S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/31/2018 - 23:38

పాలకొల్లు, అక్టోబర్ 31:కాంట్రాక్టర్ ధర్మారావు పిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ వి గోపాలకృష్ణ నేతృత్వంలో పన్ని వలలో పాలకొల్లు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరు రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికి పోయారు. ధర్మారావు పాలకొల్లు మున్సిపాల్టీలో రూ.2కోట్లకు పైగా పనులను సకాలంలో గత మార్చి నెలకే పూర్తిచేశారు.

10/31/2018 - 23:24

రాజవొమ్మంగి, అక్టోబర్ 31: పంట పండించేందుకు చేసిన అప్పులు తీర్చలేననే బెంగతో కౌలు రైతు పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మన్యంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని లాగరాయి గ్రామానికి చెందిన అనివిరెడ్డి సత్యానందం (34) అనే యువరైతు మంగళవారం రాత్రి ఇంటివద్ద చేనుకు ఉపయోగించే పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు అతనిని హుటా హుటిన లాగారాయి పీహెచ్‌సీకి తీసుకెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స చేశారు.

10/31/2018 - 03:51

సిద్దిపేట, అక్టోబర్ 30 : ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలీసు కమిషనర్ ఆదేశానుసారం వాహనాల్లో తనిఖీల్లో మంగళవారం 9,19,340 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట రూలర్ పోలీస్ స్టేషన్ అంబేద్కర్ చౌరస్తాలో సీఐ వెంకట్రామయ్య, ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేయగా 1.04లక్షలు, మరోక వాహనంలో 2,52, 350 రూపాయలు మొత్తం 3,56,350 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

10/31/2018 - 03:48

మహబూబ్‌నగర్, అక్టోబర్ 30: పాలమూరు జిల్లా నవాబుపేట మండలంలో మంగళవారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు దుర్మరణం కాగా, 17 మందికి గాయాలయ్యాయ. నవాబుపేట మండలం పత్తేపూర్ మైసమ్మ ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లక్ష్మమ్మ (42), బాలయ్య (48) అక్కడికక్కడే మరణించారు. డీఎస్పీ భాస్కర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

10/31/2018 - 01:05

రాజేంద్రనగర్, అక్టోబర్ 30: ప్రమాదవశాత్తు కారుకు మంటలు అంటుకొని కారు దగ్ధమైన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో హిమాయత్‌సాగర్ ఔటర్‌రింగు ఔటర్ సర్వీసు రోడ్డుపై టోయాటో కారు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

10/31/2018 - 00:58

ఉప్పల్, అక్టోబర్ 30: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చెంగిచర్ల ఐఓసీ వద్ద నివసిస్దున్న నేపాల్‌కు చెందిన సుకుంబహార్ (34) అడ్డా కూలీ. అతడు పని చేయగా వచ్చిన డబ్బులు సరిపడక, సరిగా పని లేక ఆర్థిక ఇబ్బందులతో బాదపడుతున్నాడు.

10/31/2018 - 00:12

భద్రాచలం టౌన్, అక్టోబర్ 30: మావోయిస్టు మిలీషియాకు చెందిన ఆరుగురు సభ్యులను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుంచి పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్ తెలిపారు. తన కార్యాలయంలో ఆయన శుక్రవారం చర్ల సీఐ సత్యనారాయణ, ఎస్సై రాజువర్మతో కలిసి విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

10/31/2018 - 00:01

అనపర్తి, అక్టోబర్ 30: నకిలీ నోట్లు మారుస్తున్న ఇరువురు వ్యక్తులను అనపర్తి పోలీసులు మంగళవారం అరెస్టుచేసి కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు రామచంద్రపురం డీఎస్పీ జేవీ సంతోష్ అనపర్తి సీఐ కార్యాలయంలో విలేకరులకు వివరించారు.

10/30/2018 - 23:56

తిరుపతి, అక్టోబర్ 30: బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తున్నట్లు నటించి తోటి ప్రయాణికుల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ముఠాను తిరుపతి క్రైమ్ పోలీసులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. డీఎస్పీ రవిశంకర్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

10/30/2018 - 23:55

చిత్తూరు, అక్టోబర్ 30: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరిగుడిసె దగ్ధమైన ప్రమాదంలో ఒక వృద్ధుడు సజీవదహనమైన సంఘటన చిత్తూరు రూరల్ మండలం ఏనుగుండ్లపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకొంది. ఏనుగుండ్లపల్లికి చెందిన సిద్ధయ్య (72) అనే వృద్ధుడు అనారోగ్యంతో ఒక్కడే పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి పూరిగుడిసెకు అంటుకున్నాయి.

Pages