-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
చాపాడు, మార్చి 9: మండల పరిధిలోని సీతారామపురం క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 ఆటోలలో అక్రమంగా 52 బస్తాలు చౌకబియ్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎసై ఎస్.శ్రీనివాసులు తెలిపారు. మైదుకూరుకు చెందిన రామక్రిష్ణ అనే బియ్యం వ్యాపారి ఈ బియ్యంను కొనుగోలుచేసి మైదుకూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. ప్రొద్దుటూరు వైపు నుండి మైదుకూరుకు 3 ఆటోలలో ఈ బియ్యాన్ని తరలిస్తున్నారన్నారు.
న్యూఢిల్లీ, మార్చి 8: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తాత్కాలిక ఉపశమనం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కార్తీ పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్మిశ్రా సారధ్యంలోని ధర్మాసనం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని కార్తీని ఆదేశించింది. కార్తీ పిటిషన్ విచారించడానికి సమయం కేటాయించాలని సుప్రీం సూచించింది.
అమరావతి, మార్చి 8: గుంటూరు జిల్లా అమరావతిలో మహిళా దినోత్సవం నాడు ఎంఇఓపై ఓ ఉపాధ్యాయిని కత్తిదూసిన సంఘటన సంచలనం కలిగించింది. అమరావతి మండల విద్యాశాఖ అధికారి ఓవి రామిరెడ్డిపై మండల పరిధిలోని లింగాపురం ఎంపీపీ స్పెషల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయిని పి ఉమాదేవి దాడికి దిగారు.
కరీంనగర్ రూరల్, మార్చి 8: ఏడాది చిన్నారితో ఒక తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కొత్తపల్లి మండలంలోని నాగులమల్యాల గ్రామానికి చెందిన తీగల మాధవి (28) అనే మహిళ తన చిన్న కూతురు యశశ్వినితో(1) కలిసి బావుపేట శివారులోని వ్యవసాయ బావి లో దూకి ఆత్మహత్య చేసుకుందని గురువారం కరీంనగర్ రూర ల్ సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, మార్చి 8: ఈ నెల 1వ తేదీన జరిగిన రౌడీ షీటర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను ఫలక్నుమా పోలీసులు అరెస్టు చేశారు. ఫలక్నుమా ప్రాంతంలోని జహనుమాలో నివసించే సయ్యద్ ఈసా ఈ నెల 1వ తేదీన పిల్లలకు చాక్లెట్లు తెచ్చేందుకు ఇంటినుంచి బయటకు వెళ్లడంతో కొందరు దాడి చేసి హతమార్చారు. ఈ విషయాన్ని ఈసా సోదరుడు సయ్యద్ అబుబాకర్కు స్ధానికులు సమాచారం అందించడంతో వెళ్లి చూసాడు.
కదిరి టౌన్, మార్చి 8: అనంతపురం జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు చెరువుకట్ట వద్ద బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు గంగాధర్ (43), కేటీ కిషోర్కుమార్ (42) మృతి చెందారు. కదిరి డిపో ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో రాయచోటికి వెళ్తుండగా రూరల్ మండలంలోని విఠలరాయుని చెరువు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.
నంగునూరు, మార్చి 8: వ్యవసాయం కోసం చేసిన అప్పులకు తోడు తనకున్న కొద్దిపాటి భూమిలో నుండి సాగు నీటి కలువ పోతోందని తీవ్ర మనస్థాపానికి గురై ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మం డలం మగ్దుంపూర్ గ్రామంలో జరిగింది. సంఘటనా వివరాల్లోకి వెళితే.. మగ్దుంపూర్కు చెందిన పెర్న కొమురయ్య (40) తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
హైదరాబాద్, మార్చి 8: ఒక ప్రైవేటు ఫిర్యాదు కేసులో తనపై హత్య కేసును బనాయిస్తూ కర్నూలు జిల్లా డోన్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుమారుడు కెఇ శ్యాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రైవేట్ ఫిర్యాదును వైకాపా నేత శ్రీదేవి కోర్టులో దాఖలు చేశారు.
హైదరాబాద్, మార్చి 8: విశాఖపట్నం జిల్లా వాకపల్లి ఘటన కేసులో బాధితులు ప్యానెల్లోని ఏడుగురు న్యాయవాదుల్లో ముగ్గురు న్యాయవాదుల పేర్లను ఎంపిక చేసి సూచించాలని హైకోర్టు బాధితులను కోరింది. విచారణ కోర్టుకు ముగ్గురిలో ఒకరిని రాష్ట్రప్రభుత్వం ఎంపిక చేసి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించాలని హైకోర్టు కోరింది.
నక్కలగుట్ట, మార్చి 7: తాళం వేసివున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను బుధవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడి నుండి సుమారు 15 లక్షల విలువ గల 511 గ్రాముల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం అదనపు డీసీపీ బీ. అశోక్కుమార్ వివరాలను వెల్లడించారు.