S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ త్వరలో హీరోగా నటించనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రంలో నటించే కథానాయిక కోసం అనే్వషణ జరిగింది. చివరికి అనేకమంది పేర్లు పరిశీలించి, సమంతని ఎంపిక చేశారు. చివరకు సమంత అయితేనే ఈ చిత్రానికి న్యాయం జరుగుతుందని ఆమెను అడగడం, దానికి ఆమె ఒప్పుకోవడం జరిగింది. త్వరలో ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియనుంది.
ఈమధ్యకాలంలో హీరోహీరోయిన్లు నటననే కాకుండా పాటలు పాడడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే పవన్కళ్యాణ్, మహేష్బాబు, ఎన్టీఆర్లు పాటల పాడి ఆకట్టుకున్నారు. తాజాగా ఈ లిస్టులోకి చేరింది గ్లామర్ భామ కాజల్. ఇప్పుడు ఈమె సరసన మరో హీరోయిన్ చేరనుంది. దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని, తనదైన గ్లామర్తో ఆకట్టుకున్న ప్రియమణికి ఈమధ్య అసలు కలిసిరావడం లేదు.
సాధారణంగా సినిమా పరిశ్రమలో మహిళా దర్శకులు చాలా తక్కువ. తెలుగు చిత్ర పరిశ్రమలో వాళ్లను వేళ్లపై లెక్కించవచ్చు. మీడియా రంగంనుండి దర్శకురాలిగా తాను చేసిన తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు బి.జయ. తాజాగా ‘లవ్లీ’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘వైశాఖం’ చిత్రాన్ని కొత్త నటీనటులతో తెరకెక్కించనున్నారు.
‘తేనెటీగ’, ‘గజబలుడు’, ‘గెలుపుగుర్రాలు’ చిత్రాలు రూపొందించిన నిర్మాత సి.ఆర్.రాజన్ ఇకముందు ప్రజలకు సందేశం ఇచ్చే చిత్రాలను నిర్మిస్తామంటున్నారు. జన్మదినోత్సవ సందర్భంగా పలు నిర్ణయాలను తీసుకున్న తాను ఇకనుండి మంచి చిత్రాలను రూపొందిస్తానని అంటున్నారు.
కన్నడంలో రూపొంది తెలుగులో విడుదలైన దండుపాళ్యం సీక్వెల్ రానుంది. వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందించనున్న ఈ చిత్రానికి ‘దండుపాళ్యం-2’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 14న ప్రారంభం కానుంది.
సునీల్, నిక్కీగల్రాని, డింపుల్చోపడే ప్రధాన తారాగణంగా వాసువర్మ దర్శకత్వంలో రాజు రూపొందించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం రాజమండ్రిలో జరిగింది.
మాస్, కమర్షియల్ సినిమాలకే పరిమితం కాదనని, సత్తా ఉన్న కథ ఉంటే క్లాస్ సినిమాలూ చేస్తానంటున్నారు జూనియర్ ఎన్టీఆర్.
నందమూరి బాలకృష్ణతో పోటీ ఏమీ లేదని, మా కుటుంబంలో ఎవరిమధ్యా అలాంటి వాతావరణం ఉండదని, ఎవరి సినిమాలు వారివని ఆయనంటున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఈనెల 13న విడుదల కానున్న నేపథ్యంలో ఆయనతో ముఖాముఖి...
గెడ్డం తీశారు, ఎలా వుంది?
ఆమధ్య మైనా సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అందాల భామ అమలాపాల్ ఆ తర్వాత వరుస అవకాశాలతో క్రేజీ హీరోయిన్గా మారింది. పలు చిత్రాల్లో నటించి, మంచి గ్లామర్ భామగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈమధ్యే దర్శకుడు విజయ్ని వివాహం చేసుకుని, సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ భామ సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన మేము చిత్రంలో తల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంది.
‘కర్తవ్యం’ సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించి, ‘జెంటిల్మెన్’, ‘్భరతీయుడు’ వంటి సంచలన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తండ్రి అరణి మునుస్వామి (96) మృతి చెందారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఉంటున్న ఆయన నిన్న మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. పెద్దకుమారుడైన ఎ.ఎం.రత్నం నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. మరో తనయుడు దయాకర్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు.
ఆనంద్, రాజ్పాల్ ముఖ్యపాత్రల్లో విజయ్శేఖర్ సంక్రాంతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘7టు4’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో సెన్సార్కు సిద్ధమైన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు విజయ్శేఖర్ మాట్లాడుతూ ‘ఈనెల 12న సెన్సార్ జరగనుంది. ఈ సినిమాను టీమ్ అందరూ కలిసి ఎంతో ఎఫర్ట్పెట్టి పనిచేశారు. రాత్రి 7 గంటలనుండి ఉదయం 4 గంటల వరకు జరిగే కథతో ఈ చిత్రం ఉంటుంది.