S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/07/2018 - 23:47

మల్దకల్, అక్టోబర్ 7: మండల పరిధిలోని నేతువానిపల్లి సమీపంలో ఉన్న సౌమ్య క్రషర్ మిషన్‌లో రాళ్లను డ్రిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రాళ్లు తలకు తగిలి ఉరుకుందు(22) అనే యువకుడు ఆదివారం అక్కడికక్కడే మృతి చెందాడు. గత పది రోజుల నుంచి క్రషర్‌లో పనిచేస్తున్నాడు. గతంలో ఈ క్రషర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు.

10/07/2018 - 06:57

గాజువాక, అక్టోబర్ 6: రైల్వే ట్రాక్ దాటి బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తున్న మొల్లి చాందిని (12) అనే విద్యార్థిని గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ సంఘటనలో చాందిని కుడికాలు కోల్పోయింది. ఈ సంఘటన శనివారం ఉదయం అగనంపూడి శివారు దిబ్బపాలెం వద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించి దువ్వాడ పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి.

10/07/2018 - 05:58

-వరంగల్ క్రైం, అక్టోబర్ 6: తాళంవేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను శనివారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసారు. వారినుండి 35లక్షల రూపాయల విలువచేసే 900గ్రాముల బంగారం, 12కిలోల వెండి అభరణాలు, మూడు ద్విచక్రవాహనాలు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

10/07/2018 - 02:32

లేపాక్షి, అక్టోబర్ 6 : మండల పరిధిలోని కల్లూరు గ్రామ సమీపంలో ఓ వ్యక్తి శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కురుబ దాసన్న (50) మధ్యాహ్నం తన పొలంలో వేసిన మొక్కజొన్న పంటను పరిశీలించేందుకు మధ్యాహ్నం వెళ్లాడు. ఆ సమయంలో పొలంలో గట్టులో పిచ్చి మొక్కలు తొలగిస్తుండగా ముళ్ల కంచె తీగలను పట్టుకున్నాడు.

10/07/2018 - 02:16

తిరుపతి, అక్టోబర్ 6: తిరుపతి బజారు వీధిలోని ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. రూ. 80 లక్షలు విలువచేసే 2 కేజీల, 250 గ్రామల బంగారు గొలుసులు గల్లంతయ్యాయి. దొంగలు ఆధారాలు లభించకుండా దుకాణంలోని సీసీ ఫుటేజ్ రికార్డులను కూడా ఎత్తుకెళ్లారు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు క్రైం పోలీసులు, క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి.

10/07/2018 - 01:10

కోవూరు, అక్టోబర్ 6 : కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. పోలీసుల కధనం మేరకు బుచ్చిరెడ్డిపాళెం నుంచి నెల్లూరు వైపు అధిక వేగంతో మోటారు బైక్‌పై ప్రయాణిస్తూ అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడు ప్రాంతానికి చెందిన వారుగా పాత నేరస్థులుగా పోలీసులు గుర్తించారు.

10/06/2018 - 23:26

త్రిపురాంతకం, అక్టోబర్ 6: మండలంలోని కర్నూలు - గుంటూరు రోడ్డు గనపవరం కోల్డ్ స్టోరేజి వద్ద వినుకొండ నుంచి త్రిపురాంతకం వైపు వస్తున్న కోడిగుడ్ల లోడ్‌తో వస్తున్న ట్రాలీ అతివేగంగా వస్తూ అదుపు తప్పి యర్రగొండపాళెం నుంచి మేడపి వైపు వెళుతున్న గొర్రెల లోడును ఢీకొనడంతో పది గొర్రెలు అక్కడికక్కడనే మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది.

10/06/2018 - 23:07

గూడెంకొత్తవీది, అక్టోబర్ 6: గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో రెండు రోజుల చిన్నారి మృతి చెందింది. గెమ్మిలి రాజు, ఆతని భార్యకు ఒక బాబు పుట్టాడు. ఇంట్లోనే ప్రసవించడంతో ఊపిరందక శనివారం ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది.

10/06/2018 - 06:45

తిరుపతి, అక్టోబర్ 5: తిరుచానూరు సమీపంలోని కమలగిరి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న విశ్రాంత న్యాయమూర్తి సుధాకర్ (62) రేణిగుంట మార్గమధ్యంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని గంటల వ్యవధిలో ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య వరలక్ష్మి మరో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం తిరుపతిలో జరిగింది.

10/06/2018 - 06:27

హాలియా, అక్టోబర్ 5: కుటుంబ తగాదాల నేపథ్యంలో మహిళ తన ఇద్దరి కుమార్తెలు, కుమారుడుతో కలిసి సాగర్ ఎడమకాల్వలో దూకి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన నల్లగొండ జిల్లా హాలియాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆంగోతు మోహన్‌నాయక్ భార్య స్వాతిని నిత్యం తాగి వేధింపులకు గురిచేసేవాడు.

Pages