S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/19/2018 - 00:13

సిద్దిపేట, సెప్టెంబర్ 18 : స్వైన్ ఫ్లూ వ్యాధితో ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో కలకలం రేపుతోంది. స్థానిక గణేశ్‌నగర్‌కు చెందిన మల్లంపల్లికాశీనాధ్ ( 58) టెలికాం డిపార్టుమెంట్‌లో పనిచేస్తు స్వైన్ ఫ్లూ వ్యాధితో మంగళవారం మృతిచెందారు. కాశీనాధ్‌కు గత వారం రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావంతో పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స చేయించుకున్నారు.

09/19/2018 - 04:51

హైదరాబాద్: పెనమలూరు ఎమ్మెల్యే బోడేపూడి ప్రసాద్‌పై వైకాపా ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని మంగళవారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో తాను పలుమార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా హైకోర్టును అశ్రయించారు. మంగళవారం పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

09/19/2018 - 04:50

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరు శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. యర్రగుంట్ల మండలానికి చెందిన గంగరాజు, దానమయ్య ప్రొద్దుటూరు పట్టణ శివారులోని ఆర్టీపీపీ రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా మరో మోటార్ సైకిల్‌పై వచ్చిన నారాయణ, నాగసుబ్బయ్య ఢీకొన్నారు. దీంతో గంగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.

09/19/2018 - 00:02

వనపర్తి, సెప్టెంబర్ 18: వనపర్తి పట్టణంలో రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ వారు ఏర్పాటు చేసిన ప్లెక్సిని చింపి వేయడంతో అతన్ని అరెస్టు చేయాలని వనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి మంగళవారం రోడ్డుపై బైఠాయించారు.

09/18/2018 - 23:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఆహార ధాన్యాల ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని అధిగమించింది. కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో 274.55 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా ఎంచుకున్నారు. వాతావరణం అనుకూలించడం, రైతులకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు వంటి చర్యలతో ఈ ఉత్పత్తులు 284.83 మిలియన్ టన్నులకు చేరాయి.

09/18/2018 - 23:40

తిరుపతి, సెప్టెంబర్ 18: చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐగా పనిచేస్తూ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో బందోబస్తు విధులు నిర్వహించడానికి వచ్చిన సిద్దా తేజోమూర్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ పీలేరుకు చెందిన సంయుక్త అనే మహిళ తిరుమలలో మీడియా ముందుకు వచ్చి కొంతకాలంగా తాను పడుతున్న ఇబ్బందులను వివరించింది.

09/18/2018 - 23:38

గూడూరు, సెప్టెంబర్18: మైనర్ బాలికను నమ్మించి పెళ్లి చేసుకుంటానని అభయమిచ్చి ఆపై కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన సంఘటన నెల్లూరు జిల్లా కోట మండలంలో వెలుగుచూసింది. దీనిపై బాలికను ఇంటివద్ద వదిలి వళ్లిన యువకుడు, అతనికి సహకరించిన నలుగురిపై కోట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కోట ఎస్సై నారాయణరెడ్డి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

09/18/2018 - 23:32

మంచిర్యాల, సెప్టెంబర్ 18: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ టిక్కెట్‌ను తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు ఇవ్వలేదని మనస్తాపంతో ఈనెల 12న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన రేగుంట గట్టయ్య (35) మృతి చెందాడు. వివరాలోకి వెళ్తే..

09/18/2018 - 23:31

కాటారం, సెప్టెంబర్ 18: బడికి వెళ్ళి సక్రమంగా చదువు నేర్చుకోవాలని చెప్పినందుకు కలత చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం వీరాపూర్‌లో జరిగింది. బాలిక తల్లిదండ్రులు లక్ష్మీ, బాపుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వీరి కుమార్తె అచిత (14)ను మంచిగా చదువుకోవాలని సూచించారు.

09/18/2018 - 23:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశ వ్యాప్తంగా జిల్లా స్థాయిలోని సబార్డినేట్ కోర్టుల్లో దశాబ్ధ కాలంగా సుమారు 22లక్షల కేసులు పరిష్కారానికి నోచుకోలేదు. సుధీర్ఘ కాలంగా మొత్తం 2.50 కేసులు కింది స్థాయి కోర్టుల్లో పెండింగ్‌లో ఉండంగా దశాబ్ధ కాలంగా పెండింగ్‌లోవున్న పెండింగ్ కేసులు 8.29 శాతమని తాజాగా జాతీయ జుడిషియల్ డేటాగ్రిడ్ విడుదల చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి.

Pages