-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
మహబూబాబాద్, సెప్టెంబర్ 18: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో గత కొంత కాలంగా తాళాలు వేసిన ఇళ్ళలోకి చాకచక్యంగా దూరి బంగారు ఆభరణాలు, నగదును దోచుకొపోతున్న నలుగురు దోపిడీ దొంగలతో పాటు 17 తులాల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.
శావల్యాపురం, సెప్టెంబర్ 18: మండలంలోని గంటావారిపాలెం సమీపంలోని అద్దంకి బ్రాంచి కెనాల్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుం ది.
కాకినాడ రూరల్, సెప్టెంబర్ 18: వరుస డెంగ్యూ జ్వరాలు కాకినాడ రూరల్ గ్రామాలను వణికిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా జనం డెంగ్యూ జ్వరాలతో ఆసుపత్రులు పాలవుతున్నారు. దీనికి ప్రధాన కారణం గ్రామాల్లో అపారిశుద్ధ్యమే. గ్రామ పంచాయతీ లలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక జనం బబ్బులకు గురవుతున్నారు. పంచాయతీలలో పాలనా వ్యవస్థ కుంటుపడటంతో అధికారుల అలసత్వం స్పష్టమవుతోంది.
గూడూరు, సెప్టెంబర్18: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంట తీసుకువెళ్లి అత్యాచారం చేసి, ఆ తర్వాత బాలికను ఇంటివద్ద వదిలి వెళ్లిన యువకుడిపై, అతనికి సహకరించిన నలుగురిపై కోట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసారు. కోట ఎస్సై నారాయణరెడ్డి తెలిపిన సమాచారం మేరకు.
కీసర, సెప్టెంబర్ 18: పట్టపగలు బంగారం దుకాణంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించిన సంఘటన దమ్మాయిగూడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం దమ్మాయిగూడ గ్రామంలోని దుబాయ్ బిల్డింగ్ పక్కనే ఉన్న ఆర్ఎస్ రాథోర్ జ్యువెల్లరీ షాపునకు ఆరుగురు గుర్తు తెలియని దుండగులు మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. ఇద్దరు దుండగులు షాపులోనికి ప్రవేశించారు. మిగిలిన నలుగురు షాపు బయట నిలబడ్డారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ముజఫర్పూర్లోని శరణాలయాలలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలన్న పాట్నా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ముజఫర్పూర్లోని శరణాలయాల్లో ఉంటున్న బాలికలు, మహిళలపై చాలాకాలంగా అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయన్న విషయం వెలుగులోకి రావడంతో ఈకేసు విచారణను సీబీఐకి అప్పగించారు.
నరసన్నపేట, సెప్టెంబర్ 18: మండలంలోని లుకలాం గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ముద్దాడ నర్శింగరావు(59) అనుమానస్పధంగా మృతి చెందాడు. మంగళవారం ఉదయం మండలంలోని ముసిడిగట్టు పంచాయతీ ఉప్పరపేట గ్రామం వద్ద జీడి మామిడి తోటలో అనుమానస్పదంగా నర్శింగరావు మృతదేహాన్ని గ్రామస్థులు కనుగొన్నారు. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
నల్లగొండ, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులను నల్లగొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ పంపించారు.
మోత్కూరు, సెప్టెంబర్ 18: ఓ వస్త్ర దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంఘటన మోత్కూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్లోని పగడినగర్కు చెందిన దేవాసి మహేష్, మాణిక్లనే అన్నదమ్ములు కొద్దికాలం క్రితం మోత్కూరులో క్రిష్ణా ఫ్యాషన్ పేరుతో రెండస్తుల భవనంలో బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు.
హైదరాబాద్: ప్రజాసంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఇందిరా ఫార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్ను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్మాచౌక్లో నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గత ఏడాదిగా ధర్నాచౌక్పై ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా కాలయాపన చేయడాన్ని హైకోర్టు మంగళవారం తప్పుపట్టింది.