S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘లోఫర్’ సినిమా తరువాత పూరీ జగన్నాథ్ తెలుగు, కన్నడ భాషలలో ‘రోగ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా పూర్తయ్యాక పూరీ జగన్నాథ్ నందమూరి కల్యాణ్రామ్ కథానాయకుడిగా ఓ సినిమాను రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం సెట్స్పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో కథానాయికగా గ్లామర్ తార సురభి నటించనున్నది.
శ్రీకాంత్, నిఖిత జంటగా అఖండ భారత క్రియేషన్ పతాకంపై సతీష్ కాశెట్టి దర్శకత్వంలో షేక్ మాస్తాన్ రూపొందించిన చిత్రం ‘టెర్రర్’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి 4న విడుదలకు సిద్ధమైంది.
నిర్మాత సురేష్బాబుకు కోర్టులో చుక్కెదురైంది. త్వరలో నిర్మాతల కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆయన అనర్హుడని కోర్టు తీర్పునిచ్చింది. కోర్టుకు సమర్పించాల్సిన పత్రాలు సరైనవి అందించకపోవటంతో ఈ తీర్పు వెలువడటం విశేషం. దీంతో ఒక్కసారిగా ఫిలింనగర్ వర్గాలలో అలజడి ఏర్పడింది. తెలంగాణ ఫిలించాంబర్ సభ్యుడు మురళీమోహన్ కోర్టులో కేసు వేయగా విచారణ జరిపిన కోర్టు సురేష్బాబును అనర్హుడిగా ప్రకటించింది.
భరత్, అర్జున్, సుస్మిత ప్రధాన పాత్రల్లో ఫిరోజ్రాజా దర్శకత్వంలో భరత్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై భరత్కుమార్ పీలం నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగారింట్లో ఏడవరోజు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది.
ఆది, అదాశర్మ జంటగా మధన్ దర్శకత్వంలో శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై సురేఖ నిర్మిస్తున్న చిత్రం ‘గరం’. ఈ చిత్రం ఈనెల 12న విడుదలకు సిద్ధవౌతున్న సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సాయికుమార్ మాట్లాడుతూ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సినిమా ఇదన్నారు. ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందని, తప్పకుండా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని అన్నారు.
మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్గా గత ఏడాది సంచలనం సాధించిన ‘2 కంట్రీస్’ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సొంతం చేసుకున్నాడు. మలయాళంలో దిలీప్, మమతామోహన్దాస్, ఇషాతల్వార్లు ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం తక్కువ బడ్జెట్తో నిర్మితమై 50 కోట్ల మార్కెట్ను సాధించింది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా రీమేక్ హక్కులను భారీ కాంపిటీషన్ మధ్య బండ్ల గణేష్ సొంతం చేసుకున్నాడు.
ఈ సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో బాక్సాఫీసువద్ద మంచి కలక్షన్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఇప్పటికే ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్లో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ రామ్చరణ్కోసం కథ సిద్ధం చేస్తున్నాడని తెలిసింది.
సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మ రియల్ లైఫ్స్టోరీలు, వివాదాస్పద చరిత్రలను తెరకెక్కించడంలో దిట్ట. ఎవరూ టచ్ చేయని నేపథ్యాలతో సినిమాలు తీసి, వివాదాలు సృష్టించడంలో ఆయనే ముందుంటాడు. గతంలో పరిటాల రవి జీవితంపై ‘రక్తచరిత్ర’ సినిమా తీసి, సక్సెస్ అయిన వర్మ ఇటీవలే వీరప్పన్ జీవిత కథతో ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు.
అసద్షాన్, యాంబర్రోజ్ జంటగా నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లండన్ లైఫ్’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 12న విడుదలకు సిద్ధవౌతున్న సందర్భంగా ఫిలిమ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు నవీన్ మేడారం మాట్లాడుతూ, హాలీవుడ్లో 30 సినిమాలకు పనిచేసిన అనుభవంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించానన్నారు.
కన్నడంలో విజయవంతమైన ‘ముం జాని’ అనే చిత్రాన్ని తెలుగులో జయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై చిగులూరి గంగాథర్ చౌదరి అందిస్తున్న చిత్రం ‘జర్నీ-2’. గణేష్, మంజరి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్. నారాయణ దర్శకత్వం వహించారు.