-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
గుత్తి, మే 20: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుత్తిఆర్ఎస్ పత్తికొండ రోడ్డులో గల లోకేష్ అనే వ్యక్తి ఇంట్లో శనివారం రాత్రి చోరి జరిగింది. సంఘటనలో 20 తులాల బంగారు నగలు, 2లక్షలకు పైగా నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
శంకరపట్నం, మే 19: శంకరపట్నం పోలీసు స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న మొలంగూర్ గ్రామానికి చెందిన పకురుల్లా వడదెబ్బతో శనివారం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా శంకరపట్నం పోలీసు స్టేషన్లో పరుకుల్లా హోంగార్డుగా పనిచేస్తు అందరితో కలిసిమెలసి ఆప్యాయంగా పలకరించేవాడని, అతడు వడదెబ్బతో మృతి చెందడం తమను దిగ్బ్రాంతికి గురిచేసిందని మండల ప్రజలు అన్నారు.
న్యూఢిల్లీ, మే 19: మణిపూర్ బూటకపుఎన్కౌంటర్ల కేసుల దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై రక్షణ మంత్రిత్వశాఖ తీరును సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసుల బూటకపుఎన్కౌంటర్లపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) ఏర్పాటైంది. పోలీసు ఎన్కౌంటర్లపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరిపింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బూటకపుఎన్కౌంటర్లపై విచారణకు సిట్ను ఏర్పాటు చేశారు.
ఒంగోలు, మే 19: జిల్లాలో పార్థీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సోషల్మీడియాలో అస్యత్య ప్రకటనలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఒంగోలు పట్టణ డిఎస్పి బి శ్రీనివాసరావు తెలిపారు.
హైదరాబాద్, మే 19: నగరంలోని ఈస్ట్జోన్ మలక్పేట రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీఓ) ఎ.నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. నాగరాజుతో పాటు ఆ కార్యాలయంలో పనిచేసే హోంగార్డు టి.వెంకటరమణ, కె.శివశంకర్గౌడ్ అనే మరో ప్రైవేట్ వ్యక్తిని కూడా ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేశారు. అంబర్పేటకు చెందిన మహ్మద్ లతీఫ్ ఖురేషి అనే వ్యక్తికి చెందిన ట్రావెల్ కారు ప్రమాదానికి గురై కాలిపోయింది.
షాబాద్, మే 19: షాబాద్ మండల కేంద్రంలోని దుర్గ్భావాని వైన్స్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ దోంగతనం చోటు చేసుకుంది. చేవెళ్ల సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండల పరిధిలోని ముద్దెం గూడ గ్రామానికి చెందిన మాల మహేందర్ (25) గత కొంత కాలంగా వైన్స్లో పని చేస్తున్నాడు, అతనికి నెలకు రూ. 10వేలు జీతం ఇస్తున్నారు. వైన్స్ నిర్వాహకులకు తెలువకుండా క్యాష్ కౌంటర్ నుంచి రూ.2లక్షల 65వేల రూపాయలను దొంగలించారు.
కట్టంగూర్, మే 19: హైదరాబాద్- విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై మండలకేంద్రమైన కట్టంగూర్ శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.
దత్తిరాజేరు, మే 18: మండలంలోని మరడాం-కోమటపల్లి గ్రామాల మధ్య తాడేంద్రవలస రహదారి జంక్షన్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఎస్.బూర్జివలస పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కాకినాడ సిటీ, మే 18: కళ్యాణ మండపాల్లో జరిగే వేడుకలను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు చోరులను అరెస్టుచేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలియజేశారు. శుక్రవారం మధ్యాహ్నాం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పట్టుబడిన చోరుల వివరాలను తెలియజేశారు.
కర్నూలు, మే 18:ఓ మహిళా ఉద్యోగి ఏకంగా కలెక్టరేట్ మేడపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నగరంలో సంచలనం రేపింది. కలెక్టరేట్లో శుక్రవారం డీఆర్సీ సమావేశం ఉండటంతో ఆళ్లగడ్డలో స్ర్తి శిశు సంక్షేమశాఖలో(ఐసీడీఎస్) సూపర్వైజర్గా పని చేస్తున్న శోభారాణి కర్నూలుకు వచ్చారు. సమావేశం జరుగుతుండగానే ఆమె కలెక్టరేట్ మేడపైకి వెళ్లి ఉదయం 11గంటల ప్రాంతంలో కలెక్టర్ బంగ్లా వైపు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది.