S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/23/2018 - 02:26

శంషాబాద్, జూలై 22: తనకు తాను తెలివైనవాడిగా వ్యవహరించబోయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుఝామున జరిగింది. కిలోఎనబై గ్రాముల బంగారాన్ని కరిగించి వాటిని ‘టూత్ పేస్టు’లోకి మార్చి ఎవరికి తెలియదు అనే భరోసాతో మధురై నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రయాణికుడిని ఎయిర్‌పోర్టు అధికారులు తనిఖీ చేయగా పట్టుబడ్డారు.

07/23/2018 - 03:33

న్యూఢిల్లీ, జూలై 22: దేశంలో పెచ్చుమీరుతున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) వాడకాన్ని అరికట్టేందుకు వైద్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక జాతీయ ప్రణాళికను రూపొందించాలని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను సుప్రీం కోర్టు ఆదేశించింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా మాదకద్రవ్యాలు సేవిస్తున్నారన్న సమాచారంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

07/22/2018 - 23:18

సంతమాగులూరు, జూలై 22: ఆగి ఉన్న లారీని వెనుకనుండి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆగిన్న లారీ ముందు నిల్చుని ఉన్న వ్యక్తిపైకి లారీ దూసుకెళ్లడంతో అతను మృతిచెందగా ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం అద్దంకి-నర్కెట్‌పల్లి రహదారిలో వైదన సమీపంలోని పెట్రోలు బంకు వద్ద ఆదివారం వేకువజామున జరిగింది.

07/22/2018 - 23:18

సంతమాగులూరు, జూలై 22: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బల్లికురవ మండలం వైదన గ్రామ పంచాయతీ పరిధిలోని చవటిమాదిగపల్లెలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో పులి ఏసు దరియమ్మ(35) మృతి చెందింది. వివరాల్లోకి వెళితే యద్దనపూడి మండలం గన్నవరం గ్రామానికి చెందిన నాగుబాము ఏసు కుమార్తె ఏసుదయమ్మకు వైదన పంచాయతీలోని చవటిమాదిక పల్లెకు చెందిన పులి బుజ్జికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది.

07/22/2018 - 22:44

రామగిరి, జూలై 22 : మండలంలోని ఎం.సీ.పల్లి గ్రామ సమీపంలోని పొలంలో ట్రాక్టర్ బోల్తాపడి ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం గరిమేకలపల్లి గ్రామానికి చెందిన రైతు నాగేష్ (27) తన పొలంలో ట్రాక్టర్‌తో వ్యవసాయం చేసుకుంటూ వెనుకకు చూసి బోదులు పరిశీలిస్తుండడంతో ట్రాక్టర్ ముందున్న పాడుబావిలోకి వెళ్ళింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న నాగేష్ ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

07/22/2018 - 22:44

మడకశిర, జూలై 22 : పట్టణ సమీపంలోని మెట్టబండ పాళ్యం వద్ద ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఆదివారం ఢీకొన్న ప్రమాదంలో దాదాపీర్ (30) మృతి చెందాడు. మరో వ్యక్తి గాయాలకు గురయ్యాడు.

07/22/2018 - 22:42

గుత్తి, జూలై 22 : పట్టణ శివార్లలోని ఆశానగర్ శివార్లలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుత్తి ఎస్‌ఐ యువరాజ్ తెలిపిన వివరాల మేరకు పట్టణ శివార్లలోని ఆశానగర్ వెనుకవైపు గుట్టల్లో గుర్తు తెలియని 65 సంవత్సరాల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించగా మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బా ఉంది.

07/22/2018 - 20:35

జైపూర్, జూలై 21: ఏడు నెలల పసికందుపై అత్యాచారానికి పాల్పడిన 19 ఏళ్ల కామాంధుడికి మరణ శిక్ష విధిస్తూ రాజస్తాన్ కోర్టు తీర్పు ఇచ్చింది. 12 సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష విధించే విధంగా లైంగిక నేరాల నిరోధక చట్టాన్ని రాజస్తాన్ అసెంబ్లీ ఈ ఏడాది ఆమోదించింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఒక కేసులో కోర్టు దోషికి మరణ శిక్షను ఖరారు చేసింది.

07/22/2018 - 00:25

ఉప్పల్, జూలై 21: బోడుప్పల్‌లో మేడిపల్లి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. తొలుత ప్రధాన వీధులన్నీ నిర్భందించి దేవేందర్ నగర్, ఇందిరానగర్, రాజీవ్ నగర్ కాలనీలను ఆధీనంలోకి తీసుకుని ఇంటింటికి వెళ్లి నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఇంటి యజమాని ఏమి చేస్తారు, ఎంత మంది నివసిస్తున్నారని పూర్తి సమాచారం సేకరించారు.

07/22/2018 - 00:23

హైదరాబాద్, జూలై 21: జీహెచ్‌ఎంసీలోని ఏ విభాగంలో చూసినా అవినీతే రాజ్యమేలుతోంది. మహానగరవాసులకు జీహెచ్‌ఎంసీ పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా సేవలందించేందుకు సర్కారు ప్రవేశపెడుతున్న ఆధునిక సంస్కరణలు ఏ మాత్రం ఫలించటం లేదు. ఎక్కడికక్కడ మధ్యవర్తులు, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎన్ని సరికొత్త విధానాలను ప్రవేశపెడుతున్నా, యథేచ్ఛగా అవినీతి రాజ్యమేలుతోంది.

Pages