S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/17/2018 - 22:55

దుర్గి, సెప్టెంబర్ 17: దుర్గిలో ఆదివారం అర్ధరాత్రి 217 టిక్కీల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పలు గ్రామల నుండి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని వాహనం ద్వారా దుర్గి సబ్ స్టేషన్ వెనుక భాగంలో లారీలతో లోడు చేస్తున్న సమాచారం మేరకు...

09/17/2018 - 22:48

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 17: రాజమహేంద్రవరం కందకంరోడ్డులోని పరుపుల గోదాములో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈసంఘటనలో సుమారు రూ. 8లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. వివిధ కంపెనీల పరుపులు విక్రయించే శ్రీ్ఫమ్ ఏజెన్సీస్, సూర్య జనరల్‌స్టోర్ దుకాణానికి చెందిన పరుపులను గోదావరి రైల్వేస్టేషన్‌ను ఆనుకుని ఉన్న ఒక గోదాములో నిల్వ ఉంచారు.

09/17/2018 - 22:44

కరప, సెప్టెంబర్ 17: కరప మండలం, వేళంగి గ్రామంలో సోమవారం ఆర్ధరాత్రి ఒక ఇంట్లోకి దొంగలు చొరబడి మహిళలను బెదిరించి భారీ మెత్తంలో నగదు, బంగారం అపహరించకుపోయారు. కరప పోలీసులు తెలిపిన వివరాల మేరకు వేళంగి శివాలయం వీధిలో ప్రత్తిపాటి రుక్మిణితో పాటు ఆమె సోదరి చుండ్రు లక్ష్మీకాంతమ్మ నివాసం ఉంటున్నారు.

09/17/2018 - 22:37

ఏలూరు, సెప్టెంబర్ 17 : విజిలెన్స్ అధికారులు ఏలూరు ప్రాంతంలో సోమవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదేపల్లి రోడ్డులోని గాయత్రి నగర్‌లో ఒక టిపొడి గోడౌన్‌పై దాడిచేసి కల్తీ టిపొడిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని లక్షా 83 వేల రూపాయలు విలువచేసే 1300 కేజీల కల్తీ టిపొడిని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

09/17/2018 - 22:34

దర్శి,సెప్టెంబర్ 17:దర్శి పట్టణంలో సాంబ్రాణి పొగ వేసి జీవనం సాగిస్తున్న చిట్లూరి గాలెబ్ సాహేబ్‌ను తన అల్లుడు పాణెం కరీముల్లా కర్రతో తీవ్రంగా కొట్టి చంపిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కరీముల్లా డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో రోజు గొడవలు పడుతుండేవాడు. భర్త మీద అలిగిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది.

09/17/2018 - 22:28

సంగం, సెప్టెంబర్ 17: ఓ గుర్తుతెలియని వాహనం కారును ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఐదుగురికి గాయాలైన సంఘటన సోమవారం సంగం మండల పరిధిలోని పెరమన గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం కడప జిల్లాలోని దర్గాను దర్శించుకుని తిరిగి కారులో నెల్లూరు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.

09/17/2018 - 22:22

తిరుపతి, సెప్టెంబర్ 17: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో 3వ మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం ఏపీ 31, టిఏ 9898 నెంబర్ కారు ప్రమాదానికి గురైంది. తాడేపల్లిగూడెంకు చెందిన చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

09/17/2018 - 22:18

శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 17: శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీలో తొట్టంబేడు జడ్పీటీసీ సభ్యురాలు అనుసూయమ్మ కుమారుడి ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ఈ సంఘటనలో సుమారు 38లక్షల రూపాయలు నగదు, 12లక్షలు విలువ చేసే రెండు వజ్రాల గాజులు వెరసి 50లక్షల రూపాయల భారీ దోపిడీ జరిగింది.

09/17/2018 - 22:14

నిజామాబాద్, సెప్టెంబర్ 17: వేలాది కుటుంబాలకు తీపిని పంచిన నిజాం చక్కెర కర్మాగారం మూతబడడంతో, దీనిపై ఆధారపడ్డ కార్మికుల మనుగడ దుర్లభంగా మారింది. గడిచిన నాలుగేళ్ల నుండి ఉపాధికి దూరమై, వేతనాలకు నోచుకోక కుటుంబాన్ని పోషించేందుకు నరకయాతన అనుభవిస్తున్న కార్మికులు బలవన్మరణాలకు కూడా వెనుకాడడం లేదంటే సమస్య తీవ్రతను ఊహించవచ్చు.

09/17/2018 - 22:06

బేతంచెర్ల, సెప్టెంబర్ 17:మండల పరిధిలోని గూటుపల్లెలో సోమవారం కాళ్ల పారాణి కూడా ఆరని నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడడంతో అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాలు.. గ్రామానికి చెందిన బాలమ్మ, అంజనమ్మ దంపతుల చివరి కుమారుడైన మిన్నల్లగారి నాగేశ్వరరావు(25)కు అదే గ్రామానికి చెందిన సావిత్రమ్మతో ఈ నెల 2వ తేదీ వివాహం చేశారు.

Pages