయ అభివృద్ధికి ఒక వ్యక్తి ద్వారా ప్రైవేటు చీటీల వ్యాపారాలను ప్రారంభించినట్లు సమాచారం.
ఏలూరు, నవంబర్ 18 : ఏలూరు మండలం మొండికోడు కొల్లేరు గ్రామంలో కొంతకాలంగా ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ నేపధ్యంలో అధికారులు 144 సెక్షన్ విధించినప్పటికీ దాన్ని కూడా లెక్కచేయకుండా రోడ్డున పడ్డారు. బాహాబాహీగా ఘర్షణకు పాల్పడ్డారు. పోలీసులు వున్నప్పటికీ ఘర్షణ తగ్గలేదు. ఈ కొల్లేరు గ్రామంలో ప్రభుత్వ భూమి దాదాపు 750 ఎకరాలు వుంది. అయితే ఆ భూమి పెద్దల స్వాధీనంలోనే వుంది.
ఎచ్చెర్ల, నవంబర్ 18: మండలంలోని చిలకపాలెం కూడలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జరజాపు అప్పయ్య (60) అనే వృద్ధుడు మృతి చెందినట్లు స్థానిక ఎస్సై ఎస్.కృష్ణ తెలిపారు. మృతుడు అప్పయ్య ఎన్నో ఏళ్లుగా చిలకపాలెం కూడలిలో కళాసీగా ప్రయాణీకులుకు సేవలందిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన లారీ ఢీకొట్టింది.
బత్తలపల్లి, నవంబర్ 18: భార్య మృతి చెందిన వార్త తెలుసుకున్న భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన బత్తలపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బత్తలపల్లిలోని ఓ పాత్రికేయుని ఇంట తల్లి, తండ్రి ఇరువురు గంటల వ్యవధిలోనే మృత్యువాతపడడంతో ఆ పాత్రికేయుని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బత్తలపల్లికి చెందిన వడ్డే వెంకటస్వామి (80), భార్య వడ్డే శివమ్మ (60) ఆదివారం మృతి చెందారు.
వంగర, నవంబర్ 17: మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు ప్రధాన గేట్లు దిగువ భాగం బకెట్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తూ పడి మృతి చెందిన సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర విషాధాన్ని నింపింది.
దర్శి, నవంబర్ 17 : దొనకొండ మండలం మంగినపూడి గ్రామంలో మార్చి నెల 26వ తేదిన జరిగిన హుండీ దొంగతనం కేసులోని దొంగలను శనివారం అరెస్ట్ చేసినట్లు దర్శి డియస్పి నాగేశ్వరావు పేర్కొన్నారు.
చీరాల టౌన్,నవంబర్ 17: మహిళను వేధించిన కేసులో యువకుడిని అరెస్టుచేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వన్టౌన్ సిఐ సూర్యనారాయణ శనివారం తెలిపారు. మండలంలోని దేవాంగపురి గ్రామానికి చెందిన మహిళను గుత్తి ఉమాశంకర్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వేధిస్తూ అసభ్యపదజాలంతో వాల్పోస్టర్లను ముద్రించి ఇంటి గోడలపై వేస్తున్నట్లు మహిళ వన్టౌన్ పోలీసుస్టేషన్లో పిర్యాదుచేసింది.