-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
బొంరాస్పేట, సెప్టెంబర్ 21: తండ్రి దివ్యాంగుడు.. తల్లి వయస్సు పైబడింది.. పెళ్లికి ఇద్దరు చెల్లెళ్లు.. తాను ఎదో కష్టం చేస్తే తప్ప కుటుంబ ఆర్థిక పరిస్థితులు చక్కబడేలా లేవని భావించి దుబాయ్ వెళ్లి తమ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని భావించాడు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21: ఫ్యూచర్ మేకర్ లైఫ్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ఎఫ్ఎంఎల్సీ) మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో సంస్థ అధినేత రాధేశ్యామ్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా సుమారు 3వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
నక్కపల్లి, సెప్టెంబర్ 21: విశాఖ జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు మహేంద్ర వ్యాన్లో వస్తూ నక్కపల్లి మండలం గొడిచర్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారి సమీపంలో వాహనాన్ని ఆపారు.
గుంటూరు (అరండల్పేట) సెప్టెంబర్ 21: 20 గంటలు.. మూడు ప్రత్యేక బృందాలతో వసంతరాయకాలనీ, శారదా కాలనీలలో పోలీసులు ప్రతి ఇల్లు జల్లెడ పట్టడం.. నగరంలోని అన్ని సీసీ కెమేరాల పరీశీలనకు స్పెషల్టీమ్లు.. స్వయంగా రంగంలోకి దిగిన ఆర్బన్ పోలీసు బాస్..సీన్ కట్ చేస్తే ఇంటి వద్ద అడుకుంటూ అదృశ్యమైన పసిపాప తల్లి ఒడికి చేరి తల్లిదండ్రుల మోములో ‘విజయ’ దరహసం.
చిత్తూరు, సెప్టెంబర్ 21: ఆటోలోనే గర్భిణీ ప్రసవించిన సంఘటన జిల్లా కేంద్రమైన చిత్తూరులోని జిల్లా వైద్యశాల ఆవరణలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇంటి వద్ద పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆ మహిళను ఆసుపత్రికి తీసుకొస్తుండగా, ఆటో ఆసుపత్రి అవరణలోకి రాగానే ఈ నొప్పులు ఎక్కువ కావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమై ఆటో చుట్టు తెరలు ఏర్పాటు చేసి డెలివరీ చేశారు.
సంతమాగులూరు, సెప్టెంబర్ 21: గొర్రెలకు మేత కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని కుందుర్రు గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో మోరబోయిన కోటేశ్వరావు(20) మృత్యువాతపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. మోరబోయిన కోటేశ్వరరావు గొర్రెల మేత కోసం ఆయనదొడ్డిలోని చెట్టు విరుచుకు వచ్చేందుకు వెళ్లాడు. అదే దొడ్డిలో ఉన్న కందిపైరు నూర్చే యంత్రంపై విద్యుత్ సర్వీస్ వైరు పడింది.
తోటపల్లిగూడూరు, సెప్టెంబర్ 21: బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన గంటా అనిత అనే యువతి శుక్రవారం తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు బీచ్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గంటా అనిత శుక్రవారం కోడూరు బీచ్కు ఒంటరిగా వచ్చి అనుమానాస్పదంగా సంచరిస్తూ సముద్రంలో మునిగి లోతుకుపోవడంతో ఈమె చర్యలను గమనించిన పోలీసులు పసిగట్టి ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
తిరుపతి, సెప్టెంబర్ 21: ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు కొత్త మార్గాలను అనే్వషిస్తుంటే వాటిని టాస్క్ఫోర్స్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చిత్తు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జీవకోన సమీపంలోని బీడి కాలనీ వద్ద టాస్క్ఫోర్స్ ఆర్ఎస్ఐ విజయ నరసింహులు బృందం కూంబింగ్ నిర్వహించింది. ఉదయం 5గంటల సమయంలో ఒక కారు అటుగా రావడాన్ని గమనించారు.
బంటుమిల్లి, సెప్టెంబర్ 21: మండల పరిధిలోని ముంజులూరు గ్రామంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన వల్లభ శ్యాం కుమార్ చంద్ (19) మచిలీపట్నం నుండి బంటుమిల్లి వైపు ద్విచక్ర వాహనంపై శుక్రవారం వెళుతుండగా ముంజులూరు గ్రామంలోని కంచడం అడ్డ రోడ్డు వద్ద ప్రమాదానికి గురయ్యాడు.
హనుమాన్ జంక్షన్, సెప్టెంబర్ 21: మండల కేంద్రమైన బాపులపాడు గ్రామంలోని రైల్వేకాలనీ సమీపంలో విద్యుత్షాక్కు గురై ఓ బాలుడు మృతి చెందాడు. హనుమాన్జంక్షన్ ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ముడిచర్ల గ్రామానికి చెందిన అబ్బింది సురేష్ భార్య స్వాతి ప్రసవించేందుకు బాపులపాడు గ్రామంలోని పుట్టింటికి వచ్చింది.