S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/31/2018 - 00:12

పాయకరావుపేట, ఆగస్టు 30: మండలంలో రాజనగరం సముద్ర తీరంలో స్నానానికి వెళ్ళి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి తుని ఫ్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న కొంత మంది విద్యార్థులు ఆటోలో రాజనగరం సముద్రతీరంకు స్నానానికి వెళ్ళగా వీరిలో గోరంటి రాజు(19) కోటవురట్ల మండలం శరభవరం కాగా, తుని పట్టణానికి చెందిన పైల వెంకటసాయిరామ్(19)లు సముద్రంలో గల్లంతయ్యారు.

08/31/2018 - 00:07

ఆదోని, ఆగస్టు 30 : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఒక పత్తి వ్యాపారి మార్కెట్ యార్డులో ఉన్న కమీషన్ ఏజెంట్ల ద్వారా రూ. 2కోట్ల వరకూ పత్తి కొనుగోలు చేసి ఆ తర్వాత కమీషన్ ఏజెంట్లకు కొనుగోలు చేసిన పత్తికి సంబంధించి డబ్బులు ఇవ్వకుండా కుచ్చుటోపీ పెట్టినట్లు వ్యాపార వర్గాల ద్వారా తెలుస్తోంది. వివరాలు..

08/31/2018 - 00:03

కర్నూలు, ఆగస్టు 30:నగరంలోని రాజ్‌విహార్ హాటల్‌లో పార్కు చేసిన కారులో రూ. 50 లక్షలు చోరీకి గురైన కేసులో డ్రైవర్ వేముల మల్లికార్జునను అరెస్టు చేసినట్లు కర్నూలు డీఎస్పీ యుగంధర్‌బాబు తెలిపారు. అందుకు సంబంధించి డీఎస్పీ గురువారం నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

08/30/2018 - 23:49

గుంటూరు (అరండల్‌పేట) అగస్టు 30: రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారులే వారి టార్గెట్... ఏమీ తెలియని అమాయకుల్లా బైక్‌లపై తిరుగుతూ చిన్న పిల్లలను అపహరిస్తారు. అనంతంరం వారిని చిత్ర హింసలకు గురిచేసి వారిచేత బలవంతంగా భిక్షాటనతోపాటు, వారిని పలు అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తున్న ముఠాను గుంటూరు రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

08/30/2018 - 23:49

గుంటూరు (అరండల్‌పేట) ఆగస్టు 30: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవర్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అర్బన్ ఎస్పీ సిహెచ్ విజయరావు స్పష్టం చేశారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి సభలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించిన 9 మంది యువకులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

08/30/2018 - 23:46

పిడుగురాళ్ల, ఆగస్టు 30: పిడుగురాళ్ల పట్టణ శివారు సీతారామపురం వద్ద గల క్వారీల వద్ద రైల్వేట్రాక్‌పై ఎర్రచొక్కా, జీన్సు ప్యాంటు ధరించి ఉన్న సుమారు 28 సంవత్సరాల యువకుడు రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. నడికుడి రైల్వేపోలీసులు మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేస్తున్నారు. గుర్తించిన వారు సంప్రదించాలని కోరారు.

08/30/2018 - 23:32

సూళ్లూరుపేట, ఆగస్టు 30: తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను గురువారం తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులతో పాటు జాతీయ రహదారిపై హోలిక్రాస్ సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు.

08/30/2018 - 23:28

అద్దంకి, ఆగస్టు 30 : అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై గురువారం ఉదయం పెళ్లి బృందానికి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఒంగోలుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచికి చెందిన వధూవరులకు తిరుమలలో వివాహం చేశారు.

08/30/2018 - 23:26

ఒంగోలు అర్బన్, ఆగస్టు 30 : కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 24వ తేదీన చీమకుర్తి మండలం ఏలూరు గ్రామానికి చెందిన ఓ బాలిక (14) కిడ్నాప్‌కు గురైంది. ఈ నెల 25వ తేదీన బాలిక తల్లిదండ్రులు ఒంగోలులోని రాష్టమ్రహిళా కమిషన్ సభ్యులు తమ్మిశెట్టి రమాదేవికి ఫిర్యాదు చేశారు.

08/30/2018 - 23:16

జగ్గంపేట, ఆగస్టు 30: ఈనెల 25న జగ్గంపేట మండలంలోని కాట్రావులపల్లి గ్రామంలో దళిత యువకుడు కాటే బాబిని అదే గ్రామానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు యువకులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచి పరారు కావడంతో అప్పటి నుంచి గ్రామం మొత్తం అట్టుడుకుతోంది. దాడిలో గాయాలపాలైన బాబి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Pages