S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన ‘లజ్జ’ చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించాడు యువ నటుడు వరుణ్. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్న్యూస్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా వరుణ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
తమన్నా కథానాయికగా ఎం.వి.వి. సినిమా పతాకంపై విజయ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం అభినేత్రి. ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్ ఈనెల 15న వైజాగ్లో ప్రారంభం కానుంది.
నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్ జరుగుతోంది.
గతంలో ఓ డేటింగ్ చేసి, పెళ్లిదాకా వెళ్లిన బిపాసాబసు మళ్లీ ప్లేటు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కరన్సింగ్ గ్రోవర్తో తాను డేటింగ్లో ఉన్నానని
బాహాటంగానే ప్రకటించిన బాపాసా పెళ్లి విషయం మాత్రం బాహాటంగా చెప్పడం లేదు. విషయం
సినిమా అంటే రకరకాల పాత్రలు వేయడానికి సిద్ధంగా ఉండాలని, కానీ మనకు నచ్చిన పాత్రలు లేక మన ఒరిజినాలిటీని చూపించే పాత్రలు వస్తే ఆ కిక్కేవేరని అంటోంది లావణ్యాత్రిపాఠి. ఇప్పటికే మిథునగా, నందనగా, సీతగా ఆమె నటించిన చిత్రాల్లో గుర్తింపు పొందింది. కానీ లావణ్యగా గుర్తింపు కావాలనీ, అలాంటి పాత్రలు కోసం చూస్తున్నానని అంటోంది.
జీవితాంతం వీల్చెయిర్లో వుండేవారు ఎంత ఇబ్బంది పడతారో తనకు తెలుసునని, అమ్మ కూడా ఆర్థరైటిస్ సమస్యతో ఎనిమిదేళ్లు ఇబ్బంది పడడం చూసి చాలా బాధపడేవాడినని, ‘ఊపిరి’ సినిమా చేయడంవల్ల జీవితంలో స్వేచ్ఛ విలువ ఏంటో తెలిసిందని నటుడు నాగార్జున తెలిపారు. పి.వి.పి పతాకంపై పైడిపల్లి వంశీ దర్శకత్వంలో నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన తారాగణంగా రూపొందిన ఊపిరి చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే.
మనోజ్, సురభి ప్రధాన తారాగణంగా రాంగోపాల్వర్మ దర్శకత్వంలో సి.కల్యాణ్ రూపొందించిన చిత్రం ‘అటాక్’. పాతబస్తీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తన పాత్ర వైవిధ్యంగా వుంటుందని మనోజ్ తెలిపారు. ఆయన చిత్ర విశేషాలు తెలిపారు.
* అటాక్ ఎవరికి?
పవన్కళ్యాణ్, కాజల్ జంటగా పవన్కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి., ఈరోస్ ఇంటర్నేషనల్ పతాకాలపై సంయుక్తంగా కె.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో శరత్ మరార్, సునీల్ లుల్లా రూపొందిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్సింగ్’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
దీక్షాపంత్, ధన్రాజ్, సుడిగాలి సుధీర్, షకలక శంకర్ ప్రధాన పాత్రలో ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర దర్శకత్వంలో కళ్యాణి రామ్ రూపొందిస్తున్న చిత్రం ‘బంతిపూల జానకి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు కార్యక్రమం గుమ్మడికాయ వేడుక గురువారం హైదరాబాద్లో జరిగింది.
‘తుపాకి’ సినిమా ద్వారా టాలీవుడ్లో మంచి మార్కెట్ను సొంతం చేసుకున్నాడు విజయ్. తమిళనాడులో రజనీకాంత్ తరువాత అంతమంది అభిమానులున్న విజయ్, ఈసారి ఎలాగైనా తెలుగు మార్కెట్ దక్కించుకోవాలనే సన్నాహాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘తేరీ’ సినిమా ట్రైలర్ ఇప్పటికే తమిళంలో మంచి రెస్పాన్స్ పొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.