S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రముఖ నటుడు పవన్కళ్యాణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఆయన చేసిన సినిమాలు 20 దాటలేదు. అంటే ఏడాదికొక సినిమా చొప్పున చేస్తూ వస్తున్నాడు. అయితే, వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళతానని, సినిమాలు మానేస్తానని చెబుతున్న పవన్, ఈ మూడేళ్ల గ్యాప్లో మహా అయితే రెండో మూడో సినిమాలు చేస్తాడని అంటున్నారు అందరూ. కానీ, ఆయన సినిమాల విషయంలో స్పీడు పెంచినట్టు కనిపిస్తోంది.
శ్రీకాంత్, నిఖిత జంటగా కరణం బాబ్జి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెంటల్ పోలీస్’. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా ప పాల్గొని ట్రైలర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘్భన్నమైన పాత్రల్లో నటిస్తూ ముఖ్యంగా పోలీసు పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచాడు శ్రీకాంత్.
బాలీవుడ్ అందాలతార ఐశ్వర్యరాయ్ పింక్కలర్ దుస్తుల్లో మెరిసిపోయింది. ముంబైలో జరిగిన సరబ్జిత్ చిత్రం
ట్రెయిలర్ను విడుదల చేసిన ఆమె అయిషా రమదన్ రూపొందించిన డ్రెస్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదే సినిమాలో సరబ్జిత్ సతీమణిగా నటిస్తున్న రిచాచద్దా, ప్రఖ్యాత డిజైనర్లు గౌరి-నైనికసేథ్ రూపొందించిన దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో ఆహూతులను అలరించారు.
జీవితంపట్ల ఎన్నో ఆశలతో గల్ఫ్కు వలస వెళ్లిన భారతీయుల కష్టసుఖాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గల్ఫ్’. పి.సునీల్కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రచారాన్ని విభిన్నంగా ప్లాన్ చేశారు. అందులో భాగంగా గల్ఫ్లోని వివిధ ప్రాంతాల్లో పాటలను, టీజర్ను విడుదల చేస్తున్నారు.
సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు రూపొందించిన చిత్రం ‘సుప్రీమ్’. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. హైదరాబాద్లో సుప్రీమ్ ఆడియో సీడీని నటుడు చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. నాని, వరుణ్తేజ్ కలిసి సుప్రీమ్ థియేటర్ ట్రైలర్ను విడుదల చేశారు.
మోహనకృష్ణ ఇంద్రగంటి, నాని కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ‘జెంటిల్మెన్’ అనే పేరును ఖరారు చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సురభి, నివేదా థామస్ కథానాయకులుగా నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.
‘బాహుబలి’ సినిమా సంచలనం క్రియేట్ చేసింది. ఆ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ‘బాహుబలి-2‘ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాని ఈ ఏడాదిలో విడుదల అవుతుందని అనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్లో విడుదల చేస్తారట. ఈ సినిమా షూటింగ్ విషయంలో ఆలస్యం కావడానికి కారణం ఎవరో తెలుసా? ఇంకెవరు హాట్ భామ అనుష్కనట!
భానుచందర్, జాన్, సాయికిరణ్ ప్రధాన తారాగణంగా ఎ.వి.ఎం ఆర్ట్స్ పతాకంపై శివప్రసాద్రెడ్డి దర్శకత్వంలో పి.సుధాకర్ రూపొందిస్తున్న చిత్రం ‘మారాజు’. ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.
గీతాశ్రీ ఆర్ట్స్ పతాకంపై నేనే శేఖర్ దర్శకత్వంలో ఎలమంచిలి సిస్టర్స్ రూపొందిస్తున్న చిత్రం ‘అమ్మాయంటే అలుసా’. ఈ సినిమాకు సంబంధించిన పాటల సీడీని నటి కవిత విడుదల చేశారు.
‘బెంగాల్ టైగర్’ సినిమా తరువాత రవితేజ బాగా సైలెంట్ అయ్యాడు. ఆయన చేయాలనుకున్న కొత్త సినిమాల షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ‘రాబిన్హుడ్’ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. దిల్రాజుతో సినిమా కాన్సిల్ అయింది. ఇప్పుడు రవితేజ చేతిలో సినిమాలే లేవు. దాంతో రవితేజ దృష్టి బాలీవుడ్పై పడ్డట్టు అనిపిస్తోంది. ‘తెలుగుకన్నా హిందీలో బాగా మాట్లాడగలను.. నాకు హిందీ సినిమాలు చేయాలని ఉంది..