-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
చింతపల్లి, మే 1: మండలంలోని గడియాగౌరారం సమీపంలో హైద్రాబాద్-సాగర్ రోడ్డు మార్గంలో మంగళవారం డిసిఎం, బైక్ ఢీ కొన్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుంటూరు జిల్లా కారంపుడికి చెందిన తాపిమేస్ర్తీ దేవేండ్ల ఏడుకొండలు(40) బైక్పై స్వగ్రామానికి వెలుతుండగా హైద్రాబాద్ వెలుతున్న డిసిఎం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
పెనుగంచిప్రోలు, మే 1: బతుకు తెరువుకోసం ఆలయం వద్ద ఆశ్రయం పొందుతూ అదే గుడికి కన్నం వేశాడు ఒక ప్రభుద్ధుడు. దేవాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాలు దొంగతనం చేస్తుండగా ఆ ప్రభుద్ధుడిని పట్టించిన ఘటన పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
అరకులోయ, మే 1: పోలీసులు ఎస్.ఎఫ్.ఐ. నాయకులపై బనాయించిన కేసును స్థానిక ప్రధమ శ్రేణి ఎగ్జిక్యూటివ్ మండల మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం కొట్టివేసింది. 2016వ సంవత్సరం అక్టోబర్ నెలలో విశాఖపట్నం క్రిష్ణ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న బి.రాజ్కుమార్ ప్రాణాంతక వ్యాధికి గురై మృతి చెందాడు.
కశింకోట, మే 1: నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి పరిమితికి మించి ఆవులను వ్యాన్ల్లో తరలిస్తున్న 12 మంది రైతులపై కశింకోట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పొదిలి, మే 1: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన పొదిలి మండలంలోని అక్కచెరువు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. ఆ గ్రామానికి చెందిన ఎం రమణయ్య (43) మరియు అమ్మిరెడ్డి అనే ఇద్దరు మోటార్ సైకిల్పై పొదిలి వైపు వస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో రమణయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
పొదలకూరు, మే 1 : మండలంలోని రామాపురం సమీపంలో దుగ్గుంట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాపురం గ్రామానికి చెందిన వి సుబ్రహ్మణ్యం (35) అనే గిరిజనుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న సుబ్రహ్మణ్యంను నెల్లూరు నుంచి రాపూరుకు వెళ్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన ఇతన్ని నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
పెద్దకడబూరు, మే 1 : మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామానికి చెందిన నాగరాజు(20) అనే యువకుడిని బలవంతంగా తీసుకుపోయి నోటిలో పురుగుల మందు పోసి హత్య చేసిన సంఘటనలో ఆదే గ్రామానికి చెందిన 12 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివాంజల్ మంగళవారం విలేఖర్లకు తెలిపారు. ఎస్ఐ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు నాగరాజు గత కొన్ని రోజుల క్రితం జగ్గాపురం గ్రామానికి వివాహానికి వెళ్ళాడన్నారు.
జూలూరుపాడు, మే 1: మండల పరిధిలోని సాయిబాబు సమీపంలో తల్లాడ-కొత్తగూడెం ప్రధాన రహదారిపై మంగళవారం ఆటోబోల్తా కొట్టిన సంఘటనలో రాగం మురళి (25) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు కథనం ప్రకారం.. తల్లాడ మండలం అన్నారుగూడెంకు చెందిన అనుమోలు సర్వేశ్వరరావు అదే గ్రామానికి చెందిన రాగం మురళితో కలిసి జూలూరుపాడు ప్రాంతానికి ఆటోలో వ్యాపారం చేస్తుంటారు.
దుమ్ముగూడెం, మే 1: మావోయిస్టులు అమర్చిన ల్యాండ్మైన్కు సంబంధించిన సామాగ్రిని దుమ్ముగూడెం పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది, బాంబ్స్క్వాడ్ సిబ్బంది మంగళవారం నిర్వీర్యం చేశారు. దుమ్ముగూడెం ఎస్సై బాలకృష్ణ విలేఖర్లకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గండేపల్లి, మే 1: జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి మల్లేపల్లి గ్రామంలోని ఓ హోటల్ వద్ద ఐసర్ వ్యాన్ మంటల్లో దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..జగ్గంపేట వైపునుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఐసర్ వ్యాను మంగళవారం ఉదయం ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటన జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. స్థానిక పోలీసులు ఢీకొట్టిన వ్యానును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు.