S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కృష్ణ, విజయనిర్మల జంటగా ఎస్బీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శ్రీశ్రీ’. చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 18న ఆడియో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణ 50 ఏళ్ల సినిమా కెరీర్ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సినీ స్వర్ణోత్సవ కార్యక్రమం కూడా జరుగనున్నది.
హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తరుణ్శెట్టి, అవంతికా జంటగా నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘మీకు మీరే..మాకు మేమే..’ ఈ చిత్రానికి సంబంధించిన పాటల సీడీని హైదరాబాద్లో అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు చేసిన లఘు చిత్రాలను చూసి ఆశ్చర్యపోయి తనకు ఓ చిత్రం చేయమని అడిగానని, ఉద్యోగం వదిలేసి సినిమాపై ఆసక్తితో ఆయన వచ్చారని తెలిపారు.
టాలీవుడ్ క్రేజీ గ్లామర్ భామ రకుల్ప్రీత్సింగ్ మరోసారి మెగా హీరో రామ్చరణ్తో జోడి కట్టింది. ఇదివరకే వీరిద్దరూ కలిసి ‘బ్రూస్లీ’ సినిమాలో నటించారు. మరోసారి వీరిద్దరూ కలిసి నటించే సినిమా రక్షక్! అవును మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్కు రీమేక్గా రూపొందే ఈ సినిమాలో రకుల్ప్రీత్సింగ్ ఫైనల్ అయ్యింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సొనారిక జంటగా తమిళ సందరపాండ్యన్కు రీమేక్గా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం స్పీడున్నోడు. భీమనేని సునీత నిర్మాత. ఫిబ్రవరి 5న విడుదల చేసిన ఈ సినిమా సక్సెస్మీట్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ సినిమా అన్ని థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోందన్నారు. టీం ఎఫర్ట్ వలనే ఈ విజయం సాధ్యమైందన్నారు.
తెలుగు పరిశ్రమలో అన్ని కమర్షియల్ సినిమాలు మాత్రమే వస్తాయి. విభిన్న కథాచిత్రాలు రావు అనే అపోహ ఉంది ప్రేక్షకుల్లో. అప్పుడప్పుడు ఒకరోఇద్దరో దర్శకులు కళాత్మక సినిమాలు తీయగలమని రుజువుచేస్తూ ఉంటారు. అలాంటి దర్శకుల్లో ఒకరు నరసింహనంది. ఇప్పుడున్న దర్శకుల్లో ఈయనది మరో దారి. కమర్షియల్ సినిమాలకు దూరంగా కానె్సప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను రూపొందిస్తూ మంచి గుర్తింపుతెచ్చుకున్నారు.
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అందాల ముద్దుగుమ్మ అదాశర్మ. ఆ తరువాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్సేల్’ చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా ఆదితో కలిసి గరంగరంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరుస హిట్స్ తర్వాత మాచో హీరో గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమాతో భారీ ప్లాప్ని అందుకున్నారు. రెగ్యులర్ ఫార్మాట్లో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ ఓ డిఫరెంట్ కథాంశంతో చేస్తున్న కమర్షియల్ సినిమా ‘ఆక్సిజన్’. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్.రత్నం కుమారుడు ఏ.ఎమ్.జ్యోతికృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఫిబ్రవరినుంచే సెట్స్పైకి వెళ్లనుంది.
సౌత్ గ్లామర్ భామ త్రిష ఇప్పుడు వరుసగా సినిమాలుచేస్తూ మంచి జోరుమీదుంది. ఇప్పటికే ఈ భామ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. గ్లామర్ భామగా ఆకట్టుకుంటున్న త్రిషకు ఇప్పుడు ఆ హీరోతో నటించాలని తెగ ఆరాటపడుతుంది. ఇప్పటికే స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు నటించాలనుకున్న హీరో ఎవరో తెలుసా? తమిళ సూపర్స్టార్ అజిత్? అవును ఇప్పటివరకు ఆయనతో ఆమె నటించలేదు. ఆయన సరసన నటించే అవకాశంకోసం రెడీగా ఉన్నానంటూ చెప్పింది.
నాగశౌర్య, మాళవికానాయర్ జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై బి.వి.నందినీరెడ్డి దర్శకత్వంలో కె.ఎల్.దామోదర్ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నాని, మెహ్రీన్కౌర్ జంటగా హను రాఘవపుడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మెహ్రీన్తో ఇంటర్వ్యూ..
మీ నేపథ్యం..