S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నాగార్జున కథానాయకుడుగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 110 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకుని, శత దినోత్సవం వైపు పరుగులు తీస్తోంది.
బాలీవుడ్లో కొందరు హీరోలు రొమాంటిక్ పాత్రల్లో, ఇంకొందరు మేటినటులు యాక్షన్ చిత్రాల్లో రాణించగా- అందుకు భిన్నంగా మనోజ్కుమార్ దేశభక్తిని రగిలించే సినిమాలకు చిరునామాగా మారి ప్రేక్షకజనం నుంచి నీరాజనాలు అందుకున్నాడు. దేశభక్తి ఇతివృత్తంగా తీసే సినిమాలు వాణిజ్యపరంగా లాభాలు తెచ్చిపెట్టవని తెలిసినా అదే పంథాలో పయనించి చిరస్మరణీయ పాత్రల్లో మనోజ్ మెప్పించాడు.
టి.ఎస్.ఆర్. ప్రధాన పాత్రలో ఎస్.ఆర్.కుమార్రాజా దర్శకత్వంలో చంద్ర పార్వతమ్మ రూపొందిస్తున్న చిత్రం ‘క్రీస్తు యేసు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని చారిత్రాత్మక చిత్రంగా అందించే ప్రయత్నం చేస్తున్నామని, భారతదేశ చలనచిత్ర రంగంలో ఓ మైలురాయిగా నిలిచిపోయే విధంగా తీర్చిదిద్దామని తెలిపారు.
చారిత్రాత్మక కథాంశంతో ఎస్ఎస్ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో పెద్దరాసు సుబ్రహ్మణ్యం రూపొందించిన చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని, త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇంద్రనీల్ గుప్తా, జారాషా, అభిషేక్, కర్తవ్య, మృణాల్, నీరజ్, మృదాంజలి ప్రధాన తారాగణంగా రాజ్మాదిరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఐతే 2.0’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..
వెనె్నల క్రియేషన్స్ పతాకంపై శ్రీ విష్ణు, చిత్రశుక్ల జంటగా కుమార్ దర్శకత్వంలో బలగ ప్రకాష్రావు రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత బలగ ప్రకాష్రావు మాట్లాడుతూ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ పూర్తిచేశామని, పాటలతోపాటు కొంత టాకీపార్టు చిత్రీకరించిన ఈ సినిమాలో కుటుంబంలోని అనుబంధాలు, యాక్షన్లకు ప్రాధాన్యత ఉందని తెలిపారు.
రామ్శంకర్, నికిషాపటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్వర్మ, ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా కథానాయకుడు రామ్శంకర్ మాట్లాడుతూ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా సాగే ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ జరుపుతున్నామని అన్నారు.
విశాల్ కథానాయకుడుగా పాండ్యరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందించిన చిత్రం ‘కథకళి’. ఈ సినిమాను తెలుగులో శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, తమిళంలో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా అందరికీ నచ్చుతుందని, ఒక హత్య నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందిందని తెలిపారు.
సుశాంత్ కథానాయకుడుగా శ్రీ నాగ్ కార్పొరేషన్, శ్రీ జి ఫిలిమ్స్ పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం..రా’ (జస్ట్ చిల్). ఈ సినిమాకు సంబంధించిన టాకీ, యాక్షన్ పార్ట్లు పూర్తయ్యాయి.
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై జి.వి.ప్రకాష్కుమార్ కథానాయకుడుగా శ్యామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నాకు ఇంకోపేరుంది’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోంది. పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.