-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
రాప్తాడు, ఆగస్టు 12 : మండలంలోని మరూరు వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశ్రావు (67) మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశ్రావు, సాకే నాగరాజులు ధర్మవరం నుండి వ్యక్తిగత పనులమీద ద్విచక్ర వాహనంలో అనంతపురంకు వెళ్తుండగా మార్గమధ్యలో మరూరు వద్దకు రాగానే జాతీయ రహదారిపై లారీ ఢీకొన్న సంఘటనలో ప్రకాశ్రావు అక్కడికక్కడే మృతి చెందాడు.
చెనే్నకొత్తపల్లి, ఆగస్టు 12 : మండల పరిధిలోని ఎన్ఎస్ గేట్లో ఆదివారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే కానిస్టేబుల్ నాగరాజు తెలిపిన వివరాల మేరకు ఎన్ఎస్ గేట్లో సాయంకాలం సమయంలో గుర్తుతెలియని వృద్ధుడు గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడికి 58 సంవత్సరాలు వయస్సు కలిగి వుంటుందన్నారు. అయితే మృతుడు ఎవరన్నది తెలియాల్సి వుందన్నారు.
కొండమల్లేపల్లి, ఆగస్టు 11: దేవరకొండ పోలీస్ సబ్డివిజన్ పరిధి లోని కొండమల్లేపల్లి పోలీస్స్టేషన్ ఎదుట వాలి అనే గిరిజన మహిళ శుక్రవారం సాయంత్రం క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నర్సీపట్నం,, ఆగస్టు 11: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈనెల 14 నుంచి విశాఖ జిల్లాలో పాదయాత్రకు వస్తున్న వైసీపీ అధినేత జగన్కు స్వాగతం పలికేందుకు ఆపార్టీ శ్రేణులు చేస్తున్న ఏర్పాట్లలో అపశ్రుతి చోటు చేసుకుంది.
మంగళగిరి, ఆగస్టు 11: జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా మంగళగిరి - విజయవాడ మార్గంలో కొలనుకొండ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఆగి ఉన్న లారీని పెట్రోలు ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ట్యాంకర్ నుంచి మంటలు వ్యాపించి ఆ వాహనం నడుపుతున్న డ్రైవర్ అద్దోని ఎర్రప్ప (33) సజీవ దహనమయ్యాడు. క్లీనర్ ఏసుబాబు తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
అనంతపురం సిటీ, ఆగస్టు 11: అనంతపురం నగరంలోని జేఎన్టీయూ ఆవరణలో ఉన్న ఎస్బీఐలో రూ.37 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా, రాజస్థాన్కు చెందిన ఐదుగురు దొంగలు ఈ చోరీలో పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి.
విజయవాడ (పాతబస్తీ), ఆగస్టు 11: విజయవాడలోని కొత్తపేట, భవానీపురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఇద్దరు యువతులు అదృశ్యం కాగా పోలీసులు కేసులు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. గొల్లపూడి మైలురాయి సెంటర్కు చెందిన యువతి (19) అదృశ్యం కాగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ అనే యువకునిపై అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్, ఆగస్టు 11: లాజిస్టిక్ సెగ్మంట్లో మార్కెట్లీడర్గా షాడోఫాక్స్ ఆవిర్భవించిందని సంస్థ సీఈఓ అభిషేక్ బన్సాల్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో సంస్థ 150 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే 22 మిలియన్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు ఆయన తెలిపారు.
మర్రిగూడ, ఆగస్టు 11: ప్రేమించి పెళ్లి చేసుకున్న మోర హన్మంతు తన భార్య ప్రియాంకను పథకం ప్రకారమే దారుణంగా హత్చ చేసి నల్లగొండ జిల్లాలోని రాంరెడ్డిపల్లి గ్రామ శివారులోగల కుమ్మరోళ్లబావిగా పిలువబడే పాడుబడిన బావిలో అర్ధరాత్రి సమయంలో ప్రియాంక శవాన్ని పడవేశాడు. నార్కట్పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన లింగమ్మ అలియాస్ ప్రియాంక మృతదేహానికి సంబంధించిన ఎముకలను శనివారం పోలీసులు బావిలో నుండి వెలికితీశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఏడాది వంద కార్లు అపహరించడం అతని టార్గెట్. అది కూడా మామాలు కార్లు కాదండోయ్.. లగ్జరీ కార్లే. అతని కన్ను ఏ లగ్జరీ కారుపై పడినా అది క్షణాల్లో మాయమవుతుంది. ఇలా గత ఐదేళ్ల అతను దొంగిలించిన లగ్జరీ కార్లు 500 వరకు ఉన్నాయి. కార్లను దొంగిలించిన తర్వాత దేశంలోని వేర్వేరు ప్రదేశాల్లో మారుపేర్లతో విక్రయించడం అతని హాబీ. తరచూ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు విమానంలోనే రాకపోకలు సాగిస్తుంటాడు.