S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సూపర్స్టార్ మహేష్బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘్భరత్ అనే నేను’ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలావరకు షూటింగ్ ముగించుకొన్న ఈ చిత్రం ఇంకో మూడు షెడ్యూళ్లల్లో మొత్తం చిత్రీకరణను ముగించుకోనుంది. ఈ మూడు షెడ్యూల్స్లో ఒకటి నేటి నుండి డిసెంబర్ 7వరకు హైదరాబాద్లో జరగనుంది.
వెంకట్, హృశాలి, పావని ప్రధాన తారాగణంగా రామ్ రణధీర్ దర్శకత్వంలో నాగరాజు, హుసేన్, ఇమ్మాన్యుయేల్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘రాయలసీమ లవ్స్టోరి’. చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం కర్నూలులో జరిగింది. టి.జి.వెంకటేష్ క్లాప్నివ్వగా, నర్వా రాజశేఖర్రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. టి.జి.్భరత్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈఏడాది ఇప్పటికే ఐదు సినిమాల సక్సెస్తో బాక్సాఫీస్ వద్ద నిర్మాతగా తన సెలక్షన్ ఆఫ్ మూవీస్ గురించి చెప్పకనే చెప్పిన దిల్రాజు.. ఇదే ఏడాది విడుదల కానున్న ‘ఎం.సి.ఏ’ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ సాధించనున్నారు. ఇదే ఊపులో వచ్చే ఏడాది ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు నిర్మాణంలో ఓ సినిమా రూపొందిస్తున్నారు.
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ ఆదాశర్మ మొదట బాలీవుడ్లో మూడు సినిమాలను సౌత్లో ఎక్కువగా అవకాశాలు దక్కించుకుంది. అయితే ఈ బ్యూటీకి అనుకున్నంతగా సక్సెస్లు అందలేదు. కన్నడ, తమిళంలో కూడా సినిమాలను చేసినా అవి కూడా ఏ మాత్రం లాభాన్ని అందించలేకపోయాయి. అయితే ఈమధ్యకాలంలో ఆదా ఎక్కువగా హాట్ ఫొటోస్తో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
రజనీకాంత్ హీరోగా ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం ‘రోబో-2’. సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్ విలన్గా నటించడం విశేషం.
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా యూత్లో క్రేజీ పాపులారిటీ సంపాదించుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ హవా ఇప్పుడు మామూలుగా లేదు. ‘అర్జున్ రెడ్డి’ తరువాత విజయ్ వరుసగా నాలుగు సినిమాలతో బిజీగా మారాడు. తాజాగా ఆయన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను గీత ఆర్ట్స్, యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుండగా ఇప్పటికే షూటింగ్ చాలా వరకు జరిగింది.
తమిళంలో హీరో విక్రమ్ నటించిన ‘సామి’ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. దాన్ని తెలుగులో బాలకృష్ణ హీరోగా ‘లక్ష్మీ నరసింహ’ పేరుతో రీమేక్ చేశాడు. చాలా రోజుల తరువాత ఇప్పుడు ‘సామి’కి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. సామి మొదటి భాగంలో హీరోయిన్గా నటించిన త్రిషనే మళ్లీ హీరోయిన్గా పెట్టాలని ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రపోజల్కు త్రిష కూడా ఓకె చెప్పింది. దానికితోడు..
కమల్హాసన్ తనయ శృతిహాసన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందా అన్న ప్రశ్నకు ఔను అన్న సమాధానం వినిపిస్తోంది అటు కోలీవుడ్ నుండి ఇటు బాలీవుడ్ దాటా. లండన్ నటుడు మైఖేల్ కోర్సెల్తో ఆమె ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి అనేకసార్లు కనిపించారు కూడా. అయితే సోషల్ మీడియాలో పెళ్లి వార్తలు గురించి మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు శృతి చేయడంలేదు.
‘‘జవాన్ చిత్రంలో సోషల్ మెసేజ్ వున్నా పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కింది. ఆర్ఎస్ఎస్ స్టూడెంట్గా నటించా. అన్ని రకాల చిత్రాలు చేయడానికి సిద్ధం. కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తా’’ అని హీరో సాయిధరమ్ తేజ్ తెలిపారు. అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ‘జవాన్’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ పలు విశేషాలు తెలిపారు.
సామాజిక సందేశంతో..
పవన్కళ్యాణ్-త్రివిక్రమ్ కలయికలో ‘అజ్ఞాతవాసి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి పాటకు మంచి స్పందన లభించడంతో రెండో పాటను కూడా విడుదల చేయనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోను డిసెంబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్లుక్ కూడా మంచి స్పందన లభించింది.