S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అభిజిత్, రేష్మ జంటగా శ్రీ చరణ్ కార్తీకేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజిరెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం జీలకర్ర బెల్లం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమా పాటల సీడీని దర్శకుడు దశరథ్ విడుదల చేసి మొదటి కాపీని దాస్య నాయక్కు అందించారు.
నూతన నటీనటులతో గౌతమ్ కానె్సప్ట్ పతాకంపై కె.చిరంజీవి (చెన్ని) దర్శకత్వంలో పి.వెంకటేశ్వర్లు రూపొందిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
వికాస్, కల్యాణి జంటగా దుర్గాదేవి ఫిలింస్ పతాకంపై ఎన్.డి.ఉదయ్కుమార్ దర్శకత్వంలో కవనరెడ్డి నాగేశ్వర రావు రూపొందిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు.
గ్లామర్ భామ ఇలియానాకు ఈమధ్య మరీ బ్యాడ్ టైమ్ ఎక్కువైనట్లుంది. ఇప్పటికే బాలీవుడ్లో సరైన హిట్ లేదు. దానికితోడు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం చేస్తున్న ఒకే ఒక్క సినిమా ‘రుస్తుం’.
మోడల్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత హీరోయిన్గా మారిన అందాలతార అమీ జాక్సన్కు వరుసగా భారీ అవకాశాలే దక్కుతున్నాయి. ఎన్నో ఆశలతో చేసిన ‘ఐ’ చిత్రం భారీ పరాజయం పాలవడంతో కాస్త నిరాశ చెందిన ఈ భామ మళ్లీ కొత్త ఉత్సాహంతో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రోబో 2.0’ చిత్రంలో నటిస్తోంది.
ప్రముఖ తమిళ నటుడు విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తేరీ’. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇదివరకే ‘పోలీసోడు’ అనే టైటిల్ను నిర్ణయించారు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ పేరును ‘పోలీసు’గా మార్చారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నితిన్, సమంత జంటగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ‘అ.. ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనందవిహారి) ఈ సినిమా టీజర్ విడుదలైంది.
గోపీచంద్, రాశీఖన్నా జంటగా ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ఆక్సిజన్. ఈ సినిమా ఫస్ట్లుక్ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఐశ్వర్య మాట్లాడుతూ, యాక్షన్ హీరో గోపీచంద్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూళ్లను పూర్తిచేసుకుంది.
రామ్శంకర్, నికిషాపటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.
నాగార్జున, కార్తి, తమన్నా ముఖ్యపాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి సినిమా పతాకంపై ఇటీవలే విడుదలై అందరి మన్ననలు అందుకుంటోన్న చిత్రం ‘ఊపిరి’. ఈ సినిమా థాంక్స్ మీట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు.