S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగులో పలు హిట్ చిత్రాల్ని నిర్మించి పెద్ద నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళనాడులో ‘గంగ’ సినిమాతో వంద కోట్ల మైలురాయిని చేరుకున్న లారెన్స్ రూపొందిస్తున్న మరో హారర్ ఎంటర్టైనర్ చిత్రమిది.
రుద్ర, సంజయ్, వెనె్నల ప్రధాన తారాగణంగా శివకృతి క్రియేషన్స్ పతాకంపై ఎం.వి.సాగర్ దర్శకత్వంలో కీలం కిరణ్కుమార్ రూపొందించిన చిత్రం ‘వీరీ వీరీ గుమ్మడిపండు’ (రచ్చరంబోలా). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ఈనెల 26న విడుదలకు సిద్ధం చేశారు.
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇలియానాకు బాలీవుడ్లో సెటిల్ అవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చిందో గానీ అక్కడ మాత్రం ఎన్ని కష్టాలుపడ్డా ఈ భామకు కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి తీరుగానే వుంది. అవకాశాలు అందిపుచ్చుకున్నా కూడా సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండడంతో అవకాశాలు సన్నగిల్లాయి.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘హాథీరామ్బాబా’ చిత్రంలో నటిస్తున్నానని, ఈ ఏప్రిల్లోనే షూటింగ్ మొదలవుతుందని హీరో నాగార్జున తెలిపారు. ‘సోగ్గాడే చిన్నినాయన’ విడుదలై 35రోజులు అయిన సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో శనివారం నాగార్జున ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పలు విశేషాలు తెలిపారు.
అజయ్ కీలక పాత్రలో భరత్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజా దర్శకత్వంలో భరత్కుమార్ పీలమ్ రూపొందించిన చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, నలుగురు దొంగలకు సంబంధించిన ఈ కథలో మంచి మెసేజ్ ఉందని, అందరూ మెచ్చే చిత్రం అవుతుందని చెప్పారు.
హర్షకుమార్, డాలి శర్మ జంటగా గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ పతాకంపై దీపక్ బలదేవ దర్శకత్వంలో ప్రకాశ్ ఠాకూర్ రూపొందిస్తున్న చిత్రం ‘్ఫల్మూన్‘. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హిందీ భాషల డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ వెనె్నల ఎంతగా చల్లగా వుంటుందో అంత చల్లనైన కథా కథనాలతో తెరకెక్కిన ఈచిత్రంలో మూడు జంటలు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని ఇస్తాయని తెలిపారు.
మలయాళంలో విజయవంతమైన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రాన్ని తెలుగులో ‘జతగా’ అనే పేరుతో అనువదించారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులో అందిస్తున్నారు. అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం నితిన్తో ‘అ ఆ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొలచ్చిలో జరుగుతుంది. ఈ సినిమా తరువాత ఆయన ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే త్రివిక్రమ్తో చేయడానికి పలువురు హీరోలు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం సూర్య హీరోగా ఆయన ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
రవితేజ కథానాయకుడిగా నటించనున్న ‘రాబిన్హుడ్’ సినిమా ప్రారంభానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈ సినిమాను మార్చి 4వ తేదీన లాంచ్ చేయనున్నారు. నిజానికి ‘ఎవడో ఒకడు’ తరువాత రవితేజ చేయవలసిన సినిమా ఇది. అయితే ఆ సినిమాను రవితేజ వదులుకోవడంతో ఈ సినిమా పట్టాలెక్కుతోంది.
నృత్య దర్శకుడు ప్రభుదేవా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించే తాజా చిత్రానికి ‘పాతాళభైరవి’ అనే పేరును పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన హీరోగా నటించనున్న ఈ హారర్ ఎంటర్టైనర్ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించనుంది. బాలీవుడ్లో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభుదేవా చాలాకాలం తర్వాత దక్షిణాదిలో చేస్తున్న చిత్రమిది. అయితే ఇదే పేరుతో మరో నిర్మాత కూడా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.