S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/03/2018 - 00:00

పుత్తూరు, జూలై 2: అప్పుల బాధ భరించలేక భార్యభర్తలు విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్న హేమంత్‌కుమార్ (17) రైల్వే ట్రాక్‌పై మృతి చెంది పడి ఉండగా గుర్తించారు. పుత్తూరులో సంచలనం రేపిన ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

07/02/2018 - 23:58

తిరుపతి, జూలై 2: స్థానిక గేటుపుత్తూరులో ఉన్న కామరాజ్ నగర్‌లో నివాసం ఉంటున్న బాబు, పుష్ప దంపతులు స్థానికుల నుంచి చీటీల పేరుతో దాదాపు రూ.2కోట్లు వసూలు చేసుకుని పరారైన సంఘటన సోమవారం వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హనుమంతప్ప కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన కథనం మేరకు బాబు, పుష్పలు గత 30 సంవత్సరాలుగా చీటీలు వేస్తూ, స్థానికుల నుంచి అధిక వడ్డీల పేరుతో డబ్బులు వసూలు చేశారు.

07/02/2018 - 23:47

అమరాపురం, జూలై 2: మండలంలోని వలస గ్రామానికి చెందిన జయరాజు (62) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన చుట్టు ప్రక్కల వారు వెంటనే పరశురాంపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి చెళ్ళకెర ప్రభుత్వాసుపత్రికి తరిలించేలోపు మృతి చెందాడు. మృతుడు ఇటీవల బోరు బావి తవ్వించి రూ.

07/02/2018 - 23:46

అమడగూరు, జూలై 2: మండలంలోని మహమ్మదాబాద్ వద్ద బావిచెరువుపల్లికి చెందిన నరసింహారెడ్డి (42) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మహమ్మదాబాద్‌లోని మద్యం షాపు వెనుక కంపచెట్లలో హత్యచేసి పడేసినట్లు స్థానికులు సోమవారం గుర్తించి, ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఎవరు హత్య చేశారు, హత్యకు గల కారణాలు ఏమిటని తెలియరాలేదు.

07/02/2018 - 23:40

ఏలేశ్వరం, జూలై 2: భార్యపై అనుమానంతో కత్తితో గొంతు కోసి చంపిన ఒక కసాయి భర్త ఉదంతం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.

07/02/2018 - 23:29

మనుబోలు, జూలై 2: కూతురు ప్రేమ, పెళ్లి వ్యవహరం భార్యకు ముందుగానే తెలుసునన్న అనుమానంతో ఓ భర్త భార్యను తలపై ఇనుపరాడ్‌తో కొట్టి హతమార్చిన సంఘటన మండల పరిధిలోని కొమ్మలపూడి సమీపంలోని పిడిఆర్ గార్డెన్స్ ఎదురుగా జాతీయ రహదారిపై అదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

07/02/2018 - 23:23

అర్ధవీడు, జూలై 2: మండలంలోని ఒక మహిళ కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంకభూపాలెంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన సాలమ్మ (40) కడుపునొప్పితో గత కొంతకాలంగా బాధపడుతోంది. గోలపురాయుడు సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అర్ధవీడు ఎస్సై రవీంద్రరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

07/02/2018 - 22:16

ఖమ్మం(క్రైం), జూలై 2: రాష్ట్రంలో పలు దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇద్దరు దొంగలను ఖమ్మం పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకొని 12లక్షల విలువ గల బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌కమిషరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వివరాలను వెల్లడించారు.

07/02/2018 - 22:15

బోనకల్, జూలై 2: మండల కేంద్రంలోని బోనకల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చిరునోముల గ్రామానికి చెందిన కర్లపూడి కిషోర్ (16) 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుకొని తల్లిదండ్రులు మందలించగా ఇంటి నుండి బయటకు వెళ్ళి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

07/02/2018 - 22:13

కూసుమంచి, జూలై 2: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కూసుమంచి మండలం గంగబండతండాలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే కూసుమంచి నుండి కొండపల్లి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం గంగబండ తండా వద్ద రాజేశ్వరపురం నుండి కూసుమంచి వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న గుంటి నాగేశ్వరరావు(52), అతని భార్య అనుసూయమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.

Pages