S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలకు తెరలేపిన వెంకటేష్, ప్రస్తుతం సోలో హీరోగా వరుస సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆయన మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతోపాటు ఆయన మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రముఖ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని అంటున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో చాలా చిత్రాలు చేసినప్పటికీ కెరీర్ పరంగా
సరైన సక్సెస్ని అందుకోలేకపోయింది గ్లామర్ భామ తాప్సి. అవకాశాలైతే జోరుగా అందుకుంటున్న ఈ భామకు తాజాగా మరో క్రేజీ అవకాశం దక్కింది. ఇప్పటికే బాలీవుడ్లో రెండు మూడు చిత్రాల్లో నటించిన తాప్సి తాజాగా
‘మొదట బాలకృష్ణగారితో సినిమా అనగానే చాలా టెన్షన్ పడ్డాను. అంత పెద్ద స్టార్ హీరోతో పనిచేయడం అంటేనే చాలా టెన్షన్తో కూడుకున్న పని. కానీ, ఆయనతో పనిచేసినప్పుడు మాత్రం చాలా సపోర్టు అందించారు’ అని అంటోంది హీరోయిన్ అంజలి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘గీతాంజలి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో నటించి ఆకట్టుకుంది.
ప్రపంచ చలన చిత్రరంగంలో ఆస్కార్ తరువాత అంతటి కీర్తిప్రతిష్టలున్న పురస్కారం ‘గోల్డెన్గ్లోబ్’ అవార్డు. 2015గాను ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన చిత్రంగా ‘ది రెవెనెంట్’ నిలిచింది. కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ చిత్రబృందం ఆనందడోలికల్లో తేలిపోయింది.
ఇటీవలే వచ్చిన ‘నేను..శైలజ’ చిత్రంతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ కీర్తి సురేష్. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా. ఈ సినిమా తరువాత ఇపుడు కీర్తి సురేష్కు టాలీవుడ్లో మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. మెగా హీరో సరసన ఆమె నటింబోతోందని తెలుస్తోంది.
అజయ్ భరత్, అర్జున్, వెంకటేష్, సుస్మిత, బిందు, బార్బి ప్రధాన తారాగణంగా భరత్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజా దర్శకత్వంలో భరత్కుమార్ పీలం రూపొందించిన చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు.
వాస్తవ సంఘటనలు, వ్యక్తుల నిజ జీవిత చరిత్రలను కథాంశాలుగా తీసుకుని రూపొందించిన చిత్రాలు ఎప్పుడూ మంచి విజయాన్ని అందుకుంటూనే వుంటాయి.
రాజ్తరుణ్, ఆర్తన జంటగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. దర్శకుడు ఎన్.శంకర్ సీడీలను ఆవిష్కరించారు.
నవన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖా క్రియేషన్స్ పతాకంపై జగదీష్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని రూపొందించిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ చిత్రం ఈనెలాఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- నూతన సంవత్సర కానుకగా ఈనెల 1న విడుదల చేద్దామనుకున్నామనీ, కానీ కారణాంతరాలవల్ల ఈనెలాఖరుకు విడుదల చేస్తున్నామని అన్నారు.
నవీన్ సంజయ్, వౌనిక జంటగా కావేరి ట్రావెల్స్ సమర్పణలో తమ్మినీడు సతీష్బాబు దర్శకత్వంలో ఎంపి నాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘జానకిరాముడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ క్లైమాక్స్ దశకు వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.