S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/24/2018 - 04:23

కలిగిరి, జూన్ 23: మండలంలోని కుమ్మరకొండూరు పొలాల్లో జలదంకి మండలం కేశరంకు చెందిన గద్దె జయరామయ్య(50) గొర్రెల దొడ్డి వద్ద హత్యచేసిన సంఘటన శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల మేరకు జలదంకి మండలం కేశవరంకు చెందిన జయరామయ్య రెండు నెలల క్రితం గొర్రెలను తోలుకుని తన చెల్లెలు ఇంట్లో వుంటున్నాడు. గొర్రెలను అక్కడే మేపుకుంటూ కాపుగర్ల మాల్యాద్రి తోటలో గొర్రెల దొడ్డి వేసుకుని అక్కడే ఉండేవాడు.

06/24/2018 - 04:21

ఆత్మకూరు, జూన్ 23 : పనె్నండేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సుదీర్ఘ కాలం వేచి చూచి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. శనివారం స్థానికి సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి హత్యకు గల కారణాలను వెల్లడించారు. డీఎస్పీ రామాంజనేయులురెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

06/24/2018 - 04:16

కోడుమూరు, జూన్ 23:కోడుమూరు, ప్యాలకుర్తి గ్రామాల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన మధుసుధాకర్(28) మృతిచెందాడు. వివరాలు.. మధుసుధాకర్ ఉదయం ద్విచక్ర వాహనంపై మండల పరిధిలోని ప్యాలకుర్తి గ్రామానికి వచ్చాడు. ఇక్కడ పని ముగించుకుని చంద్రశేఖర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై కోడుమూరుకు వస్తుండగా ఎమ్మిగనూరు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీ కొంది.

06/24/2018 - 04:15

కల్లూరు, జూన్ 23:మండల పరిధిలోని లక్ష్మీపురం జగన్నాథగట్టుపై వెలసిన కోనేటిలో శనివారం ప్రమాదవశాత్తూ కాలు జారి కోనేటిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు.. వెల్దుర్తి గ్రామానికి చెందిన అగ్గిరాముడు కుమారుడు పసుపుల జయాకర్(కృష్ణ) జన్ననాథగట్టుపై వారి బంధువులు పుట్టెంట్రుకలు తీయిస్తుండటంతో అక్కడకి వచ్చారు.

06/24/2018 - 03:55

ఇబ్రహీంపట్నం, జూన్ 23: కంచికచర్లలోని మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు పవిత్ర సంగమం వద్ద గల్లంతయ్యారు. సేకరించిన సమాచారం ప్రకారం కంచికచర్ల మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కాలేజీలో తరగతులు జరగకపోవటంతో శనివారం ఆట విడుపుగా ఐదుగురు విద్యార్థులు బయటకు వచ్చారు.

06/24/2018 - 03:52

కంకిపాడు, జూన్ 23: ప్రేమించినవాడి చేతిలో మోసపోయిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని పునాదిపాడులో సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పునాదిపాడు బీసీ కాలనీలో నివసించే లోయ రాణి(24) మైలవరంలోని లకిరెడ్డి బాలరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో గత సంవత్సరం ఈసీఈ పూర్తిచేసుకొని ఇంటి వద్ద ఖాళీగా ఉంటోంది. ఆమె ప్రేమించిన వ్యక్తి మోసగించినట్లు గుర్తించి తీవ్ర మనస్థాపానికి గురైంది.

06/24/2018 - 01:53

బొల్లాపల్లి, జూన్ 23: ఆస్తి వివాదం నేపథ్యంలో అన్నను తమ్ముడు హతామార్చాడు. ఈ సంఘటన బొల్లాపల్లి మండలంలోని గరికపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొంతు వెంకటయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి ఉన్న ఉమ్మడి ఇంటి స్థలం తండ్రితో పాటు అన్నదమ్ములు ఇద్దరూ పెద గోపాల్ (38), తమ్ముడు పున్నారావులు కొంత కాలం కిందట పంచుకున్నారు.

06/24/2018 - 01:52

దాచేపల్లి, జూన్ 23: దాచేపల్లిలో అక్రమంగా తరలి వెళుతున్న 240 బస్తాల లోడ్‌గల రేషన్ బియ్యం లారిని శనివారం పోలీసులు పట్టుకొని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు 2.76లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

06/24/2018 - 01:51

పిడుగురాళ్ల, జూన్ 23: బాలుడు ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణం లెనిన్ నగర్ మండల పరిషత్ హైస్కూల్‌లో శనివారం జరిగింది.

06/24/2018 - 01:46

కాకినాడ, జూన్ 23: పెదపూడి మండలంలోని జి మామిడాడలో ఓ బంగారు నగల దుకాణంలో జరిగిన చోరీకి గురైన 22 లక్షల బంగారు, వెండి వస్తువుల కేసులో నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. వీరిని కాకినాడలోని ఓ భవనంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 10వ తేదీన మామిడాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర నగల దుకాణంలో ఈ చోరీ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో వివరించారు.

Pages