S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/03/2018 - 01:58

అనంతలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, కర్నాటకలో ఇద్దరు
ఉసురుతీసిన అకాల వర్షాలు

04/03/2018 - 00:58

రేణిగుంట, ఏప్రిల్ 2: డ్రైవర్ల నిర్లక్ష్యంతో 3 బస్సులు ఒకదాని వెంట మరొకటి ఢీకొన్న సంఘటనలో ఆ బస్సుల్లో ప్రయాణిస్తున్న 70 మంది ప్రయాణికులు గాయాలపాలైన సంఘటన సోమవారం మధ్యాహ్నం రేణిగుంట ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..

04/03/2018 - 00:56

పాకాల, ఏప్రిల్ 2: వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తూ డ్రైవర్ పట్టుబడిన సంఘటన సోమవారం సాయంత్రం తిరుపతి-చిత్తూరు జాతీయ రహదారిలోని పాకాల మండలం ఇరుగురంగయ్యగారిపల్లి వద్ద జరిగింది. పాకాల ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు తిరుపతి నుంచి చిత్తూరువైపు వెళ్తున్న ఓ వాహనంపై అనుమానం వచ్చి తనిఖీ కోసం ఆపేందుకు కల్లూరు ఎస్‌ఐ విశ్వనాథనాయుడు బృందం ప్రయత్నించారు.

04/03/2018 - 00:54

తిరుపతి, ఏప్రిల్ 2: శ్రీనివాస మంగాపురం సమీపంలోని శేషాచల అడవుల్లో కూంబింగ్ చేస్తున్న ఆర్‌ఐ భాస్కర్ బృందం ఎర్రచందనం చెట్లను నరుకుతున్న సేలంకు చెందిన భూపతి, వేలూరు జిల్లాకు చెందిన దొరస్వామిని సోమవారం అరెస్టు చేశారు. గమనించ దగ్గ విషయం ఏమింటే పట్టుబడ్డ స్మగ్లర్లలో ఒకరు ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థి కావడం గమనార్హం.

04/03/2018 - 00:53

చిత్తూరు, ఏప్రిల్ 2: జిల్లాలో పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠాను సోమవారం చిత్తూరు సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. సిసిఎస్ డీఎస్పీ రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఇటీవల ద్విచక్రవాహనాలు చోరి అవుతున్న సంఘటనలు అధికంగా కావడంతో దీనిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.

04/03/2018 - 00:53

కుప్పం , ఏప్రిల్ 2: దారి దోపిడీలకు పాల్పడుతున్న కర్నాటకకు చెందిన ముగ్గురు యువకుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి మారణాయుధాలు, కారు స్వాధీనం చేసుకొన్నట్లు కుప్పం సిఐ రాఘవన్ తెలిపారు. సిఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

04/03/2018 - 00:42

ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 2: డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపులో తమ పేర్లు కావాలనే తొలగించారని ఆరోపిస్తూ ఖమ్మం రూరల్ మండలం ఆరేకొడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. రూరల్ మండలం ఆరేకొడు గ్రామానికి చెందిన అప్పారావు, సురేష్ అనే వ్యక్తులు తమ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు.

04/03/2018 - 00:41

అశ్వాపురం, ఏప్రిల్ 2: కాంట్రాక్టర్లు, వ్యాపారులను మావోయిస్టుల పేరుతో బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు నకిలీ మావోయిస్టులను సోమవారం అశ్వాపురంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా వెల్లడించారు. సోమవారం అశ్వాపురం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మణుగూరు డీఎస్పీ సాయిబాబా మాట్లాడారు.

04/03/2018 - 00:35

బేతంచెర్ల, ఏప్రిల్ 2:స్థానిక రైల్వేస్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద గుర్తుతెలియని 40 సంవత్సరాల వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు నంద్యాల రైల్వే కానిస్టేబుల్ రఫి సోమవారం తెలిపారు. వివరాలు.. మృతుడు బ్లాక్ ప్యాంటు, తెల్ల ఆకుపచ్చ రంగు గదుల ఫుల్ చొక్కా ధరించినట్లు తెలిపారు. అతడు తెల్లవారుజామున 3గంటల సమయంలో రైలు కింద పడి వచ్చునని, దీంతో మొండెం, తల వేరైనట్లు తెలిపారు.

04/03/2018 - 00:23

చీమకుర్తి, ఏప్రిల్ 2: చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెంకు పనిమీద వెళ్లి స్కూటర్‌పై వస్తూ స్వాతి పెట్రోలు బంకు ఎదురుగా రైజ్ కాలేజిబస్సు స్కూటర్‌ను ఢీకొని కె జాలరావ్ (45)అక్కడికక్కడే సోమవారం సాయంత్రం మృతిచెందాడు. స్కూటరు నడుపుతున్న పి వెంకటేశ్వర్లుకు తీవ్రంగా గాయాలుకాగా ఒంగోలులోని రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

Pages