S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/13/2018 - 22:07

గొల్లప్రోలు, ఆగస్టు 13: గొల్లప్రోలుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆదివారం నుండి కనిపించడంలేదు. స్థానిక ఈబీసీ కాలనీకి చెందిన శానపల్లి సత్యనారాయణ, పాపయ్య చావిడి వీధికి చెందిన సూర్నీడి తరుణ్‌లులు స్థానిక మాధురి విద్యాలయలో 10వ తరగతి చదువుతున్నారు. వీరిరువురు ఆదివారం సాయంత్రం ట్యూషన్‌కు వెళుతన్నామని ఇంటి వద్ద చెప్పి సైకిళ్లపై బయలుదేరారు.

08/13/2018 - 21:40

హిందూపురం రూరల్, ఆగస్టు 13: గత రెండు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని కొటిపిలో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొటిపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నవీన్‌కుమార్ (13) అనే విద్యార్థి గత శుక్రవారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. ఈమేరకు విద్యార్థి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

08/13/2018 - 03:52

గుంటూరు, ఆగస్టు 12: గుంటూరు సమీపంలోని ఆటోనగర్‌లో ఓ పొగాకు కంపెనీకి చెందిన గోదాములో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో వేలాది బేళ్ల పత్తి దగ్ధమైంది. ఆదివారం వేకువజామున జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పలువురు వ్యాపారులకు చెందిన సుమారు 6వేల పత్తిబేళ్లు దగ్ధమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటి విలువ సుమారు 10కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని భావిస్తున్నారు.

08/13/2018 - 03:30

గుంటూరు, ఆగస్టు 12: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీతాగోవిందం సినిమా పైరసీ బారిన పడి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టటం సంచలనం రేపిన నేపథ్యంలో గుంటూరు పోలీసులు కేసును ఛేదించి సూత్రధారుడిని అరెస్ట్ చేశారు.

08/13/2018 - 00:37

నిజామాబాద్, ఆగస్టు 12: లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఎట్టకేలకు అరెస్టు అయ్యారు. శాంకరీ నర్సింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులు సంజయ్ తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. సంజయ్ రాజ్యసభ సభ్యుడు డీ.

08/13/2018 - 00:32

హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తూ హైదరాబాద్‌లో స్థావరాల కోసం ఐసిస్ యువకులు చేస్తున్న కుట్రలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఛేదించారు. ఐసిస్ సానుభూతిపరులు మహమ్మద్ అబ్దుల్లా బాసిత్ (24) మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ (19)ను ఎన్‌ఐఏ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు.

08/13/2018 - 03:20

తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న గీతిక (19) అనే విద్యార్థిని స్థానిక శివజ్యోతినగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న మరో విషాదకర ఉదంతం ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు వేధింపులే కారణమన్న ఆరోపణలపై సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ విషాదం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. కొందరు వైద్యులపై ప్రభుత్వం వేటు కూడా వేసింది.

08/12/2018 - 23:51

గూడూరు, ఆగస్టు 12:మండల పరిధిలోని మునగాల గ్రామానికి చెందిన రైతు బోయ హనుమంతు(35) అప్పుల బాధలు తాళలేక ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. హనుమంతుకు గ్రామంలో మూడెకరాల భూమి ఉండగా అందులో ఈ ఏడాదిలో పత్తి పంట సాగు చేశాడు. అయితే భూమిలో విత్తనం వేసిన రోజు నుంచి నేటి వరకూ వర్షం జాడే లేకపోవడంతో సాగు చేసిన పంట ఎండిపోయింది. ఏటా వ్యవసాయంపై పెట్టిన పెట్టుబడులు చేతికందకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది.

08/12/2018 - 23:43

మద్దిపాడు, ఆగస్టు 12 : జాతీయ రహదారిపై గుండ్లాపల్లి వద్ద గల భారత్ పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం రాజమండ్రికి సమీపంలోని కొవ్వూరు నుండి నెల్లూరు వైపు రొయ్యల మేతతో వెళుతున్న లారీ ఘటనా స్థలంలో ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టడం జరిగింది.

08/12/2018 - 23:40

జలుమూరు, ఆగస్టు 12: మండలం తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో రైలుపట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పలాస రైల్వేపోలీసులు ఆదివారం గుర్తించారు. శనివారం సాయంత్రం విశాఖనుండి పలాస వైపు వెళ్తున్న గూడ్సు రైలు కింద పడి మరణించివుంటాడని రైల్వే పోలీసుల అభిప్రాయం. తెల్లవారికి మరుగుదొడ్లుకు వెళ్లి మృతదేహం చూసినవారు మరణించిన వ్యక్తి రైలుపై గాయపరిచి కిందకు తోసివేసినట్లు అనుకొంటున్నారు.

Pages