S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/10/2018 - 01:59

సూళ్లూరుపేట, మార్చి 9: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరుసటి రోజే అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత బలైన సంఘటన శుక్రవారం సూళ్లూరుపేట మండలం మతకాముడి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఇంద్రసేనారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మతకాముడి గ్రామానికి చెందిన తోట దీపికను (20) అదే గ్రామానికి చెందిన తోట రాజేంద్రకు ఇచ్చి నాలుగేళ్లు క్రితం వివాహం చేశారు. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగింది.

03/10/2018 - 01:47

భద్రాచలం టౌన్, మార్చి 9: గత నెల 27న హత్యకు గురైన సీపీఎం నేత కొంతలరావు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మృతుని భార్య తన ప్రియుడు, మరో ఇద్దరితో కలిసి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. సీఐ సత్యనారాయణరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలం పట్టణానికి చెందిన ఐతంరాజు కొండలరావు- ముత్తేశ్వరి దంపతులు.

03/10/2018 - 01:41

హనుమాన్ జంక్షన్, మార్చి 9: బాపులపాడు మండలం వీరవల్లి శివారు గ్రామం మురళీపురం వద్ద ఏలూరు కాలువలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం తోటగూడెం గ్రామానికి చెందిన కూలీలు శుక్రవారం కాలువలో తూడుకాడ తొలగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

03/10/2018 - 01:00

గార్లదినె్న, మార్చి 9: మండలంలోని కేశవాపురం, కొప్పులకొండ గ్రామాల సమీపాన పెన్నానది ఆక్రమణలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఊటకాలవలను పరిరక్షించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

03/10/2018 - 00:59

ధర్మవరంటౌన్, మార్చి9: ధర్మవరం చెరువులో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. పోలీసులు కథనం మేరకు గత మూడు రోజలు క్రితం ఎవ్వరో మహిళను చంపి చెరువులో వేయడం వలన మూడు రోజుల తరువాత శవం వెలుగుచూసిందన్నారు. అయితే ఈవిషయం గురువారం సాయంత్రం మహిళ శవం చెరువులో ఉన్నట్లు గుర్తించామని కాని రాత్రి సమయంలో తీయడానికి వీలులేక శుక్రవారం ఉదయం బయటకు తీశారు.

03/10/2018 - 00:59

హిందూపురం, మార్చి 9: ఇష్టారాజ్యంగా తవ్వేసిన ఇసుక దిబ్బల్లో ఇసుకను తోడుతూ ఓ వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన హిందూపురం రూరల్ మండల పరిధిలోని బేవినహళ్ళి సమీపంలోని పెన్నానదిలో చోటు చేసుకుంది. హిందూపురం రూరల్ మండల పరిధిలోని పూలకుంటకు చెందిన బయపురెడ్డి (40) శుక్రవారం తోటి కూలీతో ట్రాక్టర్ తీసుకుని బేవినహళ్ళి సమీపంలోని పెన్నానది ప్రాంతంలోని ఇసుక పాయింట్ వద్దకు వెళ్లాడు.

03/10/2018 - 00:58

హిందూపురం, మార్చి 9: ముగ్గురు మిత్రులు అల్పాహారం తీసుకుంటూ శీతల పానీయాన్ని సేవిస్తూ ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్ళగా అందులో ఆలస్యంగా వెళ్లి అల్పాహారం తీసుకుంటున్న మరో యువకుడు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన హిందూపురంలో శుక్రవారం చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి పెనుకొండ డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌కు బాధిత యువకుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

03/10/2018 - 00:53

మేడిపల్లి, మార్చి 9: మేడిపల్లి మండలంలోని కొండాపూర్-రంగాపూర్ గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో భీమారం గ్రామానికి చెందిన కొండాపూర్ విజయ్ (18) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిరణ్ కుమార్ తెలిపారు.

03/09/2018 - 23:08

కుప్పం, మార్చి 9: ఆస్థి కోసం మేనమామను అత్యంత దారుణంగా అల్లుళ్లు హత్య చేసిన సంఘటన శుక్రవారం గుడుపల్లి మండలం తంజమ్మకొటాలు వద్ద జరిగింది. కుప్పం సీఐ రాఘవన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తంజమ్మ కొటాలు గ్రామానికి చెందిన మురుగేష్ (38)కు ఆరుగురు అక్కలున్నారు. వారి తల్లిదండ్రులు కేవలం ఒక్క మురుగేష్‌కు మాత్రమే ఆస్థిని ఇచ్చారు.

03/09/2018 - 23:02

ఆచంట, మార్చి 9: ఆచంటకు చెందిన అడ్డాల శివ సాయి నాగ లతామాధురి (21) అనే యువతి ఊరి చెర్వులో శవమై తేలిన సంఘటన ఆశ్చర్యకరంగా మారింది. మృతురాలి తండ్రి ఆచంటకు చెందిన శ్రీను గత 12 సంవత్సరాల నుంచి గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. తల్లి సూర్యకుమారి. మృతురాలి అక్కకు వివాహమైంది. ఈ నెల 1న లతామాధురి పాలకొల్లు బంధువుల ఇంటికి వెళ్లి 7న వచ్చేసింది. తనను ఎందుకు రమ్మన్నావంటూ తల్లిపై గొడవచేసింది.

Pages