S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/27/2018 - 02:18

జనగామ టౌన్, ఆగస్టు 26: భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ తల్లి, ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. పది సంవత్సరాలుగా అన్యోన్యంగా సాగిన వారి జీవితం మనస్పర్థల కారణంగా వారి కుటుంబం చిన్నాభిన్నమైంది. భర్తతో గొడవపడి ఎనిమిదేళ్ల లోపు వయస్సు గల ఇద్దరు కుమారులను వెంటేసుకొని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జిల్లా కేంద్రమైన జనగామలో చోటుచేసుకుంది.

08/27/2018 - 00:41

హైదరాబాద్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఉగ్రవాదుల టిన్ బాంబు జంట పేలుళ్ల కేసులో తీర్పు సోమవారం వెలువడనుంది. పదకొండేళ్ల క్రితం సచివాలయం సమీపంలోని లుంబినీ పార్కుతోపాటు కోఠీలోని గోకుల్‌చాట్ వద్ద జరిగిన పేలుళ్లకు సంబంధించి సోమవారం ఏన్‌ఐఎ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనున్నది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు.

08/26/2018 - 23:39

మచిలీపట్నం, ఆగస్టు 26: ఒంటరిగా నివసిస్తున్న ఓ వృద్ధ ఆక్వా రైతుకు మాయమాటలు చెప్పి, అతను హోమోసెక్స్‌కు పాల్పడుతున్నట్టు చిత్రీకరించి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందిగా బ్లాక్‌మెయిల్ చేసిన ముగ్గురు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీసులు శనివారం రాత్రి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

08/26/2018 - 22:03

హిందూపురం టౌన్, ఆగస్టు 26 : సర్వే బృందంపై దాడి చేశారన్న ఫిర్యాదుపై స్థానిక వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌తోపాటు మరో 10 మందిపై పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే నవీన్‌నిశ్చల్ అజ్ఞాతంలో ఉండగా ఆయన కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

08/26/2018 - 06:09

జగ్గంపేట, ఆగస్టు 25: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో దళిత యువకుడిపై అయిదుగురు యువకులు దాడికి పాల్పడారు. దీంతో వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామానికి చేందిన దళిత నాయకులు రోడ్డుపై బైఠాయించారు. గతంలో హిందూవులు, క్రైస్తవుల మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో పాతకక్షలు మళ్లీ పొడచూపాయి.

08/26/2018 - 04:47

చల్లపల్లి, ఆగస్టు 25: కృష్ణా జిల్లా కోడూరు మండలంలో జరిగిన ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్‌ఐ వంశీధర్ (33) గల్లంతయ్యారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు గాను తన తల్లితో కలిసి కోడూరు మండలం ఇస్మాయిల్‌బేగ్‌పేట వెళుతున్న ఎస్‌ఐ కోట వంశీధర్ కారు అదుపు తప్పి పంట కాలువలో దూసుకుపోయింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో తల్లి లక్ష్మి ప్రాణాలతో బయట పడగా ఎస్‌ఐ వంశీధర్ గల్లంతయ్యారు.

08/26/2018 - 04:36

గుర్ల, ఆగస్టు 25: అందరితో సరదాగా ఆడుకుంటూ ఇపుడిప్పుడే అడుగులువేస్తున్న చిన్నారి పాపపై కన్నతండ్రే కాలయముడుగా మారాడు. విజయనగరం జిల్లా, గుర్ల మండలం గరికివలస గ్రామంలో శనివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బిడ్డ ఆవాల సుమలత(3)ను తండ్రి శ్రీనివాసరావు గొంతుకోసి హత్యచేశాడు. శ్రీనివాసరావుకు కెంగువ గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు ఇచ్చాడు.

08/26/2018 - 01:56

బల్లియా (యూపీ), ఆగస్టు 25: యూపీ ఓటర్ల జాబితాలో వింతలు విడ్డూరాలు చోటు చేసుకున్నాయి. కాని ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమై తప్పులను సరిదిద్దే ప్రక్రియను చేపట్టారు. వచ్చే ఏడాది 2019 ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం రూపొందిస్తోంది. బల్లియా నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో గందరగోళం నెలకొంది. దుర్గావతి అనే మహిళా ఓటరు పేరు ఉన్న చోట సినీ నటుడు సన్నీ లియాన్ ఫోటో ముద్రితమైంది.

08/26/2018 - 01:15

కోడూరు, ఆగస్టు 25: కోడూరు మండలం ఇస్మాయిల్‌బేగ్ పేటకు చెందిన రామచంద్రపురం ఎస్‌ఐ కోట వంశీధర్ (33) ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద జరిగిన కారు ప్రమాదంలో పంట కాలువలో కొట్టుకుపోయిన ఘటనతో ఆయన స్వగ్రామమైన ఇస్మాయిల్‌బేగ్‌పేటలో విషాదాన్ని నింపింది. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న ఎస్‌ఐ కారు ప్రమాదానికి గురై పంట కాలువలో గల్లంతు కావటం ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా కలచి వేసింది.

08/25/2018 - 23:17

కంగ్టి ఆగస్టు 25 బీదర్ నుంచి అక్రమంగా ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లు మేడ్చిర్ల జిల్లా జిన్నారంకు బూలేరా వాహనాంలో తరలిస్తుండగా కంగ్టి మండలం చాప్టా గ్రామం వద్ద కంగ్టి పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు మాటు వేసి పట్టు కున్నారని ఎంగ్టి ఎస్ ఐ రాజు శనివారంనాడు విలేఖరులకు తెలిపారు.

Pages