S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/21/2018 - 02:56

గాంధారి, మార్చి 20: ఎలాంటి భూమి లేకున్నా నకలీ పాసుపుస్తకాలు తయారు చేసి వాటి ద్వారా బ్యాంకు నుండి దాదాపు 3.50కోట్ల రుణాలు పొందినట్లు తహశీల్థార్ లక్ష్మణ్ చెప్పారు. మంగళవారం తహశీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దీనికి సంబందించిన వివరాలు వెల్లడించారు.

03/21/2018 - 02:12

వనస్థలిపురం,మార్చి 20: ఒంటరిగా ఉన్న మహిళలను బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా మహిళా దొంగను రాచకొండ పాలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె వద్ద నుంచి 30తులాలు బంగారు ఆభరాణాలను స్వాధీనం చేసుకున్నారు.

03/21/2018 - 01:48

కామేపల్లి, మార్చి 20: పంట దిగుబడి లేక అప్పులు తీర్చలేమనే భయంతో మనస్థాపనికి గురై రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని భాసిత్‌నగర్ పంచాయతీ పరిధిలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన బానోత్ భావుసింగ్ (29) అనే యువరైతు తనకున్న ఎకరం 10 కుంటల చేనుతో పాటు తన సోదరుడికి చెందిన మరో రెండున్నర ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు.

03/21/2018 - 01:04

పెద్దపల్లి రూరల్, మార్చి 20: మద్యం తాగిన మత్తులో జరిగిన ఘర్షణ చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుచిది. క్షణికావేశంతో కని పెంచిన కొడుకే ఇనుప రాడుతో తలపై కొట్టి తండ్రిని హతమార్చిన ఉదంతమిది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

03/21/2018 - 00:58

రామడుగు, మార్చి 20: వివాహం జరిగి నాలుగు నెలలు కాకముందే ఓ నవవధువు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం రాగుల వినిత (22) ఇదే గ్రామానికి చెందిన యువకునితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. గత కొద్ది రోజుల నుండి మృతురాలికి పీడ కళలు వస్తున్నాయని, ఎవరో చేతబడి చేశారనే అనుమానంతో పలు ఆసుపత్రుల్లో చూపించారు.

03/21/2018 - 00:18

కడప క్రైం,మార్చి 20: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధాలున్న ఇద్దరు స్మగ్లర్లపై జిల్లా ఎస్పీ పీడీ చట్టం ప్రయోగించారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అహ్మద్ తంబీ మైదీన్, అంతర్ రాష్ట్రీయ ఎర్రచందనం స్మగ్లర్ సిగరపాటి శ్రీనివాసులుపై ఎస్పీ అట్టాడ బాబూజీ మంగళవారం పీడీ చట్టం ప్రయోగించారు. అహ్మద్ తంబి మైద్దీన్ వయస్సు 50సంవత్సరాలు, ఇతను తమిళనాడు రాష్ట్రం నాగపట్టణం జిల్లాలోని నాగూర్‌కు చెందిన వాడు.

03/20/2018 - 04:29

కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 19: కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థి సుధీర్ హత్య కేసులో ఇద్దరు నిందితులను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను ఏసీపీ భుజంగరావు వెల్లడించారు.

03/20/2018 - 04:27

శంషాబాద్, మార్చి 19: నకిలీ పాస్‌పోర్టుతో నగరానికి చేరుకున్న ఒక వ్యక్తిని పోలీసులు రిమాండ్ చేశారు. శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలు... కేరళ రాష్ట్రానికి చెందిన సయ్యద్ రఫీ (35) ఉపాధి కోసం రియాద్‌కు వెళ్లాడు. అక్కడ యజమానులు పాస్ట్‌పోర్టు తీసుకోవడంతో స్వదేశానికి వచ్చేందుకు ఏజెంట్ ద్వారా అనిల్‌కుమార్ పేరుతో ఉన్న మరో పాస్‌పోర్టును కొనుగోలు చేశాడు.

03/20/2018 - 04:21

అవనిగడ్డ, మార్చి 19: అదనపుకట్నం కోసం ఓ మహిళను చిత్రహింసలు పెట్టడంతో పాటు శరీరం అంతా వాతలు పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుస్టేషన్ పరిధిలోని మోపిదేవి కాలనీకి చెందిన కర్లపూడి కిరణ్‌కు చిరువోలుకు చెందిన దోవారి జ్యోతితో 2012 ఏప్రిల్ 27న వివాహమైంది. ఆ సందర్భంగా రూ.35వేలు నగదు, ఉంగరం, నాలుగు సెంట్ల స్థలం కట్నంగా ఇచ్చారు.

03/20/2018 - 03:45

కొత్తగూడెం, మార్చి 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి సమీపంలోని పాయమ్మ చెరువుకు సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఒంటిపూట బడి ముగిసిన తరువాత ఈతకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందారు.

Pages