S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/22/2018 - 03:39

అరకులోయ, మార్చి 21: అరకులోయకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘోరాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం బుధవారం కనుగొన్నారు. కె.కె.లైన్ మార్గంలోని పిట్టమర్రిగుడ, అంతర్ రాష్ట్రం ఒడిస్సాకు చెందిన చటువా గ్రామాలకు మధ్యనున్న రైలు పట్టాల పక్కన సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని గిరిజనులు కనుగొన్నారు.

03/22/2018 - 03:14

చంద్రగిరి, మార్చి 21: మండల పరిధిలోని ఐతేపల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఐతేపల్లికి చెందిన సుబ్బయ్య (70) జాతీయ రహదారి దాటుతుండగా గుర్తుతెలియని కారు అతివేగంగా అదుపుతప్పి వచ్చి ఢీకొని వెళ్లిపోవడంతో ఆయన కింద పడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

03/22/2018 - 01:25

జమ్మికుంట, మార్చి 21: మండలంలోని తనుగుల గ్రామానికి చెందిన జులుక సాగర్ (32) అనే యువకుడు బుధవారం అత్మహత్య పాల్పడ్డడు. గ్రామస్తులు ,బంధువులు తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన జిలుక సాగర్ అనే యువ రైతు తన ఉండబడే రెండు ఎకరముల భూమితోపాటు మరో రెండు ఎకరములు కౌలుకు తీసుకొని వ్యవసాయ చేస్తు జీవనం సాగిస్తున్నాడు.

03/22/2018 - 01:23

న్యూఢిల్లీ, మార్చి 21: మాజీ టెలికాం మంత్రి ఎ. రాజా, డిఎంకె ఎంపి కనిమొళి తదితరులకు 2జి స్పెక్ట్రమ్ కేసులో ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తర్వాతి విచారణ తేదీ మే 25లోగా తమ స్పందనలను దాఖలు చేయాలని కోర్టు నోటీసుల్లో ఆదేశించింది.

03/22/2018 - 01:23

కోర్బా, మార్చి 21: చత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్-్ఛంపా జిల్లాలో ఓ ఘోరం సంఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు కామాంధులు ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిందేకాకుండా ఆమెకు విషం ఇచ్చారు. నలుగురు దుర్మార్గుల్లో ఓ మైనర్ కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. బాధిత విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని వారు చెప్పారు.

03/22/2018 - 01:21

కాబూల్, మార్చి 21: అఫ్గానిస్థాన్‌లో బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 26 మంది దుర్మరణం చెందగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది యువకులే ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ఆ దేశ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నజ్రత్ రహిమి తెలిపారు. కాబూల్ యూనివర్సిటీకి సమీపంలోని ఓ ఆసుపత్రి ఎదురుగా పేలుడు జరిగింది.

03/22/2018 - 01:06

హుజూరాబాద్, మార్చి 21: వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన కోడలు, మనుమరాలు, మనుమడిని పుట్టింటిలో దింపేందుకు కారులో తీసుకువెళ్తున్న మామ.. మరో పావుగంటలో తాత, అమ్మమ్మల ఒడిలో అనందంగా ఒదిగిపోదామని అనుకున్న అనందం క్షణాల్లోనే ఆవిరైపోయింది.

03/22/2018 - 00:56

భీమదేవరపల్లి, మార్చి 21: వరంగల్ అర్భన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బుధవారం రాత్రి 10 గంటలకు ఢీకొన్న సంఘటనలో ఇరువురు యువకులు మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలైనాయి.

03/22/2018 - 00:43

బెళుగుప్ప, మార్చి 21 : మండల పరిధిలోని బెళుగుప్ప తండాకు చెందిన నీలాబాయి (25) బుధవారం విషపుగుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు బెళుగుప్ప తండాకు చెందిన విజయకుమార్ నాయక్‌తో కొన్ని సంవత్సరాల క్రితం నీలాబాయితో వివాహమైంది. అయితే బుధవారం కుటుంబ కలహాలతో విసుగుచెంది విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు.

03/22/2018 - 00:21

అద్దంకి, మార్చి 21: అద్దంకి మండలం వేలమూరిపాడులో బుధవారం ఉదయం రుణబాధలతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి(చిన్న)(45) వేలమూరిపాడు గ్రామంలో భూమి కొనుగోలు చేసుకుని పంటలు సాగుచేసుకుంటున్నాడు. నిత్యం తన స్వంత గ్రామమైన ధర్మవరం నుండి వేలమూరిపాడు గ్రామంలోని పొలాలకు వచ్చి వెళ్ళేవాడు.

Pages