S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
టాలీవుడ్లో తెరకెక్కనున్న మరో మల్టీస్టారర్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున, నానిలతో తెరకెక్కే ఈ మల్టీస్టారర్ గురించి ఇదివరకే ప్రకటన వచ్చింది. ‘్భలే మంచిరోజు’ సినిమా ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తికావచ్చాయి. నాగార్జున తన కుమారుడు అఖిల్ నటిస్తున్న ‘హలో’ విడుదల విషయంలో బిజీగా వున్నాడు.
అనిరుధ్.. ప్రస్తుతం సౌత్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. కొలవరి ఢీ సాంగ్తో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ కుర్ర సంగీత దర్శకుడు ప్రస్తుతం పవన్కళ్యాణ్ నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ఈ పాటలకు మంచి ఆదరణ లభిస్తోందన్న సంగతి తెలిసిందే. దీంతో అనిరుధ్ సంగీతానికి మరింత క్రేజ్ పెరిగింది.
అర్జున్రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా సంచలన హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ, వరుస చిత్రాలతో బిజీ బిజీగా వున్నారు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటిస్తున్న విజయ్, ఆ తరువాత పరశురామ్తో ఓ సినిమా చేయనున్నాడు. తెలుగు దర్శకులే కాకుండా తమిళ, కన్నడ దర్శకులు కూడా విజయ్తో చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాంటివాళ్ళల్లో విక్రమ్తో ఇరుముగన్ చిత్రాన్ని చేసిన ఆనంద్ శంకర్ కూడా ఒకరు.
ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్, మనీషారాజ్ జంటగా మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘2 కంట్రీస్’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సర్ట్ఫికెట్ అందుకున్న ఈ సినిమా ఈనెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్ టైటిల్కు, పోస్టర్కు, టీజర్, ట్రైలర్లకు విశేష స్పందన లభించిందని ఎన్.శంకర్ తెలియజేశారు.
అనుష్క ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘్భగమతి’. ఇప్పటికే ప్రేక్షకుల్లో అమితాసక్తిని క్రియేట్ చేసిన ఈ చిత్రం జనవరి 26న విడుదలకు సిద్ధమయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా టీజర్ బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జై సింహా’. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈనెల 24న ఆడియో విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ‘ఇటీవలే దుబాయ్లో చిత్రీకరించిన పాటతో షూటింగ్ పూర్తి అయింది.
బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం భాగ్యనగరంలో జరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్తోపాటు ప్రముఖ నటీనటులందరూ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్, పూజాహెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రం ‘సాక్ష్యం’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం దుబాయ్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా వివరాలు తెలియజేస్తూ- ‘హైదరాబాద్, పొల్లాచి, వారణాశి, హోస్పేట వంటి ప్రాంతాల్లో భారీ తారాగణంతో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపాం.
నాని.. చూడగానే అచ్చం మన పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. అచ్చంగా మనలాగే వుంటాడు, మనలాగే ప్రవర్తిస్తాడు. నటనలో తనకున్న ఈజ్తో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాడు. అందుకే హీరోగా స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. నానికి అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువే. తాజాగా మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎంసిఏ’ చిత్రం ఈనెల 21న విడుదలకు సిద్ధమయంది.
తాజాగా ‘జూలీ-2’ సినిమాతో గ్లామర్ పాత్రలో సంచలనం సృష్టించిన అందాల భామ లక్ష్మీరాయ్, మరో భిన్నమైన పాత్ర చేసేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ఆమె పోలీస్ పాత్రలో కనిపిస్తుందట. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు లాంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని, రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుకానున్నదట. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందే ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుందట.