S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/30/2018 - 01:08

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 29: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ వివాహిత మహిళ అదృశ్యం అయిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి లక్ష్మినర్సింహ్మస్వామి కాలనీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... అన్నోజిగూడ లక్ష్మినర్సింహ్మ కాలనీలో నివాసం ఉంటున్న పరంపాగ వినయ్‌కుమార్ తన భార్య ఇందుశ్రీ(19)తో కలిసి నివాసం ఉంటున్నారు.

09/30/2018 - 01:07

మహేశ్వరం, సెప్టెంబర్ 29: టిప్పర్ వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టిన సంఘటనలో ఒక్కరు మృతి ఇద్దరు గాయాలు పాలైన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం...

09/30/2018 - 00:53

యాడికి, సెప్టెంబర్ 29 : మండల పరిధిలోని వీరారెడ్డిపల్లికి చెందిన రైతు పేరం శిరీష్‌రెడ్డి (25) విద్యుదాఘాతంతో శనివారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తన పొలంలో ట్రాన్స్‌ఫారం వద్ద లైన్‌ను ఆఫ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే రైతులు, కుటుంబీకులు 108 సహాయంతో యాడికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

09/30/2018 - 00:32

చీరాల, సెప్టెంబర్ 29: మండల పరిధిలోని వాడరేవు రోడ్డులో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మత్స్యకార సంఘ నాయకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.

09/30/2018 - 00:20

మైలవరం, సెప్టెంబర్ 29: మైలవరంలో ఇంజనీరింగ్ చదువుతున్న గోళ్ళ రామకృష్ణ(18) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసుల కధనం ప్రకారం గుంటూరు జిల్లా వినుకొండ మండలం వేముల గ్రామానికి చెందిన స్థానిక ఎల్బీఆర్సీఇలో సీఎస్సీ ప్రధమ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను మైలవరంలోని విజయవాడ రోడ్‌లో ఉన్న గాంధీ కోపరేటివ్ అర్బన్ బ్యాంకు భవనం పై అంతస్తులో ఉన్న ప్రైవేటు హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు.

09/30/2018 - 00:16

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 29: గవర్నర్‌పేట పోలీస్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం నూజివీడుకు చెందిన పండ్రంగి శ్రీకాంత్ (38) అనే వ్యక్తి ఈ నెల 27న గవర్నర్‌పేట శివాలయం వీధిలోని ఛాయ లాడ్జి రూం నెంబర్ 204లో బస చేశాడు. గదిలో దిగిన నాటి నుంచి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది లాడ్జి నిర్వాహకులకు తెలియచేశారు.

09/29/2018 - 23:57

బొబ్బిలి(రూరల్), సెప్టెంబర్ 29: రైలు ఢీకొని వివాహిత మృతిచెందిన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి రైల్వే పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం గున్నతోటవలస గ్రామానికి చెందిన కె కళావతి(55) శనివారం ఉదయం పశువులను మేపునకు తరలిస్తు రైల్వేట్రాక్‌ను దాటుతుండగా బొబ్బిలి నుంచి విశాఖ గూడ్స్ రైలు ఇంజన్ వెళ్లడాన్ని గమనించకపోవడంతో ఢీకొంది. దీంతో కళావతి అక్కడికక్కడే మృతిచెందింది.

09/29/2018 - 23:54

ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 29: ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన ఆ బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఏ బస్సులో పాఠశాలకు వెళ్లాడో అదే బస్సు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మండలంలోని జి కొత్తపల్లిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన రెడ్డి బాలాజీ, నాగదుర్గ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు.

09/29/2018 - 00:58

బాలాపూర్, సెప్టెంబర్ 28: బడంగ్‌పేట్‌లోని ఓ రియల్టర్ ఇంటి తాళాలు పగులగొట్టి దాదాపు రూ.20 లక్షల నగదు, 12 తులాల బంగారు నగలను దోచుకెళ్లిన సంఘటన మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సంఘటనకు చెందిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. బడంగ్‌పేట్‌లో నివాసం ఉండే సత్యనారాయణ గౌడ్ కుటుంబ పెద్దలకు బియ్యం ఇవ్వటానికి కుటుంబ సమేతంగా గురువారం మధ్యాహ్నం 11 గంటలకు గగన్‌పహాడ్‌కు వెళ్లాడు.

09/28/2018 - 23:57

18 మందికి సీరియస్.. హైదరాబాద్‌కు తరలింపు
* జయ ఆసుపత్రి నిర్వాకం
* గడువుదాటిన కంటి చుక్కలు వేయడంతో తీవ్ర ప్రమాదం
* ప్రభుత్వంపై వెల్లువెత్తిన విమర్శలు

Pages