S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/03/2018 - 00:10

కడెం, సెప్టెంబర్ 2: మండల కేంద్రంలో ఆదివారం ఎస్సై సయ్యద్ ముజాహిద్ తమ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా అత్యంత వేగంగా రెండు వాహనాలు వెళ్తుండగా వాటిని ఎస్సై, పోలీసు సిబ్బంది పట్టుకున్నారు.

09/02/2018 - 23:42

కర్నూలు, సెప్టెంబర్ 2:జిల్లాలో దాదాపు మూడేళ్ల నుంచి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే వ్యక్తిని కర్నూలు సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి అతడి నుంచి రూ. 1.67 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆదివారం సీసీఎస్ డీఎస్పీ హుస్సేన్‌పీర కర్నూలు సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

09/02/2018 - 23:27

చిట్టమూరు, సెప్టెంబర్ 2 : చిట్టమూరు మండలం మల్లాం దళితవాడ సమీపంలో ఆదివారం తెల్లవారుఝామున సాగర్ గ్రంధి ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి చెందిన కార్మికులు ప్రయాణిస్తున్న వ్యాను బోల్తా పడి 30 మందికి స్వల్ప గాయాలు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. డ్రైవర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్పారు. స్థానికులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

09/02/2018 - 23:22

ఏలూరు, సెప్టెంబర్ 2 : ఒక టాక్సీ డ్రైవర్ ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు నేపధ్యంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక గొల్లాయిగూడెంనకు చెందిన ఎండి ఇబ్రహీం ఖాన్ (39) టాక్సీ డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. అతని సోదరుడు మహ్మద్ ఆలీ ఖాన్‌తో కలిసి ఒక కారును కొనుగోలుచేశాడు. ఆ కారు ఇటీవల అపహరణకు గురైంది. అయితే ఇబ్రహీం ఖాన్ ఇంటి వద్ద కారు పోయిందని, ఫిర్యాదుచేశానని తెలియజేశాడు.

09/02/2018 - 23:21

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 2 : తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఎల్.అగ్రహారంలోని శ్రీ శ్రీనివాస ఆగ్రో ప్రొడక్ట్స్ రైసు మిల్లుపై పౌర సరఫరాలు, తూనికలు కొలతలు, ఆహార భద్రత, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వచ్చిన సమాచారం మేరకు డీఎస్‌వో సయ్యద్ యాసిన్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.

09/02/2018 - 23:20

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 2: పట్టణంలోని రాజుల కాలనీ, వినాయకుని గుడి వీధిలో నివసిస్తున్న యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా, బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుని, ఆపై ఆమెకు వచ్చిన సంబంధాన్ని ఫోటోలు, వీడియోలు చూపించి అల్లరి చేస్తున్న స్థానిక శ్రీ విష్ణు ట్రావెల్స్‌కు చెందిన కాగిత సత్యనారాయణపై పలు సెక్షన్ల కింద ఎస్సై అల్లు దుర్గారావు ఆదివారం కేసు నమోదు చేశారు.

09/02/2018 - 23:07

శంఖవరం, సెప్టెంబర్ 2: మండలంలోని కత్తిపూడిలో ఆదివారం తెల్లవారుజామున కంటైనర్ అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. చెన్నై నుండి జంషెడ్‌పూర్‌కు యంత్ర విడిభాగాలతో కూడిన కంటైనర్ వెళ్తుంది. ఆదివారం తెల్లవారుజాము సమయంలో కత్తిపూడిలో హైవే మీద గల లారీ పార్కింగ్ కేంద్రం వద్దకు చేరే సరికి ఇంజన్ భాగం నుండి పొగలు రావడాన్ని డ్రైవర్ బినోద్ గమనించాడు.

09/02/2018 - 22:58

గుర్రంకొండ, సెప్టెంబర్ 2. గుర్రంకొండ మండలం ఎల్లుట్ల పంచాయతీకి చెందిన పసలవాండ్లపల్లెకు చెందిన విద్యార్థిని (17) శనివారం అర్థరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. ఎల్లుట్ల పంచాయతీ పసలవాండ్లపల్లె కు చెందిన అగ్గి రామాంజనేయులు కుమార్తె గుర్రంకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

09/02/2018 - 22:57

చిత్తూరు, సెప్టెంబర్ 2: యాదమరిలో రెండేళ్ల చిన్నారి అదృశ్యం అయిన సంఘటన కలకలం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకొంటున్న ఈ చిన్నారి ఎంతకీ ఇంటికి రాక పోవడంతో తల్లిదండ్రులు స్థానికులు పలు చోట్లు గాలించినా జాడ లేక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

09/02/2018 - 22:50

చిలమత్తూరు, సెప్టెంబర్ 2 : మండల పరిధిలోని హుసేన్‌పురానికి చెందిన వెంకటమ్మ (45) పాముకాటుతో మృతి చెందింది. వెంకటమ్మ గ్రామానికి చివర్లో కాపురం ఉంటోంది. ఈనేపథ్యంలో ఆదివారం తెల్లవారుఝామున ఇంట్లో నిద్రిస్తుండగా చాప కింద వచ్చిన పాము కాటు వేయడంతో మృతి చెందినట్లు భర్త నారాయణప్ప తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరిలించారు.

Pages