S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మంచు విష్ణు, సోనారిక, రాజ్తరుణ్, హెబాపటేల్ హీరో హీరోయిన్లుగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందే చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
బైలో జరిగిన ‘బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ తారలు అందాలొలికించారు. ప్రఖ్యాత డిజైనర్లు స్టెల్లా మెక్కార్ట్నీ, రమిఅల్అలీ రూపొందించిన
విభిన్నమైన దుస్తులు ధరించిన దీపికపదుకొనె, సోనమ్కపూర్, అతియాశెట్టి ఆహూతులను అలరించారు.
మూడు దశాబ్దాలుగా ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి పేరుతో యువకళావాహిని సంస్థ అందిస్తున్న ప్రతిష్ఠాత్మక అవార్డును ఈ ఏడాదికిగాను ప్రముఖ దర్శకుడు గుణశేఖర్కు అందజేశారు. ఈ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి నారాయణరావు అవార్డును అందజేశారు.
ప్రశాంత్, లావణ్య, శిల్ప ప్రధాన తారాగణంగా హని, ప్రణి ఫిలిమ్స్ పతాకంపై నంది వెంకట్రెడ్డి దర్శకత్వంలో ఎ.వి.ఆర్. రూపొందించిన చిత్రం ‘వేటపాలెం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఎ.వి.ఆర్.
‘సాహసం’ చిత్రాన్ని గోపీచంద్తో కలిసి చేసింది తాప్సీ. ఆ సినిమాకి మంచి పేరు వచ్చినా తాప్సీకి మాత్రం అవకాశాలు ఒక్కటి కూడా రాలేదు. ఆ చిత్రంలో ఆమె నటనకు మార్కులు పడ్డాయి. కానీ ఎందుకో చుక్కెదురైంది. మళ్లీ దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఓ అవకాశం తాప్సీ గూటికి చేరింది. దగ్గుబాటి రానా కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘ఘాజి’ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.
సందీప్ కిషన్, అనీషాఆంబ్రోస్ జంటగా అనీ కనె్నగంటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం సంస్థ కార్యాలయంలో జరిగింది. కొరటాల శివ క్లాప్ ఇవ్వగా గొట్టిపాటి రవి కెమెరా స్విచ్చాన్ చేశారు. సంపత్నంది గౌరవ దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో చోటా కె.నాయుడు, రామ్ఆచంట, గోపీచంద్ ఆచంట, యలమంచిలి రవిశంకర్, చుక్కపల్లి ప్రసాద్, గరికిపాటి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
‘గుండెల్లోగోదారి’, ‘వైశాలి’, ‘ఒక విచిత్రమ్’, ‘మృగం’ చిత్రాలతో నటుడిగా పరిచయమున్న ఆది పినిశెట్టి తాజాగా నటించిన చిత్రం ‘మలుపు’. ఈ చిత్రం తమిళంలో రూపొందించి, తెలుగులో కూడా అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను ఆయన వివరించారు.
సినిమా ఎలా వుంటుంది?
‘బెంగాల్ టైగర్ చిత్రం అక్టోబర్లోనే విడుదలకు సిద్ధమైంది. కానీ ఒకేసారి అన్ని చిత్రాలు విడుదల కావడం పరిశ్రమకు మంచిది కాదు. అది నిర్మాతలకు నష్టం కూడా. అది ఇష్టంలేక డిసెంబర్లో విడుదల చేశాం. ఇప్పుడు అది కలిసొచ్చింది’ అని చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ చెబుతున్నారు. రవితేజ, తమన్నా, రాశిఖన్నా ప్రధాన తారాగణంగా సంపత్నంది దర్శకత్వంలో ఆయన రూపొందించిన ‘బెంగాల్ టైగర్’ విడుదలైన సంగతి తెలిసిందే.
గతంలో ‘ఆ ఇంట్లో’ లాంటి హారర్ చిత్రాల్ని తెరక్కెంచిన నటుడు చిన్నా మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. వికాస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆదరి రవికుమార్ రూపొందిస్తున్న చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన బ్రోచర్లను హీరో శ్రీకాంత్, శివారెడ్డి విడుదల చేశారు.
శ్రీ సాయి సినిమాస్ పతాకంపై సత్యనారాయణ సజ్జనపు దర్శకత్వంలో సాయి నాగుల్మీరా నిర్మిస్తున్న చిత్రం ‘అనుబంధం’ (శాటిలైట్తో). ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీశ్రీ శివరామచైతన్యం విచ్చేసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్యనారాయణ మాట్లాడుతూ నేటి యువతరంలోని అనుబంధాలను శాటిలైట్తో వాటి సంబంధాలను కొత్తదనంతో చూపించే వైవిధ్యభరిత చిత్రమే ఇదని తెలిపారు.