S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రామ్చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కన్ను సినిమా ఈమధ్యే సెట్స్పైకి వెళ్లి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తనిఒరువన్’కు రీమేక్ అయిన ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో కొద్ది రోజులుగా ఓ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇక ఈ షెడ్యూల్ తర్వాత టీమ్ ఈనెల 20 నుంచి బ్యాంకాక్లో ఓ చిన్న షెడ్యూల్ మొదలుపెట్టనుంది.
గుంటూరు టాకీస్ చిత్రంలోని పాత్రలను అనుసరించి వికలాంగుల సన్నివేశాన్ని చిత్రీకరించామే తప్ప ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం మాకు లేదని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, రేష్మీగౌతమ్ ప్రధాన తారాగణంగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూర్ టాకీస్’ విడుదలైన సంగతి తెలిసిందే.
నీరజ్శ్యామ్, నేహాసక్సెనా, సాయికుమార్ ప్రధాన తారాగణంగా యశస్విని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంగమూరి శేషగిరిరావు రూపొందించిన చిత్రం ‘దండు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆడియో సీడీని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మల్కాపురం శివకుమార్, మల్టీ డైమన్షన్ వాసు సంయుక్తంగా విడుదల చేశారు.
లింగా సినిమా తరువాత రజనీ చేస్తున్న చిత్రం ‘రోబో-2.0. ప్రస్తుతం తమిళనాటే కాక యావత్ సౌత్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. రజనీ, శంకర్ల రోబో కాంబినేషన్ను రిపీట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రాన్ని దాదాపుల 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
‘ఇలాంటి భిన్నమైన పాత్రలు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్లు చేశారు. ఈమధ్య ఈ తరహా సినిమాలు తగ్గిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు నేను చేస్తున్నందుకు ఆనందంగా వుంది’ అంటున్నాడు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున. నాగార్జున, కార్తి, తమన్నా ముఖ్యపాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి సినిమా పతాకంపై రూపొందిన ఊపిరి చిత్రం ఈనెల 25న విడుదలవుతున్న సందర్భంగా నాగార్జునతో ఇంటర్వ్యూ..
ఆ ఇద్దరి కథే
అనుష్క- ప్రభాస్ జంటగా గతంలో లారెన్స్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైంది. కొంత చిత్రీకరణ పూర్తయ్యేక అనుష్క అనివార్య కారణాలవల్ల ఆ చిత్రం నుండి తప్పుకుంది. ఆ తరువాత లారెన్స్ ఆమె స్థానంలో ఇద్దరు కథానాయికలను బుక్ చేసి మరీ సినిమాను పూర్తిచేశాడు. దీనివెనుక ఏం జరిగిందో కానీ మొత్తానికి అనుష్క-లారెన్స్లమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వెళ్ళారు. అదంతా గతం!
పర్వీన్రాజ్ (ప్లేయర్ ఫేం) కథానాయకుడిగా లార్డ్ శివా క్రియేషన్స్ పతాకంపై శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయి కృష్ణారెడ్డి రూపొందిస్తున్న చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. కథానాయకుడు పర్వీన్ రాజ్, సాక్షీ చౌదరిలపై నిర్మాత క్లాప్నివ్వగా, కోన రఘుపతి కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
సినిమాలు లేకపోవడంతో ప్రతి కార్యక్రమానికి ఠంచన్గా అటెండ్ అవుతోంది శ్రీయ. క్యాట్వాక్లలో తన సరదాను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వయ్యారిభామపై టాలీవుడ్లో ఓ పుకారు షికారు చేసింది. రాజవౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘బాహుబలి-2’లో శ్రీయ కథానాయికగా నటిస్తోందని ఆమధ్య తెగ ప్రచారం జరిగింది.
సునీల్, మన్నారా చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘జక్కన్న’. ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సునీల్ మాట్లాడుతూ, కొంచెం గ్యాప్ తరువాత మాస్, ఎనర్జిటిక్ రోల్లో చేసిన సినిమా ఇదని, ‘రక్ష’ సినిమాతో మంచి దర్శకుడిగా వంశీ గుర్తింపు తెచ్చుకున్నాడని, కొత్త పాయింట్ను తీసుకుని ఈ సినిమా చేశాడని అన్నారు.
‘నేను..శైలజ’ చిత్రం విడుదలకు ముందు, ఆ తరువాత కీర్తి సురేష్కు మంచి గుర్తింపు వచ్చింది. అందంతోపాటు అభినయంపై పట్టున్న నటిగా పేరుతెచ్చుకుంది. దీంతో కీర్తి సురేష్కు అవకాశాలమీద అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ, కథ అడ్డం తిరగడంతో అవకాశాలు కనపడకుండాపోయాయి. ఎక్స్పోజింగ్కు దూరంగా ఉంటానని, అలాంటివాటిని ఇష్టపడనని చెప్పడంతో దర్శక నిర్మాతలు ఎటువాళ్లు అటు సర్దుకున్నారు.