S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/30/2018 - 23:56

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 30: అనంతపురం జిల్లా ఓడీచెరువు మండల పరిధిలోని డబురువారిపల్లి మిట్ట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుట్టపర్తి మండలం సాదర్లపల్లి గ్రామానికి చెందిన దారా గీత (13), అమడగూరు మండలం మహమ్మదాబాద్‌కు చెందిన ప్రమీల (17)లు మృతి చెందారు. వివరాలిలా వున్నాయి.

04/30/2018 - 23:55

పెనుకొండ, ఏప్రిల్ 30 : పట్టణంలోని సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఆదివారం పరారయ్యాడు. చిలమత్తూరు మండలం కంబాలపల్లికి చెందిన వడ్డె వెంకటేశులు గతనెల 1న రిమాండ్ ఖైదీగా సబ్‌జైలుకు వచ్చినట్లు జిల్లా జైళ్ల సూపరింటెండెంట్ సుదర్శన్‌రావు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆయన సోమవారం స్థానిక సబ్‌జైలును సందర్శించారు.

04/30/2018 - 04:36

గుడివాడ, ఏప్రిల్ 29: పట్టణంలోని బేతవోలు స్మశానవాటికలో గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామానికి చెందిన ఇలపర్తి నాగచౌదరి(25) దారుణహత్యకు గురయ్యాడు. మృతుడు అవివాహితుడు, లారీ క్లీనర్‌గా పనిచేస్తూ ఆరు నెలల కిందట ట్రాక్టర్‌ను కొని వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా లింగవరానికి చెందిన నాగచౌదరి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతవోలు స్మశానవాటికలో హత్యకు గురికావడం సంచలనం కల్గించింది.

04/30/2018 - 04:36

ముసునూరు, ఏప్రిల్ 29: అప్పటివరకు మనువళ్ళు, మనవరాళ్ళతో సరదాగా కాసేపు గడిపి తన జీవన గమనంలో ట్రాక్టరు నడిపేందుకు బయటకు వెళ్ళిన వ్యక్తి కొద్ది సేపటికే విగతజీవుడుగా మారాడు. భర్త కోసం ఎదురుచూస్తున్న భార్యకు భర్త ఇకలేడు అన్న నిజంతో తలడిల్లిపోయింది. ముసునూరు ఎస్సీ కాలనీకి చెందిన కోరు విజయకుమార్ (45) ట్రాక్టరు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

04/30/2018 - 05:05

ఏలూరు : కొందరు వ్యక్తులు ఫిషరీస్ ఎడికి ఇటీవల తాము ఏసీబీ అధికారులమని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిన నేపధ్యంలో ఎడి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు త్రీటౌన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు.

04/29/2018 - 23:47

పుల్లంపేట, ఏప్రిల్ 29: తెల్లవారితే వారి కూతురికి పెళ్లి. కూతురి పెళ్లి అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తి చేసుకుని ఎంతో ఆనందంగా ఆ కుటుంబం అనంతపురం జిల్లా కొత్త గుంతకల్ యాడికి దగ్గర వెంకటాపురానికి చెందిన శివ తమ కుటుంబ సభ్యులతో ఎపి04 టిటి 9266 తుఫాన్ వాహనంలో తమ కూతురు ఉషారాణికి తిరుపతిలో జరిగే వివాహానికి బయలుదేరారు.

04/29/2018 - 23:40

రామగిరి, ఏప్రిల్ 29 : మండలంలోని శేషంపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. శేషంపల్లి గ్రామానికి చెందిన మజ్జిగ వర్మతేజ (15) గ్రామ సమీపంలో గల చెరువుకు తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు. ఈత నేర్చుకునేందుకు వెళ్లిన వర్మతేజ లోతైన ప్రదేశంలోకి వెళ్ళి ఈద లేక మునిగిపోయాడు.

04/29/2018 - 23:40

పెద్దవడుగూరు, ఏప్రిల్ 29 : మండల కేంద్రంలోని పెన్నానది పరివాహక ప్రాంతంలోని పెద్దవంక సమీపం ఒడ్డున ఉన్న చెట్లకింద ఆదివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడు దాదాపు 70 సంవత్సరాల వయస్సు కలిగి, తెల్లని చొక్క, పంచె ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. లభించిన ఆధారాల మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

04/29/2018 - 23:36

అనంతపురం అర్బన్, ఏప్రిల్ 29: రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించి వాహనాలను నడిపిన వాహనదారులపై 10,641 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ పేర్నొన్నారు. గత వారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్, సిబ్బంది పనితీరుపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరిమితికి మించిన ప్రయాణికులను తరలించే ఆటోలు, ట్రాక్టర్లు ముమ్మరంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు.

04/29/2018 - 03:57

హైదరాబాద్, ఏప్రిల్ 28: క్రికెట్ పందాలు నిర్వహిస్తున్న రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని నగర టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1,72,200 నగదు, రెండు టివిలు, లాప్‌టాప్, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక బెట్టింగ్ ముఠాలోని నిందితులు మహ్మద్ హమీద్, మహ్మద్ ఖాజా, తాఖీ హుస్సేన్, మహ్మద్ అమైరుల్లా, సంతోష్‌కుమార్‌లను అరెస్టు చేసినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు.

Pages