S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/22/2018 - 00:18

శ్రీనగర్, మార్చి 21 : జమ్ము-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంగళవారం నుంచి కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో నలుగురు మిలిటెంట్లు హతమయ్యారు. ఎదురు దాడుల్లో ఇద్దరు జవాన్లు సహా నలుగురు భద్రతా సిబ్బంది మరణించారు. హల్మోత్‌పురకు చెందిన దట్టమైన అడవుల్లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇవి కుప్వారాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అయితే సైనికుల మరణాలపై సైన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

03/22/2018 - 00:07

చెన్నై, మార్చి 21: మరో బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈసారి చైన్నైలోని కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకులను రూ.1000 కోట్లకు ముంచిన విషయం వెలుగులోకి వచ్చింది. కనిష్క గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.842.15 కోట్ల రుణం కుంభకోణంపై విచారణ జరపాల్సిందిగా గత జనవరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సీబీఐని కోరినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక బయటపెట్టింది.

03/21/2018 - 23:54

నల్లగొండ లీగల్, మార్చి 21: నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త, కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ఐదుగురు నిందితుల బెయిల్‌ను రద్దు చేస్తూ జిల్లా అదనపు కోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. నిందితులకు బెయిల్ ఇవ్వడంతో విచారణకు ఇబ్బంది కలగవచ్చని నల్లగొండ టూటౌన్ పోలీసులు కోర్టును ఆశ్రయించి బెయిల్ రద్దుకు అభ్యర్థించారు.

03/21/2018 - 23:40

రామాయంపేట, మార్చి 21: ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని మనోవేదనకు గురైన విద్యార్థిని బుధవా రం ఆత్మహత్యకు పాల్పడింది. ఈసంఘటన బుధవా రం మండలంలోని రాయిలాపూర్‌లో చోటుచేసుకుం ది. రొడ్ల లక్ష్మణ్ కూతురు శివాణి (16)ఇటీవల జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో బాగా రా యలేదని మనోవేదనకు గురై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

03/21/2018 - 22:44

కారంపూడి, మార్చి 21: బస్సు నడుపుతూ గుండెపోటుతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలోని పేటసనె్నగండ్ల శివారులో బుధవారం జరిగింది.
మాచర్లకు చెందిన తాజ్‌బాబు (46) పిడుగురాళ్ళ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా పిడుగురాళ్ళ నుండి వినుకొండ వెళ్ళే బస్‌కు డ్రైవర్‌గా వెళ్ళారు.

03/21/2018 - 22:39

ఏన్కూరు, మార్చి 21: మండల పరిధిలోని జన్నారం గ్రామ సమీపంలో వాగులో పడి యువకుడు గల్లంతైన సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జన్నారం పంచాయతీలోని కోనాయపాలెం గ్రామానికి చెందిన పామర్తి విజయ్ (19) తోపాటు మరో ముగ్గురు యువకులు కలిసి బహిర్భూమికి అని సమీపంలోని వాగువద్దకు వెళ్లారు. దీంతో వాగులో దిగి ప్రమాదవశాత్తు కాలుజారి విజయ్ వాగులో కొట్టుకొని పోయాడు.

03/21/2018 - 22:33

ఖమ్మం(క్రైం), మార్చి 21: ఖమ్మంలో ఫంక్షన్‌హాల్స్ నిర్వహిస్తున్న యజమానులు ఆయా ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఏసిపి సదానిరంజన్ అన్నారు. బుధవారం ప్రకాశ్‌నగర్‌లోని కమాండ్ కంట్రోల్ ట్రాఫిక్ కౌన్సిల్ సెంటర్‌నందు ఫంక్షన్ యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

03/21/2018 - 04:40

గండేపల్లి, మార్చి 20: మండలంలోని జడ్ రాగంపేట గ్రామ శివార్లలో గంజాయి లోడుతో వెళుతున్న లారీని, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి జగ్గంపేట సీఐ కాశీ విశ్వనాధ్ మంగళవారం విలేఖర్లకు వివరాలు తెలియజేశారు.

03/21/2018 - 04:21

ధన్వాడ: మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలలో ఇంగ్లీష్ పేపర్-1 లీకేజీ వ్యవహరంలో 12మందిని ఆరెస్టు చేసినట్టు నారాయణపేట డీఎస్పీ శ్రీ్ధర్ తెలిపారు.

03/21/2018 - 04:05

చిత్తూరు, మార్చి 20: ఆంధ్రా తమిళనాడు రాష్ట్రాల్లో కొద్ది సంవత్సరాలుగా వరుస హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ మునుస్వామిని ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు పట్టు కున్నారు. రెండు రాష్ట్రాల్లో శివారు ప్రాంతాల్లోని ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొంటూ 1992 నుంచి ఎనిమిది హత్యలు, అనేక నేరాలకు పాల్పడ్డాడు.

Pages