S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/08/2018 - 21:53

మోత్కూర్, అక్టోబర్ 8: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల జెండాలు తొలగిస్తున్న క్రమంలో ఓ మున్సిపల్ కార్మికుడికి కరెంట్ షాక్ తగిలి తీవ్రగాయాలయ్యాయ. ఈ సంఘటన సోమవారం మోత్కూర్ పరిధిలోని ధర్మాపురంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మాపురం గ్రామానికి చెందిన వర్రె లింగయ్య మోత్కూర్ మున్సిపాలిటీలో పంపు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

10/08/2018 - 21:45

బొండపల్లి, అక్టోబర్ 8: మండలంలోని గొల్లలపేట సమీపంలో సాయికృష్ణ పాలిటెక్నికల్ కళాశాల వద్ద ఆదివారం రాత్రి 16.6క్వింటాళ్ళ రేషన్ బియ్యం స్థానిక పోలీసులకు చిక్కాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం పారశాం గ్రామం నుండి టాటా ఎసి ఆటోలో బండారు అప్పారావు అనే కిరాణా వ్యాపారి బొండపల్లి గ్రామానికి తరలిస్తుండగా స్థానిక ఎఎస్సై జగన్నాథం దాడి చేసి వాహనం బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

10/08/2018 - 21:41

బొబ్బిలి(రూరల్), అక్టోబర్ 8: వేగావతి నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతైన సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు, కుటుంబీకులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

10/08/2018 - 21:38

గాజువాక/పరవాడ, అక్టోబర్ 8: నిత్యం బిజీగా ఉండే లంకెలపాలెం కూడలికి కూతవేటు దూరంలో ఒక వ్యక్తి హత్యకు గురి అయ్యాడు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో పరవాడ పోలీసులు అనే్వషణ చేస్తున్నారు. అక్రమ సంబంధమే సదురు వ్యక్తి హత్యకు కారణంగా అందరూ పోలీసులు ఒక నిర్థారణకు వచ్చారు. మృతుడు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే నిందితుడ్ని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.

10/08/2018 - 21:32

మాడుగుల, అక్టోబర్ 8: గిరిజన ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 68 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక ఎక్సైజ్ సి.ఐ. టి.నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని క్రిష్ణపాలెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా హర్యానా రాష్ట్రానికి చెందిన బాబుల్ కుమార్ భక్షి అనే వ్యక్తి కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడినట్టు ఆయన చెప్పారు. గంజాయి తరలిస్తున్న భక్షిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు.

10/08/2018 - 21:31

హుకుంపేట, అక్టోబర్ 8: మండలంలోని తీగలవలస పంచాయతీ కొన్నగరువు గ్రామ సమీపాన గెడ్డలో గుర్తు తెలియని మృతదేహం మంగళవారం లభ్యమయ్యింది. ఈ మార్గంలో కాలినడకన వెళుతున్న గిరిజనులకు గెడ్డ నుంచి దుర్గంధం వెదజల్లడంతో పరిశీలించగా మృతదేహం కనిపించింది. పురుషుని మృతదేహంపై తెల్లచొక్కా, లుంగీ ధరించి ఉందని, గుర్తించలేని విధంగా ఉన్నట్టు చెబుతున్నారు.

10/08/2018 - 21:25

గార, అక్టోబర్ 8: మండలం వత్సవలస పంచాయితీ మొగదాలపాడు గ్రామంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలియజేసిన వివరాలు మేరకు గ్రామానికి చెందిన మైలపల్లి సత్యరాజులు (23) ఉపాదికై విరావళి ప్రాంతానికి వెళ్లి వారం రోజులు క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయం నడకదారిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రక్కగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తెగిపడి ప్రమాదం సంభవించింది.

10/08/2018 - 20:46

సుల్తానాబాద్, అక్టోబర్ 8: ఎన్నికల నేపథ్యంలో సోమవారం సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి, రేగడిమద్దికుంట గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్న షాపులపై పోలీసులు దాడులు నిర్వహించి, పది రూపాయల విలువ గల వివిధ రకాల మద్యం బాటిల్లు స్వాధీనపర్చుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.రాజేష్ తెలిపారు. బెల్టు షాపులు నిర్వహిస్తున్న లింగమూర్తి, ముత్యం, శివకుమార్‌లపై కేసు నమోదు చేశామన్నారు.

10/08/2018 - 20:39

భీమిని, అక్టోబర్ 8: కనె్నపల్లి మండలంలోని మెట్‌పల్లి పంచాయతీ పరిధిలోని కుర్మగూడ గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి ఏర్జుర రాజ్‌కుమార్ (14) ఆదివారం రాత్రి విద్యుత్ షాకుకు గురై మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. కనె్నపల్లి ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..

10/08/2018 - 19:58

మూసాపేట, అక్టోబర్ 8: మండల కేంద్రంలోని పొలిస్‌ష్టషన్ సమిపంలోని సొమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మూసాపేట ఎస్సై మధుసూదన్‌గౌడ్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Pages