S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రామ్కార్తీక్, కాశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిమ్ మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో హీరో నిఖిల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారని అన్నారు.
మళయాలంలో సంచలన విజయం సాధించిన ‘ప్రేమమ్’ సినిమాను తెలుగులో అదే పేరుతో అక్కినేని నాగచైతన్య రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తనకు మరింత పేరుతెచ్చిపెడుతుందన్న నమ్మకాన్ని చైతూ వ్యక్తం చేస్తున్నాడు. ఈమధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్కు వస్తోన్న రెస్పాన్స్కూడా టీమ్ నమ్మకాన్ని రెట్టింపుచేసింది.
శ్రీను వైట్లతో మళ్లీ వరుణ్‘లోఫర్’ తర్వాత మూడు నెలలు గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాని ఇంకా సెట్స్పైకి తీసుకెళ్ళలేదు. మార్చి నుంచి క్రిష్ దర్శకత్వంలో ‘రాయబారి’ చేయాల్సి ఉన్నా అది వాయిదా పడింది. దాంతో దిల్రాజు బ్యానర్లో వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి వరుణ్ సిద్ధం అయ్యాడు.
జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుంటూరు టాకీస్’. సిద్ధు, నరేష్ విజయ్కృష్ణ, రేష్మీగౌతమ్, శ్రద్ధాదాస్, మంచు లక్ష్మి, మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రాన్ని ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై రాజ్కుమార్ ఎం. రూపొందించారు. ఈ చిత్రాన్ని వచ్చేనెల 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నాని కథానాయకుడుగా శ్రీదేవి మూవీస్ పతాకంపై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సురభి, నివేద థాంప్సన్ కథానాయికలుగా నటించనున్న ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ 40 శాతం పూర్తయింది.
‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరిపోయిన దర్శకుడు కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ‘జనతా గ్యారేజ్’ అంటూ ఓ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుంచే ఆ సినిమాపై సర్వత్రా ఆసక్తికనిపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ మరో ప్రధాన పాత్రలో నటించనుండడం కూడా ఈ ప్రాజెక్టుకు ఓ ప్రత్యేకత తెచ్చిపెట్టింది.
‘నా జీవితంలో చేసిన చిత్రాలన్నిటికంటే భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రం ఇది. దర్శకుడు, నేను కలసి కొత్తగా కామెడీని ఎలా పండించాలని, ఎలా తీస్తే బావుంటుందో ఆలోచించి ఈ చిత్రాన్ని చేశా’నని కథానాయకుడు సునీల్ తెలిపారు. నిక్కీగల్రాని, డింపుల్ చోపడే కథానాయికలుగా సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో రాజు రూపొందించిన ‘కృష్ణష్టామి’ విడుదలైన సంగతి తెలిసిందే.
స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్పై ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్రెడ్డి, త్రినాథ్ ప్రధాన పాత్రల్లో నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘దండకారణ్యం’. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. గద్దర్ ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు అందించారు.
నూతన నటీనటులు వికాశ్, కళ్యాణి జంటగా దుర్గాదేవి ఫిలిమ్ మేకర్స్ పతాకంపై ఎన్.డి.ఉదయ్కుమార్ దర్శకత్వంలో కవనరెడ్డి నాగేశ్వరరావు రూపొందిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీజాన్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధంచేస్తున్నారు.
సూర్యతేజ, హర్షికా పునాచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో జంపా క్రియేషన్స్ బ్యానర్పై రూపొందుతున్న చిత్రం ‘అప్పడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్కుమార్ జంపా నిర్మాత. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన వచ్చింది. దీంతో చిత్ర బృందం సోమవారం హైదరాబాద్లో ఆడియో సక్సెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రదీప్కుమార్ జంపా మాట్లాడుతూ..