S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/15/2018 - 00:21

మచిలీపట్నం, ఆగస్టు 14: కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న చిన్నచిన్న సమస్యలకు మనస్థాపానికి గురైన భార్యాభర్తలు యేడాదిన్నర వయస్సు కలిగిన తమ కుమారుడితో ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఇది. స్థానిక రాజుపేటలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

08/15/2018 - 00:20

గుడివాడ, ఆగస్టు 14: గుడివాడలోని భాస్కర్ థియేటర్ ఎదురుగా ఉన్న ఆదాయపు పన్నుశాఖ కార్యాలయంపై మంగళవారం సాయంత్రం సీబీఐ అధికారులు దాడి చేశారు. రూ.20వేలు లంచం తీసుకుంటున్న వార్డు-2 ఆదాయపు పన్నుశాఖాధికారిణి లక్ష్మీనీరజను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్లోని భార్గవి ఆటోమొబైల్స్ షాపు యజమాని గొడవర్తి ప్రసాద్ వ్యాపార లావాదేవీలకు సంబంధించి లక్ష్మీనీరజ లంచాన్ని డిమాండ్ చేశారు.

08/15/2018 - 00:02

వరంగల్ క్రైం, ఆగస్టు14: పక్కా సమాచారంతో నకిలీ నక్సలైట్‌ను వరంగల్ క్రైం పోలీసులు మంగళవారం హన్మకొండ బస్‌స్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి ఒక కంట్రీమేడు తపంచా, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. క్రైం డీసీపీ బి.అశోక్‌కుమార్, ఏసీపీ బాబురావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

08/14/2018 - 23:32

మంత్రాలయం, ఆగస్టు 14:కన్న కొడుకుల నిరాదరణకు గురైన వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మంత్రాలయం మండల పరిధిలోని కాచాపురంలో గ్రామం వద్ద ఉన్న తుంగభద్ర నది వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. ఎమ్మిగనూరు మండల పరిధిలోని దైవందినె్న గ్రామానికి చెందిన కురువ దానె లక్ష్మీ(70), రామన్న దంపతులకు యల్లప్ప, శేషప్ప కుమారులు.

08/14/2018 - 23:21

టంగుటూరు, ఆగస్టు 14 : మండల కేంద్రమైన టంగుటూరులోని బీసీ కాలనీకి చెందిన చేజర్ల దత్తాత్రేయ , ఉల్లిమిదల దత్తాత్రేయ ఇంట్లో మూడు టన్నుల ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డిఎస్‌పి బి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో డిఎస్‌పి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం విలువ 30 లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు.

08/14/2018 - 23:19

గుడ్లూరు, ఆగస్టు 14: మండలంలోని మొగళ్లూరు గ్రామానికి చెందిన విక్టోరియా(24) మరణించడంతో ఆమెను మొగుళ్లూరులోని స్మశానవాటికలో గత నాలుగు నెలల క్రితం పూడ్చివేసిన సంఘటన జరిగింది. గత కొద్ది రోజుల క్రితం అన్న రామయ్య చెల్లెల మరణంపై అనుమానం రావడంతో సోమవారం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలు మేరకు గుడ్లూరు పోలీసులు పూడ్చిన శవాన్ని పంచనామా కోసం మంగళవారం వెలికి తీసారు.

08/14/2018 - 23:16

పుత్తూరు, ఆగస్టు 14: దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పీఏగా పనిచేసిన ఉపాధ్యాయుడు రమణను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. చాకచక్యంగా కిడ్నాపర్ల నుండి తప్పించుకుని ఇంటికి చేరుకున్న రమణను టీడీపీ నాయకులు గాలి భానుప్రకాష్ మంగళవారం పరామర్శించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

08/14/2018 - 23:14

తిరుపతి, ఆగస్టు 14: గత యేడాదిన్నరగా తిరుపతిలో ఆటోలో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికుల్లోని మహిళలను ఎంచుకుని వారి నుండి బంగారు నగలు చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అట్టియంపట్టికి చెందిన రేవతి (34) అనే నిందితురాలిని మంగళవారం ఆర్టీసీ బస్టాండు వద్ద అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.

08/14/2018 - 23:09

ధర్మపురి, ఆగస్టు 14: బీర్పూర్ మండల కేంద్రంలోని జడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ప్రమాద వశాత్తూ వాహనం బోల్తా పడిన సంఘటనలో మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ధర్మపురి మండలంలోని తీగల ధర్మారం, గాదెపెల్లి తదితర గ్రామాల విద్యార్థులు టిఎస్ 02 యుబి 5663 నెంబరుగల వాహనంలో ప్రతిదినం బీర్పూర్ పాఠశాలకు వెళ్ళివస్తుంటారు.

08/14/2018 - 22:48

పామిడి, ఆగస్టు 14 : ఎదురెదుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో సుమారు 30 మంది తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం సాయంత్రం గార్లదినె్న మండలం కల్లూరు అగ్రహారం సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గుత్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి గుత్తికి వస్తుండగా, గుత్తి నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న కళ్యాణదుర్గం డిపోకు చెందిన మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది.

Pages