S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మయూఖ క్రియేషన్స్ పతాకంపై నవీన్చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని రూపొందించిన చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుపుతున్నారు.
రామ్చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రూస్లీ’ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాస్త నిరాశ చెందాడు రామ్చరణ్. తన తదుపరి చిత్రంతో మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. తాజాగా ఆయన నటించే చిత్రానికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. తమిళంలో సూపర్హిట్ సాధించిన ‘తనిఒరువన్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు ధనుష్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘తంగమగన్’. సమంత, అమీజాక్సన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వేల్రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగులో ‘నవ మన్మథుడు’ పేరుతో త్వరలో విడుదల కానుంది. డి.ప్రతాప్రాజ్ సమర్పణలో బృందావన్ పిక్చర్స్ పతాకంపై విడుదలవుతున్న ఈ చిత్రానికి ఎన్.వెంకటేష్, ఎస్.రవికాంత్ నిర్మాతలు.
మరాఠా యోధుడు పేష్వి బాజీరావ్ జీవితచరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రం ప్రమోషన్కోసం
సాయి వినాయక ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె.లక్ష్మణ్ రూపొందిస్తున్న ‘మనసు పిలిచింది’ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమం హైదరాబాద్ రామనారాయణ స్టూడియోలో ప్రారంభమైంది. ఎ.ఆర్.సన్ని సంగీత దర్శకత్వంలో పాటలు రికార్డు చేస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్.కె మాట్లాడుతూ, మొత్తం ఐదు పాటలు సన్నివేశపరంగా చిత్రంలో ఉన్నాయని, గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా చిత్రీకరిస్తున్నామని తెలిపారు.
ఆది, ఆదాశర్మ జంటగా శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ రూపొందించిన చిత్రం ‘గరం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ను హైదరాబాద్లో హీరో ప్రభాస్ విడుదల చేశారు.
దర్శకుడు లక్ష్మణ్ మురారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రానికి ‘రజనీకాంత్ డ్రెస్సింగ్ రూమ్’గా ఖరారు చేశారు. కలర్ విజన్ అనే అంశం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఆత్మల నేపథ్యం గూర్చి చర్చించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మురారి మాట్లాడుతూ, 45 నిమిషాల గ్రాఫిక్స్ కార్యక్రమాల కోసం లాస్ఏంజిల్స్లోని ప్రిస్విన్ స్టూడియోతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు చేయనటువంటి యాక్షన్ను బన్నీ చేస్తున్నాడట. రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశలో వుంది. బోయపాటి శైలిలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘సరైనోడు’ అనే టైటిల్ను పెట్టే ఆలోచనలో వుంది యూనిట్.
తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అదే రేంజ్లో విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది గ్లామర్ భామ రెజీనా. అందం, అభినయం అన్నీ పుష్కలంగా వున్న ఈ భామకు అదృష్టం మాత్రం కాస్త తక్కువనే చెప్పాలి. వరుసగా హిట్స్ అందుకుంటున్నా కూడా ఈమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం మాత్రం దక్కడంలేదు. ఇప్పటికే గోపీచంద్, సాయిధరమ్తేజ్, రవితేజ, మనోజ్ వంటి హీరోల సరసన నటించిన ఈ భామకు స్టార్ హీరోల సరసన నటించాలని తెగ ఆసక్తిగా వుంది.
అప్పట్లో హీరోయిన్గా హోలీ పాత్రలతో ఆకట్టుకున్న సుహాసిని అటుపై తల్లి, అక్క పాత్రల్లో నటిస్తూ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషలతోపాటు మలయాళంలో కూడా నటిస్తూ బిజీగా వున్న సుహాసినికి బాలీవుడ్లో క్రేజీ అవకాశం దక్కింది. బాలీవుడ్లో ఓ సినిమాలో కీలక పాత్ర చేయడానికి అవకాశం వచ్చిందట. తనకు మంచి గుర్తింపునిచ్చే పాత్ర కావడంతో చేయడానికి కూడా ఓకె చెప్పిందట సుహాసిని.