S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తరువాత మనోజ్ చెయ్యబోతున్న సినిమాపై రకరకాల వార్తలు వినిపించాయి. కానీ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మంచు నటించబోతున్నాడని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రయాణం’ సినిమాను తమిళ్లో రీమేక్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్వర్క్ జరుగుతోంది. త్వరలో ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటిస్తారు. మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య. ఆయన ఇటీవల గ్యాంగ్ సినిమాతో టాలీవుడ్లోనూ సక్సెస్ను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన తన తర్వాతి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా ఈ నూతన చిత్రంలోని పాత్రకోసం దర్శక నిర్మాతలు బాలీవుడ్ నటుడు అమితాబ్బచ్చన్ కలిశారని ఇటీవల వార్తలు వచ్చాయి.
భ రతవర్ష క్రియేషన్స్ పతాకంపై నూతన నటీనటులతో చెన్నకుని శెట్టి (కుమార్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం పూజా కార్యక్రమాలు ఫిలిం ఛాంబర్లో జరిగాయి. దర్శకుడు సముద్ర, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, సెక్రటరీ సాయివెంకట్, జివికె 4 మ్యూజిక్ వి.గోపాలకృష్ణ, మురళీ తదితరులు పాల్గొన్నారు.
జానపద చిత్ర కథానాయకుడు రాకుమారుడు కావొచ్చు.. ప్రజానాయకుడు కావొచ్చు.. ఆ పాత్ర ధరించిన నటుడు ఎన్.టి.రామారావు కావొచ్చు.. కాంతారావు కావొచ్చు.. కానీ, ఆ కథ పరిభ్రమించేది అందాల రాకుమారి చుట్టూ. ఆమెని చేపట్టాలని దుష్టుడైన సేనాధిపతి లేక, మంత్రాల మాంత్రికుడు ప్రయత్నిస్తాడు. వీటన్నింటికీ కేంద్ర బిందువు అందాల రాకుమారి.
కృష్ణకుమారి.. పాతతరం తెలుగు సినిమా కథానాయిక. పశ్చిమ బెంగాల్లో 1933 మార్చి 6న జన్మించారు. షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. తండ్రిగారు ఉద్యోగరీత్యా తరచుగా బదిలీల మూలంగా ఈమె విద్యాభ్యాసం రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా మొదలైన ప్రదేశాల్లో జరిగింది. మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత మద్రాసు చేరిన వీరి కుటుంబం అక్కడే స్థిరపడింది. తెలుగు సినిమా తెరకు నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయం అయ్యారు.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కల్యా ణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.
కార్తికేయ, హిమాన్షి, సుభాంగి పంతే ముఖ్యపాత్రల్లో నవీన్ మనె్నల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అంజలి’. ఈ చిత్ర ఫస్ట్లుక్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్లో జరిగింది. సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత నవీన్ మాట్లాడుతూ- ప్రేమలేఖ ఆధారంతో తెరకెక్కించిన థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది.
భాగమతి కథకోసం అనుష్కను మాత్రమే ఊహించుకున్నాను. ఆమె తప్ప ఇంకెవరూ చేయలేని పాత్ర ఇదని అంటున్నాడు దర్శకుడు అశోక్. పిల్లజమిందర్ చిత్రంతో మంచి దర్శకుడిగా గుర్తింపుతెచ్చుకున్న అశోక్, అటుపై రెండు మూడు చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన సినిమాలోని పాత్రలు రియాలిటీని చూపిస్తాయి. వాస్తవాన్ని కళ్లకు కనపడేలా చేస్తుంది. మనిషిలోని మరోకోణాన్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తాయి.
మంచు విష్ణుతో ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాల్ని తెరకెక్కించిన నాగేశ్వర్రెడ్డి మూడోసారి ‘ఆచారి అమెరికా యాత్ర’తో మన ముందుకు రానున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు జి.నాగేశ్వర్రెడ్డి ఈ సినిమా గురించి విషయాలు తెలియజేస్తూ..
ఆచారి యాత్ర..
జయం రవి, నివేదా పెతురాజ్ జంటగా చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్పై పద్మావతి చదలవాడ నిర్మితగా వస్తోన్న సినిమా ‘టిక్ టిక్ టిక్’. శక్తి సౌందర్రాజన్ దర్శకుడు. ఇండియన్ సినిమా చరిత్రలో ఫస్ట్ స్పేస్ సినిమాగా రూపొందింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జయంరవి చెప్పిన విశేషాలు..