-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
జగిత్యాల, మార్చి 7: జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన దువ్వాసి సుదర్శన్ (55) తల్లి ఆస్థికలను కాశీ గంగానదిలో కలిపేందుకు వెళ్లీ అక్కడ గుండెపోటుతో మృతి చెందాడు. గత పక్షం రోజులు క్రితం తన తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి ఆస్థికలను కాశీలో కలిపేందుకు సోదరులతో కలిసి వెల్లిన సుదర్శన్కు మంగళవారం గుండెపోటు రావడంతో మృతి చెందాడు.
గంభీరావుపేట, మార్చి 7: ఎంపీటీసీ భర్త టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయిన సంఘటన బుధవారం సాయంత్రం గంభీరావుపేట మండలంలో చొటుచేసుకుంది. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు బీనవేణి చంద్రకళ భర్త దేవయ్య (42)ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. దేవయ్య ఇదే గ్రామంలోని విందుకు హాజరయి, అక్కడే వున్న ఫీల్డ్అసిస్టెంట్ శ్రీనివాస్రెడ్డి, అతని కుమారుడు సందీప్లు గొడువపడ్డారు.
బాలాపూర్, మార్చి 6: మీర్పేట్ టీకేఆర్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల రామకృష్ణాపురం గ్రామానికి చెందిన కందుల శంకరయ్య కుమారుడు విక్రమ్ టీకేఆర్ కళాశాలలో చదువుతున్నాడు.
నార్సింగి, మార్చి 6: నిర్మాణంలో ఉన్న భవనం 13వ అంతస్తు పైనుంచి కిందపడి ఇద్దరు వలస కూలీలు దుర్మణం చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషాద సంఘటన కోకాపేట గ్రామంలో చోటుచేసుకుంది. నార్సింగి ఇన్స్పెక్టర్ రమణ గౌడ్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో జీఏఆర్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్ నిర్మాణంలో ఉంది. ఈ భవనంలో పలు రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు.
గచ్చిబౌలి, మార్చి 6: గచ్చిబౌలి ఐటీ సెక్టార్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున ఒం టరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులు, మరో బాలుడిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, 12 సెల్ఫోన్లు, నాలుగు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
చందుర్తి, మార్చి 6: చందుర్తి మండలం రామరావుపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి లింగయ్య (50) అనే వ్యక్తిని ఈ నెల 2వ తేదీన గొడ్డలి, కర్రలతో దాడి చేసి హత్య చేసిన నిందితులను మంగళవారం వేములవాడ డీఎస్పీ అవదాని చంద్రశేఖర్ అరెస్ట్ చేసి వివరాలను వెల్లడించారు.
చందుర్తి, మార్చి 6: చందుర్తి మండలం జోగాపూర్ ఎంపీటీసీ వట్టెంల కనుకయ్య (40)పై ఇదే గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ ఎం.డి.సలీం, మరో వ్యక్తి గొల్లపల్లి శంకర్ సోమవారం అర్ధరాత్రి కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఓదెల, మార్చి 6: మండలంలోని ఉప్పరపల్లి గ్రామ 33 రైల్వే గేటు వద్ద రైలు కింద పడి మ్యాకల కుమార్ (24) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..మృతుడి అన్నయ్యకు ఆదివారం పెళ్లి జరుగగా, సోమవారం ఇంటి వద్దనే పెళ్లి విందు జరుగుతుండగా రైలు కింద పడి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గతంలో సుల్తానాబాద్ మండలం ఒక రైస్మిల్ ఓనర్ను చంపిన నిందితుడిగా స్థానికులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.
చిలకలూరిపేట, మార్చి 3: బావిలో దూకి ఓ మైనర్ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేదరమెట్ల గ్రామంలో నివశించే షేక్ జాఫర్, లాలూబీల కుమారుడు షేక్ బాషా (17) గత మూడు సంవత్సరాలుగా చిలకలూరిపేట విశ్వనాథ్ థియేటర్ వెనుక ఉన్న వెల్డింగ్ షాపులో పని నేర్చుకుంటున్నాడు.
తడ, మార్చి 6: తడలో తప్పుడు ధ్రువపత్రాలు తయారుచేసే ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయ. తడ బజారు సెంటర్లో నెట్ సెంటర్ నిర్వహిస్తున్న కొండా బాబు, రాచకండ్రిగకు చెందిన బివి నరేష్, ఎం కుమరేష్, ఎం.చంద్రబాబులతో కలసి గత కొంతకాలంగా నెట్ సెంటర్లో ఉన్న కంప్యూటర్ల ద్వారా నకిలీ సర్ట్ఫికెట్లు సృష్టించి పలువురికి అందజేసేవారు.