S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/04/2018 - 01:22

ధర్మవరం, జూలై 3 : అనంతపురం ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న రాజవర్మ (21) ఫెయిల్ అయినందుకు మంగళవారం రైలు కింద పడి మృతి చెందిన సంఘటన ప్రసన్నాయపల్లి వద్ద చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు కూడేరు మండలం మరుట్ల గ్రామానికి చెందిన రాజవర్మ పరీక్షలలో ఫెయిల్ కావడంతో గత మూడు రోజులుగా మనోవేదనకు గురై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బంధువులు, పోలీసులు తెలిపారు.

07/04/2018 - 01:21

గోరంట్ల, జూలై 3 : కిరోసిన్ పోసి నిప్పంటించి మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి అదనపు సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించినట్లు ఎస్సై సుధాకర్‌యాదవ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గోరంట్ల మండ లం పాలసముద్రంకు చెందిన రామాంజినప్ప అదే గ్రామానికి చెందిన వితంతువు నారాయణమ్మతో సహజీవనం సాగించేవాడు.

07/04/2018 - 01:03

మచిలీపట్నం, జూలై 3: ఇరిగేషన్ బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన ఆ శాఖ ఎఇ బి అనీల్ కుమార్ మంగళవారం అవినీతి నిరోధక శాఖాధికారుల దాడిలో పట్టుబడ్డాడు. బాధితుడి నుండి రూ.19వేలు లంచం తీసుకుంటుండగా విజయవాడ ఎసీబీ డీఎస్పీ ప్రసాదరావు తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/04/2018 - 01:03

అవనిగడ్డ, జూలై 3: స్థానిక కొత్త ఎడ్లలంకకు చెందిన పులిగడ్డ సూర్యకాంతం (70) అనే వృద్ధురాలిని స్వయంగా అల్లుడే హత్య చేసిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. మద్యం సేవించి ఇంటికి వచ్చిన అల్లుడు వేకనూరు పూర్ణచంద్రరావు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని, తువ్వాలుతో మెడకు ఉరివేసి కర్రతో కొట్టి వెళ్లిపోయాడు.

07/03/2018 - 05:22

కొయ్యూరు, జూలై 1: ప్రమాదవశాత్తు చెట్టు పై నుండి పడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ టెంకలపణుకుల గ్రామానికి చెందిన మత్స్యల హనుమంతరావు(40) అనే గిరిజనుడు ఆదివారం మృతి చెందాడు. ఈమేరకు కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అంతాడ పంచాయతీ టెంకల పణుకుకు చెందిన హనుమంతరావు గురువారం పనసకాయలు కోసేందుకు చెట్టెక్కాడు.

07/03/2018 - 05:18

జీడిమెట్ల, జూలై 2: ఇద్దరు స్నేహితుల మధ్య బెట్టింగ్ ఓ యువకుని ప్రాణం తీసింది. ఈత రాక చెరువులో మునిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిదిలో జరిగింది. పోలీసుల కధనం ప్రకారం రవి నిజాంపేట్ గ్రామ పంచాయతీలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తాడు. గ్రామంలోని ఆలయం వద్ద 15 మంది స్నేహితులకు రవి విందును ఏర్పాటు చేశారు.

07/03/2018 - 05:07

హైదరాబాద్, జూలై 2: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల మంటూ ఆర్టీఏ సెంట్రల్ జోన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రేణుకను బెదిరించి రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో మహిళ సహా ఆరుగురిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

07/03/2018 - 00:33

లింగాలఘణపురం, జూలై 2: గతం లో భూమిని విక్రయించిన వారికే అధికారులు పట్టాచేయడంతో బాధితరైతు తహశీల్దార్ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రంలో సోమవారం జరిగింది. బాధిత రైతులు బడికె కర్ణాకర్, శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం...

07/03/2018 - 00:29

ముధోల్, జూలై 2: తనయుడి చేతిలో తండ్రి హతమైన సంఘటన నియోజకవర్గ కేంద్రంలో కలకలం రేపింది. ఆదివారం రాత్రి కన్నకొడకు తండ్రిని హత్య చేయడం పలువురిని కంటతడి పెట్టించింది. ముధోల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అనె్నమోళ్ల పోతన్న(75) అనే వ్యక్తిని కొడుకు హత్య చేసినట్లు పేర్కొన్నారు. మద్యానికి బానిసైన చిన్న కుమారుడు నాగేష్ పనిచేయకుండా గ్రామంలో తిరుగుతాడని పేర్కొన్నారు.

07/03/2018 - 00:15

పెద్దవూర, జూలై 2: పెద్దవూర మండల తహశీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి మందు గిరిజన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం జరిగింది.

Pages