S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/18/2018 - 00:29

విజయవాడ (క్రైం), నవంబర్ 17: నగల వ్యాపారి నుంచి డబ్బు డిమాండు చేసిన ఆరోపణల్లో గవర్నర్‌పేట సీఐ ఇ పవన్‌కుమార్‌రెడ్డి చిక్కుకున్నారు. వ్యవహారం నడిపిన జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ విష్ణుపై అదే స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. వెరసి పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో నిందితుడు విష్ణును అరెస్టు చేసి రిమాండుకు తరలించగా సీఐ పవన్‌కుమార్‌రెడ్డిని వీఆర్‌కు పంపారు.

11/18/2018 - 00:10

కొత్తవలస, నవంబర్ 17: మండలంలోని ఎపి మోడల్ స్కూల్ సమీపంలో పెదగొప్ప వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కాటకాపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ రెడ్డి పైడినాయుడు చిన్నకుమారుడు రెడ్డి సత్యశివ(26) ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు.

11/17/2018 - 06:39

రాజేంద్రనగర్, నవంబర్ 16: రౌడీగ్యాంగ్‌ల మధ్య గొడవను ఆపుదామని నచ్చజెప్పేందుకు వెళ్లిన యువకుడిని రౌడీషీటర్ కత్తితో పొడిచిన హతమార్చిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనలో యువకుడు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయా లయ్యాయి. వివరాల ప్రకా రం.. రాజేంద్రనగర్ సర్కిల్ శాస్ర్తిపురంకు చెందిన మహ్మద్ ముస్తాక్ అదే ప్రాంతంలోని ఓ పాన్‌షాపు వద్ద స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నాడు.

11/16/2018 - 23:51

నల్లగొండ రూరల్, నవంబర్ 16: నల్లగొండ పట్టణ శివారులోని మునుగోడు రోడ్డు బీఈడి కళశాల వద్ద ఎన్నికల అధికారులు (ఫ్లైయింగ్ స్క్వాడ్) వాహనాల తనిఖీ నిర్వహించారు.

11/16/2018 - 23:32

సోంపేట, నవంబర్ 16: నెల రోజులు క్రితం సంభవించిన తిత్లీ తుపాన్ వల్ల మూడు ఎకరాల కొబ్బరి, జీడి పంటలు కోల్పోయి నష్టపరిహారం అందకపోవడంతో మనస్తాపానికి గురై మండలంలో సిరిమామిడి గ్రామానికి చెందిన కె.గణపతి(55) శుక్రవారం మృతి చెందారు. తొలి విడత ఆన్‌లైన్‌లో తన పేరు లేకపోవడం, అదే జీవనాధారంగా కుటుంబాన్ని నెట్టుకువస్తున్నా గణపతి మనస్తాపానికి గురై రెండు రోజులు జ్వరంతో బాధపడి మృతి చెందాడు.

11/16/2018 - 23:22

కంకిపాడు : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యిక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ఉప్పలూరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన వేము కొండయ్య(55) స్థానికంగా వ్వవసాయ కూలీ పనులు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొండయ్య ఉప్పలూరు రైల్వేగేటు వైపు నుంచి సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా ఆర్‌సీం చర్చి సమీపంలో గన్నవరం నుంచి కంకిపాడు వస్తున్న లారీ వెనుక భాగం కొండయ్యను ఢీకొంది .

11/16/2018 - 23:16

పెద్దదోర్నాల, నవంబర్ 16: మండలంలోని వైచెర్లోపల్లి మోట్ల మల్లికార్జునపురంలో ఎపి మోడల్ స్కూల్‌లో విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈవిషయంపై మార్కాపురం డివైఎస్పీ రామాంజనేయులు మోడల్ స్కూల్‌కు శుక్రవారం వెళ్ళి ప్రిన్సిపాల్ నయోమిని, విద్యార్థినులను, ఉపాధ్యాయుడిని విచారించారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈనెల 12వ తేదీన పాఠశాలకు రాలేదు.

11/16/2018 - 23:10

సూళ్లూరుపేట, నవంబర్ 16 : హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శుక్రవారం సూళ్లూరుపేటలో భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన జి మధుకర్ గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే బస్సులో ఒకటిన్నర కిలో బంగారు, రూ.2 లక్షలు నగదు బ్యాగ్‌లో తీసుకొని బయలుదేరారు. ఉదయం సూళ్లూరుపేటకు బస్సు చేరుకొంది.

11/16/2018 - 22:43

మహానంది, నవంబర్ 16: మహానంది మండలంలోని నల్లమల అడవిలో రైలు ఢీకొన్న ప్రమాదంలో చిరుతపులి పిల్ల మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం వారు తెలిపిన వివరాల మేరకు సంవత్సరంలోపు వయస్సు ఉన్న ఈ చిరుత పులి పిల్ల రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందిందన్నారు.

11/16/2018 - 22:34

కొత్తపేట, నవంబర్ 16: కొత్తపేట మండలం వానపల్లిలో శుక్రవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 12 తాటాకిళ్లు దగ్ధమై 19 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వానపల్లి కొత్తరోడ్డులో గల ఒక ఇంట్లో మహిళ వంట చేస్తుండగా పొయ్యి నుండి మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న కొత్తపేట అగ్నిమాపక దళం అధికారులు హుటాహుటీన వచ్చి మంటలను అదుపు చేశారు.

Pages