S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కృష్ణ అజయ్, శ్రావ్య జంటగా హెచ్.ఎస్.సహన దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రాన్ని ‘పంతులుగారి అమ్మాయి’ పేరుతో విడుదల చేస్తున్నారు. చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. సీనియర్ దర్శకుడు సాగర్ సీడీలను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ,‘ ట్రైలర్స్, సాంగ్స్ బాగున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా వుంది.’ అన్నారు.
నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో హీరోయిన్గా పరిచయమై తొలి సినిమాతోనే మంచి హిట్తోపాటు గుర్తింపును సంపాదించుకున్న మెహ్రిన్ ఇప్పుడు టాలీవుడ్లో జోరు పెంచింది. ప్రస్తుతం పలు అవకాశాలతో జోరుమీదున్న ఈ భామ మంచి సినిమాల్లో ఛాన్స్ వస్తే గ్లామర్గా కూడా కనిపించేందుకు సై అంటోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ డోస్ పెంచక తప్పదనే భావిస్తున్నట్టుంది.
ప్రస్తుతం ‘సరైనోడు’తో బిజీగా వున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత వెంటనే సినిమాలు చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరైనోడు ఏప్రిల్ 22న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత తదుపరి చిత్రాలకోసం కథలు వింటున్న అల్లు అర్జున్ లేటెస్ట్గా ఓ చిత్రాన్ని ఓకే చేసినట్టు తెలుస్తోంది.
వినయ్రాయ్, స్వస్తిక, సాక్షి చౌదరి హీరో, హీరోయన్లుగా తమిళ దర్శకుడు శరన్ దర్శకత్వంలో ఆర్.కె.్ఫలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ నిర్మిస్తున్న కింగ్స్ చిత్రం మార్చి 3నుంచి చివరి షెడ్యూల్ జరుపుకోనుందని నిర్మాత చెప్పారు. ‘ఇటీవలే బ్యాంకాక్, మారిషస్లలో రెండు పాటలు, కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించాం. మార్చి 3నుంచి హైదరాబాద్లో జరిగే చివరి షెడ్యూల్తో సినిమా పూర్తవుతుంది.
త్రిష కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం ‘నాయకి’. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి గోవి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసి, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. వీడియో మోషన్పోస్టర్ను హైదరాబాద్లో కథానాయిక త్రిష విడుదల చేశారు.
తెలుగులో పలు చిత్రాల్లో హాస్య నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి బండ జ్యోతి శుక్రవారం అర్ధరాత్రి తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పలు చిత్రాల్లో సహాయ నటిగా కూడా కనిపించింది. విజయరామరాజు, కళ్యాణరాముడు, స్వయంవరం, భద్రాచలం, గణేష్, డైరీ వంటి పలు చిత్రాల్లో నటించిన బండ జ్యోతి మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
ఇప్పటివరకూ మోడ్రన్గా కనిపించిన నేను మొదటిసారిగా స్లమ్లో వుండే అమ్మాయిగా మాస్ పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర చేయడం నాకు కొత్తగా అనిపించిందని అంటోంది హీరోయిన్ రేష్మీ. సినిమాల్లో హీరోయిన్గా కంటే కూడా జబర్దస్త్ ప్రోగ్రామ్ యాంకర్గా బాగా పాపులర్ అయిన ఈమె నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు టాకీస్’.
అలామొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయమై తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది నందినీ రెడ్డి. ఆ తర్వాత ఆమె రూపొందించిన జబర్దస్త్ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
వైభవ్, రమ్యా నంబీసన్ జంటగా తమిళంలో రూపొందిన ‘డమాల్ డుమీల్’ చిత్రాన్ని ధనాధన్ పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని. బ్లాక్బస్టర్ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్లో విడుదలయ్యాయి.
సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు.’ యూనీ క్రాఫ్ట్ మూవీస్ పతాకంపై జి.సి.జగన్మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మాజీ మంత్రి వేణుగోపాలాచారి క్లాప్ నివ్వగా, వేమూరి రాధాకృష్ణ స్విచ్ ఆన్ చేశారు. చలసాని శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు.