S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రముఖ దర్శకుడు శంకర్ సారథ్యంలో సూపర్స్టార్ రజనీకాంత్ ‘రోబో-2.0’లో హీరోయిన్గా నటిస్తున్న అమీ జాక్సన్ నోరుజారి తమిళ ప్రజల ఆగ్రహానికి గురైంది. జల్లికట్టు ఆటపై నిషేధాన్ని సమర్ధిస్తూ బాలీవుడ్ తారలు చేసిన వ్యాఖ్యలతో గుర్రుమీద ఉన్న తమిళనాడు ప్రజలు ఇప్పుడు ఆ కోపాన్ని అమీజాక్సన్పై చూపిస్తున్నారు. సినిమాలకు సంబంధంలేని అంశాలపై ఆమె ఎందుకు నోరు మెదపాలని ప్రశ్నిస్తున్నారు.
గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న అందాల భామ సమంతా ఇప్పుడు ఓ లేడీ
ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో
మహేష్ సరసన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటిస్తున్న ఈమె తమిళంలో సూర్య
సరసన ‘24’, విక్రం సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాల తరువాత విక్రం కుమార్
అనుమానాస్పద స్థితిలో మరణించిన నటుడు రంగనాథ్కు తెలుగు చలనచిత్రసీమ, అభిమానులు అంతిమవీడ్కోలు పలికారు. అశ్రునివాళి అర్పించారు. శనివారం ఆయన ఆత్మహత్య పాల్పడిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన మృతదేహాన్ని ఫిలింనగర్లోని ఫిలింఛాంబర్లో ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచారు. అనంతరం బన్సీలాల్పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ‘డిక్టేటర్’ చిత్రం ఆడియోఫంక్షన్ను
ఆదివారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. బాలకృష్ణ, అంజలి
జంటగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
వీరంతా బస్సుల్లో హైదరాబాద్నుంచి అమరావతికి వెళ్లారు. మార్గం
అంతటా బాలకృష్ణ బృందానికి అభిమానులు నీరాజనాలు పలికారు.
నవీన్ సంజయ్, తనిష్ తివారి, తన్వి మల్హర్ ముఖ్య పాత్రలో ప్రేమరాజ్ దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తున్న ‘శరణం గచ్చామి’ చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభం అయింది. హీరో హీరోయిన్స్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇవ్వగా, బొమ్మకు లక్ష్మి నరసమ్మ స్విచ్ ఆన్ చేయగా సానా యాదిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించాడు.
సువర్ణ క్రియేషన్స్ పతాకంపై పి.డి.రాజు ప్రధాన పాత్రలో టి.సుధాకర్ రూపొందిస్తున్న చిత్రం ‘తొలి కిరణం’. జె.జాన్బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం సారధి స్టూడియోలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ప్రపంచానికి వెలుగు చూపిన ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.
శే్వతామీనన్ ప్రధాన పాత్రలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్రావు రూపొందిస్తున్న ‘షీ’ (ఈజ్ వెయిటింగ్) చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో ఫారెస్ట్ లొకేషన్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశంపై రమ్య క్లాప్ ఇవ్వగా, అనూప్సింగ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూరి జగన్నాథ్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ‘ఎక్స్ప్రెస్ రా జా’ చిత్రం సూపర్హిట్ కావాలని హీరో ప్రభాస్ ఆకాంక్షించాడు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎక్స్ప్రెస్ రాజా’ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ సీడీని, ఆడియో సీడీని ఆవిష్కరించారు.
విజయ్భరత్, అశ్విని, కాంచన ప్రధాన తారాగణంగా ఎస్ఎస్సెల్యులాయిడ్స్ పతాకంపై జైశ్రీరామ్ దర్శకత్వంలో పొట్నూరు శ్రీనివాసరావు రూపొందిస్తున్న హాస్యభరిత చిత్రం ‘వినోదం 100%’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సంపూర్ణేష్బాబు, పృధ్వీ కీలకమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను దర్శకుడు మారుతి విడుదల చేసారు.
‘లోఫర్’ సినిమాతో మంచి హిట్ను తన ఖాతాలో వేసుకున్న పూరి జగన్నాథ్ తన
తదుపరి చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోగ్’. ఈ సినిమాతో కన్నడ నటుడు ఇషాన్ని హీరోగా పరిచయం చేస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో
తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కే