S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/18/2018 - 22:23

లేపాక్షి, మార్చి 18 : మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో భూమిక (6) నీటి సంపులో పడి ఆదివారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే భూమిక తల్లి మారెక్క ఉగాది పండుగ సందర్భంగా ఇంట్లో పూజలు నిర్వహించి పిల్లలకు భోజనాన్ని వడ్డించి పూర్తయిన తర్వాత ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఓ ఇంటి ముందు ఉన్న సంపుపై తుప్పు పట్టిన ఓ ఇనుప రేకును మూసి ఉన్నారు.

03/18/2018 - 22:23

అగళి, మార్చి 18 : మండల పరిధిలోని కరిదాసనపల్లికి చెందిన రామకృష్ణ (58) కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం తన కుమార్తెను పిలుచుకు వచ్చేందుకు కర్నాటక హందికుంటే గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా తళ్లహళ్లి సమీపంలో గుర్తు తెలియని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగి అక్కకడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

03/19/2018 - 01:14

హైదరాబాద్, మార్చి 18: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాంపల్లి లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి మల్లంపాటి గాంధీని ఆదివారం తెల్లవారు జామున వారాసిగూడలోని ఆయన నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోని ఆయన బంధువుల నివాసాల్లో సోదా నిర్వహించారు.

03/19/2018 - 03:36

కరీంనగర్ రూరల్, మార్చి 17: కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్ పరిదిలోని వల్లంపాడ్ స్టేజి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాండ్ల సునిత (38) అనే మహిళ మృతి చెందినట్లు రూరల్ సిఐ శశిధర్‌రెడ్డి తెలిపారు.

03/18/2018 - 03:15

రాంచీ, మార్చి 17: బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా నిందితులుగా ఉన్న నాలుగో దాణా కుంభకోణం కేసులో తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. రెండు దశాబ్దాల క్రితం డుమ్కా ట్రెజరీ నుంచి 3.13 కోట్ల రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేశారని మాజీ సీఎంలపై అభియోగం. ఈ కేసులో తీర్పు వాయిదా పడడం ఇది రెండోసారి.

03/18/2018 - 02:42

ఆమనగల్లు, మార్చి 17: కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి సమీపంలో హైదారాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఎస్సై సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం..

03/18/2018 - 00:45

హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ నార్తరన్ విద్యుత్ డిస్కాం జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు మహిళల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది. హమేరా అంజుం, వి మమత, మరో ఐదుగురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి పై ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్ రామచంద్రరావు విచారించారు.

03/18/2018 - 00:10

తాడిపత్రి, మార్చి 17: దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుర్లు రమీజా(42), రేష్మి(21) దుర్మరణం పాలైన సంఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది.

03/17/2018 - 03:38

కోడూరు, మార్చి 16: కోడూరు మండలం పాలకాయతిప్ప సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సైకం వెంకటరాజు గురువారం రాత్రి గల్లంతయ్యాడు. తాను ఉన్న బోట్‌లో ఇంకా ఐదుగురు మత్స్యకారులు ఉండగా శుక్రవారం ఉదయం వెంకటరాజు కనిపించకపోవటంతో మిగిలిన వారు ఆందోళనకు గురయ్యారు. నాగాయలంక గుల్లలమోద గ్రామానికి చెందిన జాలర్ల బృందం మూడు రోజుల క్రితం సముద్రంలో వేటకు బయలుదేరి వెళ్లింది.

03/17/2018 - 03:27

జీడిమెట్ల, మార్చి 16: రోడ్డు ప్రమాదంలో ఇద్ద రు వ్యక్తులు మృతి చెందిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పటాన్‌చెరు, అమీన్‌పూర్‌కు చెందిన ఊటికూరి మహే శ్ (28) ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఇస్నాపూర్‌కు చెందిన చెడుదూటి సాయితేజ (21) ఎలక్ట్రీషియన్. ఇద్దరు కలిసి టీఎస్ 15 ఈఎస్ 3767 నంబరు గల రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనంపై స్వగ్రామం నుండి తూప్రాన్‌కు వెళ్తున్నారు.

Pages